India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD కాచిగూడలో రైలు పట్టాల వద్ద ఓ యువకుడి మృతదేహం కలకలం సృష్టించింది. రైల్వే ఇన్స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపిన వివరాలు.. రైలు పట్టాల వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతదేహం ఉందని సిబ్బంది రైల్వే పోలీసులకు సమచారం ఇచ్చారు. వారు వెళ్లి పరిశీలించి, పాతబస్తీకి చెందిన కిజార్(22)గా అతడిని గుర్తించారు. కాగా ఇది హత్యనా.. ఆత్మహత్యనా.. రైలు ఢీకొని చనిపోయాడా.. అనేది పోస్టుమార్టంలో తెలుస్తుందన్నారు.
HYDలో కూరగాయల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతయ్యే బీన్స్ ధర ఆకాశానంటాయి. తాజాగా హైదరాబాద్ మెహిదీపట్నం రైతుబజార్లో కిలో బీన్స్ ధర రూ.175గా నిర్ణయించారు. నిన్న కేవలం 3 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని ఎస్టేట్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిలో బీన్స్ రూ.300 కంటే ఎక్కువగా పలుకుతోంది. దీంతో కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
HYD, ఉమ్మడి RR జిల్లాల పరిధిలో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలోనే రాజధానిలో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు జరిగాయి. కాగా లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, గంజాయి బ్యాచ్ల ఆగడాలను అరికట్టాలని, పోలీసులు విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించి, నిఘా పెంచాలని పలువురు ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హోంమినిస్టర్ను వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
హిందూ మతంలో విద్వేషాలకు, అసమానతలకు చోటు లేదని విభిన్న హిందూ సంస్థల ప్రతినిధులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు పేర్కొన్నారు. సమతా ఆధ్యాత్మికమూర్తి అన్నమయ్య జయంతి సందర్భంగా ‘అన్నమయ్య కళాక్షేత్రం’, ‘హిందూస్ ఫర్ ఫ్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ’ సంయుక్తంగా హైదరాబాద్లోని బిర్లాసైన్స్ సెంటర్లో ‘ద్వేషం, అసమానత్వానికి వ్యతిరేకంగా హిందూమతం’ నినాదంతో సమ్మేళనం నిర్వహించారు.
రాష్ట్రంలో చేనేత, పవర్లూమ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జులై ఏడో తేదీన పోరుయాత్ర చేపట్టబోతున్నామని, అదే నెల 15న కమిషనరేట్ను ముట్టడిస్తామని మాజీ MLC చెరుపల్లి సీతారాములు ప్రకటించారు. HYDలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్, చేనేత కార్మికుల సంఘం సంయుక్త సమావేశం జరిగింది. ఉపాధి దొరక్క, వస్త్రపరిశ్రమై ఆధారపడ్డ చేనేత, పవర్లూమ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. HYD విద్యానగర్లోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలన్నారు. కార్మికులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వచ్చేసారి ప్రధాని అవ్వడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రటరీ నిరంజన్ యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షకుడని కొనియాడారు. విద్యావంతుడు, ప్రజల కోసం పనిచేసే మనిషి అని అన్నారు. భారత్ జోడో యాత్రతో తన సత్తా ఏంటో దేశానికి చూపించారని పేర్కొన్నారు.
HYDలో మరో హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సనత్నగర్ పరిధి ఏజీ కాలనీలోని నేతాజీనగర్ వాసి అజార్(22), ఎర్రగడ్డ వాసి ఆసిఫ్ (23) తోడు దొంగలు. రాత్రి ఇద్దరు మద్యం తాగి భరత్నగర్ MMTSరైల్వే స్టేషన్ వెనుక పొదల్లోకి వెళ్లారు. ఇటీవల చేసిన చోరీకి సంబంధించి సొత్తు పంపకాల విషయంలో వారు ఘర్షణ పడ్డారు. అజార్ను ఆసిఫ్ కత్తితో పొడిచి రాళ్లతో తలపై కొట్టి చంపి పరారయ్యాడు.అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఓ యువకుడిపై HYDకాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. CIలక్ష్మీకాంత్ రెడ్డి తెలిపిన వివరాలు.. ఫలక్నుమాకు చెందిన యువతి(28) చిక్కడపల్లిలోని హాస్టల్లో ఉంటోంది. లక్డీకపూల్ వాసి విశాల్(27) ప్రైవేటు ఉద్యోగి. వారిద్దరూ 2016నుంచి లవ్ చేసుకుంటున్నారు. కాగా ఆమెను కాదని మరొకరిని అతడు ఇటీవల వివాహం చేసుకున్నాడు.అయితే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లాడ్జిలో అత్యాచారం చేశాడని బుధవారం ఆమె PSలో ఫిర్యాదు చేసింది.
HYD రవీంద్రభారతిలో బుధవారం శ్రీరామనాటక నికేతన్ ఆధ్వర్యంలో ప్రముఖ నాట్యగురువు మంజులా రామస్వామి మనువరాలైన వన్సిక సుదర్శన్ భరతనాట్యంలో అరంగేట్రం చేసింది.గణేశ స్తుతి, పాద వర్ణం,శంకర శ్రీగిరి, విషమకర, తిల్లాన తదితర అంశాల్లో నర్తించి భళా అనిపించింది. నట్టువాంగంపై గురువు మంజుల రామస్వామి, గణేశ్ గానం చేయగా, మృదంగంపై రాజగోపాలచారి,వయొలిన్పై సాయికుమార్, ఫ్లూట్పై దత్తాత్రేయ వాయిద్య సహకారం అందజేశారు.
Sorry, no posts matched your criteria.