RangaReddy

News November 7, 2024

HYD: పూర్తికాని చెరువు హద్దుల ప్రక్రియ.. త్వరలో విచారణ..!

image

HMDA పరిధిలో 3,532 చెరువులు ఉండగా..ఇప్పటి వరకు 2,525 చెరువులకు మాత్రమే ప్రాథమిక హద్దులు నిర్ణయించారు. మిగిలిన 230 చెరువులకు మాత్రం పూర్తి స్థాయి బఫర్ జోన్, FTL నిర్ధారించారు. మిగిలిన చెరువులకు కనీస హద్దుల నిర్ధారణ పూర్తి కాలేదు. మరోవైపు నవంబర్ 2వ వారంలో హైకోర్టులో చెరువుల హద్దులపై విచారణ జరగనుంది. అయితే హద్దుల నిర్ధారణ ప్రక్రియ పూర్తికాక పోవటంతో HMDA హైకోర్టులో చెబుతుందో..! చూడాలి.

News November 7, 2024

HYD: AIIMSలో డెంగ్యూ వ్యాక్సిన్‌పై పరిశోధనలు

image

బ్రెయిన్ ఫీవర్, డెంగ్యూకు త్వరలోనే పరిష్కారం దొరకనుంది. HYD ఘట్కేసర్ శివారులోని బీబీనగర్ AIIMS విశ్వ విద్యాలయంలో వైద్య పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారించామని డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా వివరించారు. వైద్యులు బ్రెయిన్ ఫీవర్, డెంగ్యూ వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తున్నారని పేర్కొన్నారు. పరిశోధనల ద్వారా వైద్య విధానంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందని తెలిపారు.

News November 7, 2024

HYD: అడ్వాన్స్ టికెట్ బుకింగ్..ఇది మీకు తెలుసా?

image

రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ 60 రోజుల ముందు చేసుకునే నిర్ణయం తాజాగా అమలులోకి తెచ్చినట్లుగా రైల్వే బోర్డు పేర్కొంది. గతంలో 120 రోజుల వరకు ఉండేదని, అయితే ఎక్కువ శాతం క్యాన్సిలేషన్ జరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని SCR సూచించింది. అయితే విదేశీయులు 365 రోజుల ముందు రైల్వే టికెట్లు బుక్ చేసుకునే విధానంలో ఎలాంటి మార్పు లేదంది.

News November 7, 2024

HYD: సీఎం 2.5 కి.మీ. పాదయాత్ర: ఎంపీ

image

సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలో 8వ తేదీన తలపెట్టిన పర్యటనను విజయవంతం చేయాలని పార్లమెంటు ప్రజలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. బొల్లెపల్లి సంఘం బ్రిడ్జిపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం, భీమ లింగాన్ని దర్శించుకుని ధర్మారెడ్డి కాలువ వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల పాదయాత్ర చేసేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

News November 7, 2024

HYD: నూతన సంవత్సరంలో ప్రజల్లోకి కేసీఆర్

image

నూతన సంవత్సరం జనవరిలో కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంపై కొట్లాడడానికి ప్రజల్లోకి వెళ్లనున్నట్లు వివరించారు. కొత్త ఏడాది నూతన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించనున్నారు. యువతకు అవకాశాలు ఇచ్చి.. పార్టీని మరింత బలోపేతం చేయనున్నారని సమాచారం.

News November 7, 2024

HYD: కేంద్రం వద్దకు చేరిన సెకండ్ ఫేజ్ మెట్రో DPR

image

HYD రెండో దశ మెట్రో DPR కేంద్రం వద్దకు చేరింది. రూ.24,269 కోట్లతో 76.4KM మేర 5 కారిడార్లలో మెట్రో రెండోదశ నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(DPR)కేంద్రం అనుమతికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. దీనితో పాటు HMDA పరిధిలోని కాంప్రహెన్సీవ్ మొబిలిటీ ప్లాన్, ట్రాఫిక్ అధ్యయన నివేదికన జత చేసి పంపినట్లు పేర్కొంది.

News November 7, 2024

నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఆధునికరిస్తాం: మంత్రి

image

నాచారంలోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఆధునికరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫుడ్ సేఫ్టీ విభాగంతో మంత్రి మాట్లాడారు. తనిఖీలను మరింత ముమ్మరం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

News November 7, 2024

HYD: డిసెంబర్ నాటికి ముగియనున్న గడువు..!

image

HYD మహానగరంలో సీఆర్ఎంపీ విధానంలో భాగంగా రూ.1,839 కోట్ల అంచనా వ్యయంతో 812 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఐదేళ్ల కాల వ్యవధికి GHMC గంతంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. 2024 డిసెంబర్ నాటికి ఈ కాలం గడువు ముగియనుంది. గడువు ముగిసిన తర్వాత జిహెచ్ఎంసీతో మరోసారి చర్చలు జరగనున్నట్లు సమాచారం.

News November 7, 2024

HYD: నేడు బెంగళూరుకు హైడ్రా బృందం

image

నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది. బెంగళూరులో 2 రోజులపాటు హైడ్రా బృందం పర్యటించనుంది. బెంగళూరులో చెరువుల పునరుజ్జీవంపై క్షేత్రస్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేసి, మురుగు నీటిని స్వచ్ఛంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో అనుసరించిన విధానాలను తెలుసుకునేందుకు కమిషనర్ రంగనాథ్ సారథ్యంలో హైడ్రా బృందం పర్యటించనుంది.

News November 7, 2024

HYDలో జాన్వీ కపూర్ పూజలు

image

జూబ్లీహిల్స్, వెంగళరావునగర్ డివిజన్‌‌ మధురానగర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయానికి శ్రీదేవి కుమార్తె, దేవర ఫేమ్ జాన్వీ కపూర్ వచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు అర గంటపాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా గుడి వద్దకు చేరుకున్నారు. స్థానికులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. కాసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది.