India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చెరువుల పునరుద్ధరణపై అధ్యయనానికి హైడ్రా బృందం బెంగళూరుకు స్టడీ టూర్ వెళ్లనుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా మరి కొంతమంది ఇందులో పాల్గొననున్నారు. అక్కడచెరువుల పునరుజ్జీవం ఎలా జరిగిందో స్టడీ చేస్తారు. ఈ టూర్ అనంతరం ఇక్కడకు వచ్చి బాచుపల్లిలోని ఎర్రకుంటచెరువు, మాదాపూర్ సున్నంచెరువు, కూకట్పల్లిలోని నల్లచెరువు, రాజేంద్రనగర్లోని అప్పా చెరువుల పునరుద్ధరణ చేపడతారు.
మన హైదరాబాద్ను జీహెచ్ఎంసీ మరింత అందంగా ముస్తాబుచేస్తోంది. బల్దియా పరిధిలోని అన్ని జంక్షన్లను సుందరీకరిస్తున్నారు. ఎల్బీనగర్, బషీర్బాగ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, కూకట్పల్లి, హయత్నగర్, బీఎన్రెడ్డినగర్తో పాటు ఇతర ఏరియాల్లోని ఫ్లై ఓవర్లు, జంక్షన్ల వద్ద రంగు రంగుల బొమ్మలు గీస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఈ చిత్రాలు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి.
హైదరాబాద్లోని సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న మెహ్ ఫిల్ రెస్టారెంట్లో స్విగ్గి ద్వారా అనిరుద్ అనే వ్యక్తి చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రై, తదితర ఆర్డర్ చేయగా.. చికెన్ ఫ్రైలో పురుగు వచ్చిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీకి ఫిర్యాదు అందించగా, యంత్రాంగం కదిలింది. పూర్తిగా తనిఖీలు చేపట్టిన అధికారులు, అసురక్షిత ఆహార పదార్థాలను గమనించి, టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించారు. దీనిపై కోర్టులో కేసు వేస్తామని తెలిపారు.
మూసి నిర్వాసితులకు అంబర్పేట, హిమాయత్ నగర్ ముసారం బాగ్, కేసీఆర్ నగర్ పరిధిలో కొందరికి ఇప్పటికే 2BHK ఇండ్లను పట్టాలిచ్చి ఖాళీ చేయించారు. మరోవైపు పిల్లిగుడిసెల కాలనీ, ప్రతాప సింగారం, సాయి చరణ్ కాలనీ, కమలానగర్, కొల్లూరు, గాంధీనగర్, జై భవాని నగర్, తిమ్మాయిగూడ, నార్సింగి, బండ్లగూడ, పోచంపల్లి బాచుపల్లి ఇలా మొత్తం దాదాపు 14 ప్రాంతాలకు మూసి నిర్వాసితులను తరలించేందుకు అధికారులు సిద్ధం చేశారు.
ఉప్పల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్, కాంగ్రెస్ AICC ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వేసిన పరువు నష్టం కేసు విచారణ నవంబర్ 5న జరగనుంది. నాంపల్లి కోర్టులో గత సేషన్లో NVSS కోర్టుకు రాకపోవడంతో ఈనెల 5న చివరి అవకాశం ఇచ్చింది. ముడుపుల కింద కాంగ్రెస్ నాయకుల నుంచి దీపాదాస్ మున్షీ బెంజ్ కార్ తీసుకున్నారని NVSS ఆరోపించారు.
2025-26లో దేశ వ్యాప్తంగా జనగణన జరగనుంది. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాలు పెరగనున్నాయి. ఇదే తరుణంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 స్థానాలు, 153కు చేరే అవకాశం ఉండగా.. గ్రేటర్ HYDలో ప్రస్తుతం ఉన్న 24 నియోజకవర్గాలు కాస్త.. 50కి చేరే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి స్లీపర్ వందే భారత్ రైలును సైతం తీసుకువస్తామని HYDలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYD నగరంలో చర్లపల్లి, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, బేగంపేట లాంటి అనేక రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రైల్వే రంగాన్ని బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.
RR, MDCL,VKB జిల్లాలోని రైతులకు ఎలక్ట్రిసిటీ అధికారులు ఓ గుడ్ న్యూస్ తెలిపారు. రైతులు పొలం వద్ద వ్యవసాయ మోటార్ ఉన్న స్థలంలో వెలుగు కోసం 15 వాట్ల సామర్థ్యం ఉన్న ఒక లైట్, లేదా 5 వాట్ల సామర్థ్యం ఉన్న మూడు లైట్లు వాడుకోవచ్చని ERC తెలిపింది. వీటిని వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటు కిందనే పరిగణించాలని డిస్కంలకు వెల్లడించినట్లు పేర్కొంది.
HYD నగరం సికింద్రాబాద్ నుంచి వాడి వెళ్లేందుకు ప్రస్తుతం 2 లైన్లుగా ఉన్న 194 కిలోమీటర్ల రైల్వే లైన్ 4 లైన్లుగా మార్చడం కోసం యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే DPR(డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేసి, రైల్వే బోర్డుకు అందించారు. ప్రాజెక్టుకు రూ.4453 కోట్లు అవుతుందని అంచనా వేశారు. బోర్డు పచ్చజెండా ఊపితే,ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రాజెక్టు మంజూరు కానుంది.
త్వరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బస్సు యాత్ర చేపట్టనున్నారు. డిసెంబర్ లేదా జనవరిలో తెలంగాణాలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన నేపథ్యంలో 2023లో చేసిన పాదయాత్రలో తాను పర్యటించిన ప్రదేశాలను తిరిగి సందర్శించి.. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారమయ్యాయో లేదో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలుసుకొనున్నారు.
Sorry, no posts matched your criteria.