RangaReddy

News June 20, 2024

హైదరాబాద్‌ నుంచి ZOO PARK తరలింపు.. క్లారిటీ!

image

HYD బహదూర్‌పురా నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్‌ తరలింపు‌‌ అవాస్తవం అని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ విషయమై PCCF వైల్డ్ లైఫ్ వార్డెన్ మోహన్ పర్గెయిన్(తెలంగాణ మెంబర్) క్లారిటీ ఇచ్చారు. షాద్‌నగర్‌కు తరలిస్తున్నట్లు జరిగిన ప్రచారం అవాస్తవం అని‌ పేర్కొన్నారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేయాలన్న ప్రతిపాదన కూడా లేదని వివరణ ఇచ్చారు. కాగా,‌ జూ పార్కుకు నిత్యం వందలాది మంది వస్తుంటారు. SHARE IT

News June 20, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓HYD: నగరంలో జూలై 7 నుంచి ఆగస్టు 4 వరకు బోనాల జాతర
✓HYD నగరంలో ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎంపీలకు ఘన స్వాగతం
✓ప్రజా ఆరోగ్యమే పరమావధిగా పని చేస్తాం: రాజనర్సింహ
✓కాచిగూడలో మృతదేహం కలకలం
✓హైదరాబాద్ బోనాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
✓RR: డ్రం సీడర్ యంత్రంతో వరి పంట విత్తటం సులువు
✓రాష్ట్రంలో అత్యల్ప సిజేరియన్లు మేడ్చల్లోనే..!

News June 20, 2024

HYD‌లో కిషన్ రెడ్డికి గ్రాండ్‌ వెల్‌కమ్

image

కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న BJP స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి‌‌కి ఘన స్వాగతం లభించింది. ఆయనతో పాటు‌ ఎయిర్‌పోర్టు‌కు వచ్చిన బండి సంజయ్‌‌‌కి పండితులు ఆశీర్వచనం అందజేశారు. తెలంగాణలోని నలుమూలల నుంచి వచ్చిన కీలక నేతలు‌ కేంద్రమంత్రులను కలిసి అభినందనలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ సెల్యూట్‌ యాత్ర ప్రారంభించారు.

News June 20, 2024

HYD బోనాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గోల్కొండ, సికింద్రాబాద్, లాల్‌దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గురువారం కలిశారు. ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు. ఆలయ అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర నాయకులు ఉన్నారు. ఈ ఏడాది జులై 7 నుంచి ఆగస్టు 4 వరకు భాగ్యనగరంలో‌ భోనాలు జరగనున్నాయి.

News June 20, 2024

రాష్ట్రంలోనే అత్యల్ప సిజేరియన్లు మేడ్చల్‌లోనే..!

image

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యల్పంగా సి-సెక్షన్స్ సిజేరియన్లు మేడ్చల్ జిల్లాలో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. 51 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నెల రిపోర్ట్ విడుదల చేస్తూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వికారాబాద్ జిల్లాలో ఏకంగా 86% కడుపు కోతలు జరిగాయని తెలిపారు.

News June 20, 2024

రంగారెడ్డి జిల్లాలో అదనపు కమిషన్ ఏర్పాటు..?

image

రాష్ట్రంలో మొత్తం 12 జిల్లా కన్జ్యూమర్ కమిషన్లు ఉండగా అందులో ప్రతినెలా 250కి పైగా కేసులు నమోదవుతుంటాయి. రంగారెడ్డి జిల్లాలోనే సుమారు 100 కేసులు నమోదువుతున్నాయి. 50కి పైగా కేసుల నమోదుతో రెండో స్థానంలో హైదరాబాద్-1 కమిషన్ ఉంది. రంగారెడ్డి జిల్లా కమిషన్లో అధిక కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో అదనపు కమిషన్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని కోరారు.

News June 20, 2024

RR: ‘దేశ వ్యాప్తంగా మొక్కజొన్న సాగు పెరగాలి’

image

దేశ వ్యాప్తంగా మొక్కజొన్నల సాగు పెరగాలని, వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా దీన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. RR జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జాతీయ మొక్కజొన్న పరిశోధనల మండలి డైరెక్టర్ హెచ్ఎస్ జాట్, అంతర్జాతీయంగా మొక్క జొన్నలకు మంచి డిమాండ్ ఉందన్నారు. మొక్కజొన్న పంట పండించడం ద్వారా రైతులు సైతం మంచి లాభాలు పొందుతారని పేర్కొన్నారు.

News June 20, 2024

HYD: హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాలకు ఆహ్వానం 

image

శామీర్‌పేట్ మండలం హకీంపేట్‌లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాలకు ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్య,యువజన క్రీడా అధికారి తెలిపారు. 3విడతలుగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నామన్నారు. అందులో సెలెక్ట్ అయిన వారికి అడ్మిషన్లు ఇస్తామన్నారు. వయసు, విద్యార్హత, పుట్టిన తేదీ, ఆధార్, కుల ధ్రువపత్రాలు, 3వ తరగతి గ్రేస్ రిపోర్ట్ ప్రతులు, 5పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు.

News June 20, 2024

HYDలో ఈ సమస్యలు తీరేదెన్నడు..?

image

HYDలో వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులు కొన్నేళ్లుగా తీరడం లేదు. వేసవిలో పనులు ప్రారంభించినా.. సమస్య తీరే దిశగా పనులు సాగటం లేదు. రోడ్లపై నీరు నిలవడం, గల్లీలు మునిగిపోవడం, బైకులు కొట్టుకుపోవడం, ఇళ్లలోకి వరద నీరు, డ్రైనేజీ పొంగిపొర్లడం, ప్రమాదకరంగా మ్యాన్ హోల్, స్తంభాల ఏర్పాటు వంటి ఎన్నో సమస్యలు ఏళ్లు గడుస్తున్నా తీరటం లేదని సాటి హైదరాబాదీలు అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News June 20, 2024

HYD: ‘అమ్మా నేను వెళ్లిపోతున్నా.. వచ్చే ఏడాది వస్తా’

image

యువకుడు అదృశ్యమైన ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తంగడపల్లికి చెందిన భిక్షమయ్య కుమారుడు ఠాను(20) డిగ్రీ చదువుతున్నాడు. 18న డిగ్రీ సెమిస్టర్ పరీక్ష రాసి ఇంటికి వచ్చాడు. అనంతరం ‘అమ్మా నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నా.. మళ్లీ సంవత్సరం తర్వాత వస్తా’ అంటూ లెటర్ రాసి తన బైక్ తీసుకొని వెళ్లాడు. తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో PSలో ఫిర్యాదు చేశారు.