India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. సర్వే నిర్వహణపై సీఎస్ ప్రత్యేకాధికారులతో HYD సచివాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. శాంతికుమారి మాట్లాడుతూ.. ఈ సర్వేకు సంబంధించి ఇంటింటి వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుందని, ఈనెల 9 నుంచి అసలు సర్వే మొదలవుతుందని అన్నారు.
యాక్సిడెంట్లో HYD వాసి మృతి చెందారు. మలక్పేట అజంతా కాలనీకి చెందిన అర్చన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మం. బుదేరా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ప్రిన్సిపల్గా పని చేస్తున్నారు. బుధవారం రోడ్డు ప్రమాదానికి గురైన అర్చనకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన లింగంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. భర్త ప్రవీణ్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
RRR రహదారికి సమాంతరంగా రింగ్ రైల్ నిర్మాణానికి అడుగు ముందుకు పడింది. ఇందులో భాగంగా ఆర్బీ అసోసియేషన్ ఏజెన్సీ ప్రతినిధులు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సర్వేకు కోడంగల్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. సుమారు 564 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టు రూపు దిద్దుకొనుందని, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, గజ్వేల్, భువనగిరి, యాదాద్రి, చిట్యాల నారాయణపూర్, షాద్నగర్, షాబాద్ను కలుపుతూ.. ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు.
గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) సాధారణ స్థాయికి మించి నమోదు అవుతున్నట్లుగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. సనత్నగర్లో 168, కోకాపేట 114, న్యూమలక్పేట 102, జూపార్కు 111, HCU 108, బొల్లారంలో 118 AQI నమోదయినట్లుగా పేర్కొంది. AQI స్థాయి 100కు మించి ఉంటే శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారికి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
SHARE IT
గ్రేటర్ HYDలో లక్షకు పైగా ఐదంతస్తుల కంటే ఎత్తు కలిగిన భవనాలు ఉన్నాయి. HYD, RR, MDCL జిల్లాల్లో చూస్తే అగ్నిమాపక కేంద్రాలు కేవలం 31 మాత్రమే ఉన్నాయి. దీని కారణంగా సరైన సమయానికి అగ్నిప్రమాదం జరిగిన చోటుకు వెళ్లలేకపోవడం, సరైన సిబ్బంది లేకపోవడంతో ప్రమాదాల స్థాయి పెరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
డిసెంబర్ నుంచి మహిళా శక్తి వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. HYDలో నిర్వహించిన సమావేశంలో అధికారులతో ఆమె చర్చించారు. స్వయం సహాయక సంఘాల్లో ప్రతి మహిళను చేర్పించడమే లక్ష్యంగా ప్రోగ్రాం నిర్వహిస్తామని,పంచాయతీరాజ్, నిర్వహిస్తామని, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల సంస్థలు ఇందులో భాగమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
మాదాపూర్ మెడికవర్లో చికిత్స పొందుతూ మరణించిన జూ. డాక్టర్ నాగ ప్రియ (28) మృతిపై ఆస్పత్రి వైద్యులు వివరణ ఇచ్చారు. ఠాగూర్ సినిమాను తలపించేలా ఆస్పత్రిలో డెడ్ బాడీకి చికిత్స, బాధితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మృతదేహాన్ని అప్పగించారంటూ వచ్చిన కథనాలను మెడికవర్ వైద్యులు, యాజమాన్యం ఖండించారు. అడ్మిట్కు ముందే పేషెంట్ పరిస్థితి క్రిటికల్గా ఉందని, బతికించేందుకు తీవ్రంగా కృషి చేశామన్నారు.
రేపు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా HYD బడంగ్పేట్ మాజీ వైస్ ఛైర్మన్ చిగురింత నర్సింహా రెడ్డి, యువజన కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జీవిత చరిత్ర డైనమిక్ లీడర్ పుస్తకాన్ని సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఆయన సోదరులు కృష్ణారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
HYD సహా ఇతర జిల్లాల్లో గంజాయి, డ్రగ్స్ లాంటి అలవాట్ల వైపు యువత దారి మళ్లుతోంది. ఒక్క అక్టోబర్ నెలలోనే HYD జిల్లాలో దాదాపు 2167 కిలోలు, మేడ్చల్ జిల్లాలో 411 కిలోల గంజాయితో పాటు, హాష్ ఆయిల్, నీట్ ఆయిల్, నల్లమందు, MDMA తదితర మత్తు పదార్థాలు పట్టుబడ్డట్లుగా పోలీసులు తెలిపారు. తాజాగా వాటిని ప్రత్యేక పద్ధతుల్లో దహనం చేసినట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో TIMS ప్రాంగణాన్ని క్రీడాకారుల గురుకుల శిక్షణ శిబిరం, స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సుగా మార్చనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. 2002లో ప్రారంభమైన GMC బాలయోగి స్టేడియం,మళ్లీ క్రీడల కోసం నూతన పుంతలు తొక్కనుంది.
Sorry, no posts matched your criteria.