India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగర ప్రజలకు మంచి నీటి సమస్య రాకుండా జలమండలి చర్యలు చేపడుతోంది. గండిపేట కాండ్యూట్ లీకేజీలతో 8ఎంజీడీ (30 లక్షల లీటర్లు) నీరు వృథా అవుతుందని గుర్తించిన అధికారులు, గ్రౌటింగ్ పద్ధతిలో కెమికల్ ట్రీట్మెంట్ టెక్నాలజీ ఉపయోగించి నీటి సరఫరాకు అంతరాయం కలిగించకుండా మరమ్మతులు చేస్తున్నారు. ఈ లీకేజీలు దాదాపు 14.5 కిలోమీటర్ల పొడవున ఉన్నట్లు గుర్తించామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.
HYD శివారులో RRR దక్షిణ భాగంపై రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అలైన్మెంట్ సహా ఇతర అన్ని పనుల పర్యవేక్షణ కోసం త్వరలో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. RRR దక్షిణ భాగాన్ని తన ఆధ్వర్యంలోనే నిర్మించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేక IAS అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసింది.
18 ఏళ్లు నిండి, ఇప్పటికీ ఓటు హక్కు లేని వారు వెంటనే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని CEO సుదర్శన్ రెడ్డి సూచించారు. నవంబర్ 28 వరకు నూతన ఓటరు దరఖాస్తు, మార్పు చేర్పులకు అవకాశం ఉందన్నారు. జనవరి 6న SSR-2025 విడుదల చేస్తామన్నారు. తాజాగా హైదరాబాద్లో-1,81,875, రంగారెడ్డి-1,18,513, మేడ్చల్ మల్కాజిగిరి-99,696 మంది నూతన ఓటర్లు కొత్తగా నమోదయినట్లుగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఈసారి 24 శాతం సైబర్ నేరాలు పెరిగాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వార్షిక సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాగా చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని చెప్పారు. 36 రకాల సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయన్నారు. దాదాపు రూ.36 కోట్లను బాధితులకు తిరిగి ఇచ్చామని, ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ ఆందోళన కలిగిస్తోందన్నారు.
శంకర్పల్లి పరిధి సింగాపురంలో నూతనంగా నిర్మించిన మరకత కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయస్వామి శిఖర ధ్వజ విగ్రహనాభిషీల (బొడ్రాయి) ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భీమ్ భరత్, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఉమ్మడి RR, HYD జిల్లాల్లో లక్షల కుటుంబాల సమగ్ర సర్వేకు రంగం సిద్ధమైంది. GHMC పరిధిలో 28 లక్షల కుటుంబాలు, RRలో 6.57 లక్షలు, వికారాబాద్ 6.54 లక్షల కుటుంబాల సర్వే జరగనుంది. మరోవైపు GHMC-21 వేల ఎన్యుమరేటర్లు, RR 5,344, VKB-2024 మంది సర్వే చేయనున్నారు. మొదటి దశ నేటి నుంచి 8వ తేదీ వరకు కొనసాగనున్నది. ఒక్కో సూపర్వైజర్ కింద 10 మంది ఎన్యుమరేటర్లు పనిచేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.2,741 కోట్ల అంచనాతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన HYD పాతబస్తీ మెట్రో (MGBS- చంద్రాయన గుట్ట)భూ సేకరణపై కలెక్టర్ అనుదీప్ మూడో విడత నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే 2 విడతల్లో 400 వరకు ఆస్తులను నోటిఫై చేశారు. తాజాగా.. దారుల్షిఫా నుంచి శాలిబండ వరకు సేకరించాల్సిన భూమిపై నోటిఫికేషన్ ఇచ్చారు. అభ్యంతరాలను 2025 జూన్ 2 వరకు బేగంపేట మెట్రో రైల్ కార్యాలయంలో అందించాలి.
HYDలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్నగర్కు రావాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బావర్చీలో కుర్చీ వేసి, ప్లేట్లో బిర్యానీ వడ్డించారు. బిర్యానీ చల్లబడకముందే రావాలని BRS సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి సూచించారు. పలువురు నిరుద్యోగులు కూడా రాహుల్ గాంధీ రావాలని కోరారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
నేడు ఆటో డ్రైవర్లు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నాను నిర్వహించనున్నారు. కాగా ఈ మహా ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. అయితే ఈరోజు నిర్వహించే మహా ధర్నాను అన్ని వాహన సంఘాలతో కలిసి విజయవంతం చేస్తామని ఆటో యూనియన్ జేఏసీ స్పష్టం చేసింది.
అమీర్పేట్: మధురానగర్ PS పరిధిలో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇళ్లలో పనికి వెళ్లే ఓ మహిళ నిన్న కొండాపూర్లో పనికెళ్లి తిరిగొస్తుండగా ఆటోలో ముగ్గురు వచ్చి తమ గదిలో బట్టలు ఉతకాలని చెప్పి ఆమెను తీసుకెళ్లి రూమ్లో బంధించారు. నోట్లో బట్టలు కుక్కి, తీవ్రంగా కొట్టి ఆమెపై అత్యాచారం చేశారు. తప్పించుకున్న ఆమె దుస్తులు లేకుండా బయటకు రాగా పక్కింటి మహిళ గమనించి నైటీ ఇచ్చారు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.