RangaReddy

News November 3, 2024

HYD: త్వరలో ఫుడ్ సేఫ్టీ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్!

image

HYDలో షవర్మా ఘటనలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల మయోనైజ్‌పై ఏడాది పాటు నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్, మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఒకే గొడుగు ఎందుకు తీసుకువచ్చి డ్రగ్స్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల కార్యాలయాలు కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తామన్నారు.

News November 3, 2024

ఎయిర్పోర్టులో కలిసిన తెలుగు రాష్ట్రాల స్పీకర్‌లు

image

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగే 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(CPA) కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్తూ ఎయిర్పోర్ట్ లాంజ్‌లో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కలుసుకున్నారు. వీరితో పాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లేజిస్లేచర్ సెక్రస్లేచర్ సెక్రటరీ డా.వి.నరసింహా చార్యులు ఉన్నారు.

News November 3, 2024

HYD: వామ్మో.. చికెన్ ఫ్రైలో పురుగు!

image

ఆర్డర్ చేసిన ఫుడ్‌లో పురుగు రావడంతో ఓ వ్యక్తి అవాక్కయ్యాడు. బాధితుడి ప్రకారం.. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ నుంచి ఓ వ్యక్తి స్విగ్గిలో చికెన్ ఫ్రై, చికెన్ న్యూడిల్స్, మెజెస్టిక్స్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ ఓపెన్ చేసి తింటుండగా పురుగు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇంత పెద్ద రెస్టారెంట్లో ఇదా పరిస్థితి? అంటూ GHMC ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు చేపట్టాలని అనిరుద్ అనే వ్యక్తి కోరాడు.

News November 3, 2024

HYD: డ్రగ్స్ దందాల్లో నైజీరియన్ల హస్తం!

image

గత మూడేళ్లలో డ్రగ్స్ సరఫరా కేసుల్లో 31 మంది విదేశీయులను HYD నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో అధిక శాతం నైజీరియన్లే గోవా, ముంబై, బెంగళూరు నుంచి HYD నగరానికి కొకైన్, హెరాయిన్ చేరవేస్తున్న 10 మంది డ్రగ్ డ్రాగన్లను పోలీసులు కట్టడి చేశారు. నైజీరియన్లు హైదరాబాద్లో బంజారాహిల్స్, టోలిచౌకి, బండ్లగూడ జాగిర్, బాలాపూర్, బర్కాస్, మాసబ్ ట్యాంక్, సికింద్రాబాద్లో మకాం వేసినట్లు తేలింది.

News November 3, 2024

ఎల్బీనగర్: సైబర్ నేరాలకు సెంటర్ పాయింట్ ఆ దేశాలే!

image

సింగపూర్, కంబోడియా, థాయిలాండ్, చైనా తదితర దేశాల కేంద్రంగా హైదరాబాద్‌లో నేరగాళ్లు సైబర్ మోసాలు చేస్తున్నారు. సైదాబాద్, ఎల్బీనగర్, పాతబస్తీ, చార్మినార్ సహా అనేక ప్రాంతాల్లో ప్రజలు సైబర్ మోసాలకు బలయ్యారు. పెట్టుబడులు, పార్ట్ టైం ఉద్యోగాలు, ఫెడెక్స్ మాయలతో కొట్టేసిన డబ్బు, సొమ్మును నిల్వ ఉంచేందుకు ఇండియన్ ఖాతాలు ఉపయోగిస్తున్నట్లు HYD పోలీసులు గుర్తించారు.

News November 3, 2024

HYD: IIITHలో పార్ట్ టైం MS చేసే ఛాన్స్!

image

HYD నగరం గచ్చిబౌలిలోని IIITHలో పార్ట్ టైం MS రీసర్చ్ ప్రోగ్రాం చేసేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వింటర్ బ్యాచ్ 2025 JANలో ఈ ప్రోగ్రాం ప్రారంభం కానుండగా సైన్స్, ఇంజినీరింగ్2లో టెక్నికల్ ప్రొఫెషనల్ డిగ్రీ+1సం. EXP ఉన్న వారికి ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇండస్ట్రీ MS ప్రోగ్రాంలో అత్యధికంగా ప్రాజెక్టు వర్క్ పై ఫోకస్ పెట్టారు. మిగతా వివరాలకు outreach.iiit.ac.in/industryms సంప్రదించాలన్నారు.

News November 3, 2024

HYD: 100 రోజులన్నారు.. 300 రోజులైంది: హరీశ్ రావు

image

ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలతో పాటు దేశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగ నియామకాల అంశంలో సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత సాధించిన ప్రగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ట్యాగ్‌ చేస్తూ సీఎం రేవంత్‌ శనివారం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

News November 3, 2024

HYD నగరంలో మరో స్కైవాక్

image

హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త తెలిపింది. HYD నగరంలో మరో స్కైవాక్ అందుబాటులోకి రానుంది. పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ సమీపంలో కొత్తగా స్కైవాక్ నిర్మించనున్నారు. మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఆ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ స్కైవాక్ నిర్మించనుంది.

News November 2, 2024

BREAKING: చర్లపల్లి జైలుకు ముత్యాలమ్మ గుడి నిందితుడు

image

సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసులో న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించింది. ప్రధాన నిందితుడైన సల్మాన్ సలీంకు 14 రోజులు రిమాండ్ విధించడంతో అతడిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్‌కు బదిలీ చేయగా ఈ ఘటనపై సిట్ 3 కేసులను నమోదు చేసింది.

News November 2, 2024

HYD: యువతిపై అత్యాచారం

image

HYD ఘట్‌కేసర్ పరిధిలో యువతిపై అత్యాచారం జరిగింది. సీఐ పి.పరశురాం తెలిపిన వివరాలు..  ఓ మార్ట్‌లో పని చేసే యువతిపై కజా బషీర్ (35) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట పెడితే చంపుతానని ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలో బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.