RangaReddy

News November 9, 2024

HYD: టీవీ చూస్తుండగా విద్యుత్ తీగలు మీద పడి బాలుడి మృతి

image

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఓ<<14564376>> బాలుడు మృతి <<>>చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. HYD కాప్రా మండలం జవహర్‌నగర్‌ ప్రగతినగర్‌లో నివాసముండే శానమ్మ కొడుకు వరుణ్‌ (7) శుక్రవారం సాయంత్రం స్కూల్‌ నుంచి వచ్చి టీవీ చూస్తున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తెగి పడి మంటలు అంటుకోవడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగినపుడు కుటుంబసభ్యులెవరూ లేరు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

News November 9, 2024

HYD‌లో తగ్గని చికెన్‌ ధరలు!

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు‌ కొండెక్కాయి. గత నెల రోజులుగా KG రూ. 200కు పైగానే అమ్ముతున్నారు. కార్తీక మాసం ప్రారంభమైనప్పటికీ ధరలు యథావిధిగా ఉన్నాయని చికెన్ ప్రియులు చెబుతున్నారు. శుక్రవారం స్కిన్‌లెస్ రూ. 234 నుంచి రూ. 245 వరకు విక్రయించారు. విత్ స్కిన్ రూ. 200 నుంచి రూ. 215 మధ్య అమ్మకాలు జరిపారు. శనివారం కూడా ఇదే విధంగా ధరలు ఉండనున్నాయి. మీ ఏరియాలో‌ ధరలు ఏ విధంగా ఉన్నాయి.

SHARE IT

News November 9, 2024

HYD: పొగ మంచు.. ఇదీ పరిస్థితి!

image

HYD నగర శివారు, RR, MDCL, VKB జిల్లాలోని పలుచోట్ల 17 డిగ్రీల ఉష్ణోగ్రత సైతం నమోదవుతోంది. చలితో పాటు, పొగ మంచు ఉంటుంది. పొగ మంచు కారణంగా ప్రతి సంవత్సరం భారతదేశంలో దాదాపు 40 వేల ప్రమాదాల్లో 600 మంది మృత్యువాత పడుతున్నారు. 16,000 మంది గాయాల పాలవుతున్నారు. HYD నగరంలో ఏటా సగటున 380 నుంచి 400 ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా.. 50 మంది చనిపోతున్నారు. అధిక పొగ మంచులో అధికారులు డ్రైవింగ్ వద్దంటున్నారు.

News November 8, 2024

HYD: MLA మనవరాలి టాలెంట్ చూసి KTR ఫిదా..!

image

7వ తరగతి చదువుతున్న పట్లోళ్ల అక్షయిని రెడ్డి టాలెంట్ చూసి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫిదా అయ్యారు. చిన్న వయసులోనే ‘ట్రయల్ ఆఫ్ మిస్ ఫార్చున్’ అనే పుస్తకాన్ని రాసిన అక్షయిని రెడ్డి తన టాలెంట్ ఏంటో నిరూపించారు. అక్షయిని రెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మనవరాలు. ఆటమ్ అనే అమ్మాయి కథే ‘ట్రయల్ ఆఫ్ మిస్ ఫార్చున్’ పుస్తకం అని వారు తెలిపారు.

News November 8, 2024

HYD: ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ ఎక్కడ?

image

HYD, RR, మేడ్చల్ జిల్లాల్లో 3,70,357 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. అయితే పాఠశాలలపై అనునిత్యం జరగాల్సిన తనిఖీలు జరగడం లేదు. అధికారులకు నెలనెలా తనిఖీలు చేసి పరిస్థితి ఎలా ఉంది..? విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నాయా..? పాఠశాలకు, పిల్లలకు ఏం అవసరం..? అనే వివరాలు రికార్డు చేయాల్సి ఉంది. కానీ.. అది జరగడం లేదంటున్నారు. దీంతో పలుచోట్ల పిల్లలే రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు.

News November 8, 2024

HYD: గల్లీకో హోటల్.. తనిఖీ చేసేవారు కొందరే..!

image

HYDలో 74 వేలకు పైగా రెస్టారెంట్లు ఉంటే.. సుమారు 23 మంది మాత్రమే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. అంటే 3,552 రెస్టారెంట్లకు ఒక తనిఖీ అధికారి ఉన్నారు. దీన్నిబట్టి గమనిస్తే అధికారుల కొరత ఎంత ఉందో అర్థమవుతుంది. అధికారి రోజుకు 10 హోటళ్లలో తనిఖీ చేసినప్పటికీ, ఏడాదిలో అన్ని హోటళ్లు తనిఖీ చేయడం అసాధ్యమైన పనిగా కనిపిస్తోంది. వెంటనే తనిఖీ చేసే అధికారుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.

News November 8, 2024

HYD: కుక్కలకు పిల్లలు పుట్టకుండా.. స్టెరిలైజేషన్!

image

గ్రేటర్ HYDలో కుక్కల బెడద రోజు రోజుకు పెరిగి పోతుంది. ఈ నేపథ్యంలో దాన్ని నివారించేందుకు అధికారులు స్టెరిలైజేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఎల్బీనగర్ పరిధి ఫతుల్లాగూడ యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రంలో యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ అందించడంతో పాటు, కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేస్తున్నట్లు వివరించారు.

News November 8, 2024

HYD: బస్సులో చోరీ ఘటనపై పోలీసుల అప్డేట్

image

బస్సులో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగులో నుంచి దుండగులు <<14559368>>బంగారు ఆభరణాలు చోరీ<<>> చేసిన ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ అంజిరెడ్డి వివరణ ఇచ్చారు. బాధితురాలు నార్కెట్‌పల్లి పరిధిలో ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించిన కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఎస్ఐ కరుణాకర్ రెడ్డి విచారించారన్నారు. అనంతరం బాధితురాలు నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్తామని తమకు సమచారం ఇచ్చారని తెలిపారు.

News November 8, 2024

అండర్-19లో మెరిసిన HYD ప్లేయర్

image

సికింద్రాబాద్ జింఖానా మైదానంలో గోవా జట్టుతో జరుగుతున్న కూచ్ బెహార్ ట్రోఫీ అండర్-19 క్రికెట్ టోర్నీ‌లో ఇవాళ్టి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ 136 ఓవర్లలో 604 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన ఆరన్ 258 బంతుల్లో 219 రన్స్ చేసి వావ్ అనిపించారు.

News November 8, 2024

HYD: సీఎంపై అభిమానం.. రక్తంతో ఫొటో

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని HYD ఓయూ జేఏసీ ఛైర్మన్ డాక్టర్ ఓరుగంటి కృష్ణ చాటుకున్నారు. రేవంత్ జన్మదినం సందర్భంగా తన రక్తంతో ముఖ్యమంత్రి చిత్రం వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంతన్న మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ముఖ్యమంత్రికి బహుమానంగా అందించనున్నట్లు వెల్లడించారు. ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డి అంటూ కొనియాడారు.