India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నారు. ఒకటి నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన వారందరికీ వీటిని అందించాలని కలెక్టర్లు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు DMHO, AMHO అధికారులు వీటిని అందించేందుకు సర్వం సిద్ధం చేశారు.
ప్రసిద్ధి గాంచిన HYD బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం పటిష్ఠ బందోబస్తు నడుమ అధికారులు బుధవారం నిర్వహించారు. మార్చి 30 నుంచి జూన్ 19 వరకు మొత్తం 81 రోజులకు గాను సాధారణ హుండీల్లో నోట్లు రూ.87,15,384, నాణేలు రూ.3,53,449.. మొత్తం రూ.90,68,833 వచ్చాయి. అన్నదానం హుండీలో రూ.1,60,686 రాగా మొత్తం ఆదాయం రూ.92,29,521 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ను ఈనెల 23న నిర్వహిస్తున్నట్టు తెలంగాణ చెస్ సంఘం అధ్యక్షుడు ప్రసాద్ వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలోని యోగా హాల్లో అండర్-7, 9, 11, 13, 15 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోటీలు జరుగుతాయని, ఆసక్తి గల వారు 7337578899, 7337399299 ఫోన్ నంబర్లకు వాట్సాప్లో తమ వివరాలు పంపించి పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు.
ఆక్రమణలతో గోల్కొండ కోట ప్రతిష్ఠ మసకబారుతోంది. చట్టం ప్రకారం పురాతన కట్టడం నుంచి సుమారు 300 మీటర్ల మేర ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ గోల్కొండలో మాత్రం ఆక్రమణదారులు ఇష్టానుసారం గోడలు కూల్చేసి భవనాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు కోట చుట్టూ వ్యర్థాలు, జంతు కళేబరాలు పారేయడం, మూత్ర విసర్జన చేస్తుండడంతో ప్రపంచ వారసత్వ హోదా కలగానే మారింది.
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ మం. కుంట్లూరు రెవెన్యూ పరిధి భూదాన్ భూమిలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేదలకు న్యాయం చేయాలని సీపీఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. CPI రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబశివరావు, నాయకులు జంగయ్య, రవీంద్ర చారి, ముత్యాల యాదిరెడ్డి, పర్వతాలు CMని కలిసి వినతి పత్రం అందించారు. ఈ వ్యవహారంపై ఆయన సానుకూలంగా స్పందించారని కూనంనేని వెల్లడించారు.
HYD చిలకలగూడ PS పరిధిలో దారుణం జరిగింది. CI అనుదీప్ కథనం ప్రకారం.. లాలాగూడకు చెందిన ఓ మహిళ 2022లో అనారోగ్యంతో చనిపోయింది. ఆమె కూతురు(12)ను సోదరి గార్డియన్గా పెంచుకుంటుంది. మల్కాజిగిరి వాసి సాయికృష్ణ(25)బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. చిల్డ్రన్ హోమ్ నుంచి తన ఫ్రెండ్ గదికి తీసుకెళ్లి రేప్ చేశాడు. సాయికృష్ణతో పాటు అతడికి సహకరించిన చిల్డ్రన్ హోమ్ వర్కర్ లక్ష్మీపై కేసు నమోదైంది.
HYD మరోసారి దేశవ్యాప్తంగా సత్తాచాటింది. రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కలుపు యాజమాన్య విభాగానికి అవార్డు వరించింది. దేశంలోనే అత్యుత్తమ రీసెర్చ్ సెంటర్ అవార్డు దక్కడం విశేషం. భువనేశ్వర్లో అఖిల భారత కలుపు యాజమాన్య సంస్థ వార్షిక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2023-24 సంవత్సరానికి HYD సైంటిస్టులు డాక్టర్ రామ్ ప్రకాశ్, డాక్టర్ పద్మజ ఈ అవార్డు అందుకొన్నారు.
SHARE IT
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూర్ నుంచి కొడంగల్ వెళ్లే ప్రధాన రహదారిలో (కాగ్న వంతెన సమీపంలో) లారీ బీభత్సం సృష్టించింది. రెండు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి, బిడ్డ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
నెహ్రూ జూలాజికల్ పార్క్ షాద్నగర్కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జూపార్కు పరిసరాల్లో వాయు, శబ్ద కాలుష్యం ఎక్కువ అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు జూపార్కు సమీపంలోని మీర్ ఆలం ట్యాంక్ నుంచి వరద ఉద్ధృతి పెరిగి జూపార్కులోకి నీరు ప్రవేశిస్తుండటంతో జూపార్కును మరో చోటికి తరలించాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శమని షర్మిల అన్నారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబసభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Sorry, no posts matched your criteria.