RangaReddy

News June 21, 2024

HYD: మాదిగల ఉనికి లేకుండా కుట్ర చేస్తున్న CM: మోత్కుపల్లి

image

CM రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో మాదిగల ఉనికి లేకుండా చేయాలన్న కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు బొంకూరి సురేందర్‌ సన్ని అధ్యక్షతన శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ మొదటి నుంచే మాదిగలకు మోసం చేస్తుందని, 80 లక్షల జనాభా కలిగిన మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు.

News June 21, 2024

HYD: విదేశీ భాషల పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. జర్మన్, ఫ్రెంచ్ భాషల్లో పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని చెప్పారు.

News June 21, 2024

HYD: బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాలు: జగ్గారెడ్డి

image

యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం సరికాదన్నారు. శుక్రవారం ఆయన HYD గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌కు యూపీఏ హయాంలోనే పర్మిషన్లు వచ్చాయన్నారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే, గడిచిన పదేళ్లలో దాదాపు 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు.

News June 21, 2024

HYD: దానం నాగేందర్‌కు BRS MLA కౌంటర్

image

BRS పార్టీ ఖాళీ అవుతుందని ఖైరతాబాద్ MLA, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు BRS నాయకుడు, కుత్బుల్లాపూర్ MLA కేపీ వివేకానంద ఈరోజు కౌంటర్ ఇచ్చారు. రాత్రికి రాత్రి పార్టీలు, కండువాలు మార్చిన దానం నాగేందర్ రాజకీయ చాప్టర్ ఖతమైందని మండిపడ్డారు. MLA అంటే అధికారంలో ఉండడమే కాదు ప్రతిపక్షంలో ఉన్నా MLAనే అంటారని, దీనిని దానం గ్రహించాలన్నారు. తాము ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు.

News June 21, 2024

సైబరాదాబ్ కమిషనరేట్ పరిధిలో 27 మంది ఎస్సైల బదిలీలు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 27 మంది ఎస్సైలు బదిలీలు అయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తాజాగా జారీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగానే 27 మంది ఎస్ఐలు బదిలీలు అయ్యారు. చాలా రోజుల నుంచి ఒకే ఏరియాలో ఉన్న పోలీసులతోపాటు ఎన్నికల సమయంలో బదిలీలు అయిన ప్రాంతాల్లో ప్రస్తుతం బదిలీలు చేశామని చెప్పారు.

News June 21, 2024

HYD: బాలికను అపహరించి పెళ్లి చేసుకున్న నిందితుడికి జైలు శిక్ష

image

పోక్సో కేసులో ఓ యువకుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సరూర్‌నగర్ PS పరిధి హుడానగర్‌లో ఉండే M.లక్ష్మణ్ 2018లో ప్రేమ పేరుతో బాలికను మభ్యపెట్టి అపహరించి, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. లక్ష్మణ్‌కు 10ఏళ్ల జైలు శిక్ష, రూ.8వేల జరిమానాను నేడు కోర్టు విధించింది. అలాగే రూ.2లక్షలు నష్టపరిహారం బాధితురాలికి అందించాలని పేర్కొంది.

News June 21, 2024

HYD: ప్రభుత్వ కాలేజీలకు ప్రవేశాల కళ 

image

HYD, RR, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ కాలేజీల్లో గతేడాదితో పోలిస్తే ప్రవేశాల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. హైదరాబాద్ జిల్లాలో 22 ప్రభుత్వ కాలేజీల్లో గతేడాది 8 వేల మందికిపైగా విద్యార్థులు చేరగా ఈ ఏడాది జూన్ మొదటి వారంలోనే 6వేల మందికి పైగా దరఖాస్తులు సమర్పించారు. రెండేళ్లుగా ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య వేగంగా పెరుగుతోందని హైదరాబాద్ ఇంటర్ బోర్డ్ అధికారి దాసరి ఒడ్డెన్న తెలిపారు.

News June 21, 2024

BREAKING: HYD: లంచం తీసుకుంటూ దొరికిన CI

image

లంచం తీసుకుంటూ ఓ సీఐ రెడ్ హ్యాండెడ్‌గా ఈరోజు దొరికాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం సీఐ వెంకటేశం ఓ కేసు పరిష్కారం విషయమై రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ మేరకు సూరారం పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

HYD: ఆ ఘటనతో మోదీకి ఏం సంబంధం?: శివాజీ

image

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏం సంబంధం ఉందని ప్రతి పక్షాలను శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ ప్రశ్నించారు. శుక్రవారం HYD హిమాయత్‌నగర్‌లోని పార్టీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మాట్లాడారు. ఎన్టీఏను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలు దహనం చేయడం సరికాదని సూచించారు. విద్యార్థులకు నష్టం చేసే లీకేజీ వ్యవహారాలను ప్రధాని సహించరని అన్నారు.

News June 21, 2024

HYD: తెలంగాణ భవన్‌లో జయశంకర్ విగ్రహానికి నివాళులు

image

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈరోజు HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో వారి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీతో పాటు పొన్నాల లక్ష్మయ్య సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తన జీవితాంతం తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.