RangaReddy

News November 1, 2024

HYD: నారాయణగూడలో సదర్‌.. CM రేవంత్‌కి ఆహ్వానం

image

నారాయణగూడ YMCA చౌరస్తాలో రేపు నిర్వహించనున్న యాదవ సదర్ సమ్మేళనంకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. నిర్వాహకుడు సి.వినోద్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఆహ్వాన పత్రికను CMకు అందజేసింది. ప్రతిఏటా నారాయణగూడలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అధికారికంగా సదర్ నిర్వహిస్తామని ప్రకటించడం హర్షణీయమని అన్నారు.

News November 1, 2024

HYD: హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌‌ లిమిటెడ్‌లో JOBS

image

HYDలోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో (HAL)లో ఏవియానిక్స్ డివిజన్‌లో CMM ఇంజినీర్ 4, మిడిల్ స్పెషలిస్ట్ 8, జూ. స్పెషలిస్ట్ 5 పోస్టులను షార్ట్ టర్మ్ కింద భర్తీ చేస్తున్నారు. మొత్తం 17 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రూ. 500 చెల్లించి అప్లై చేసుకోవాలి. SC, ST, PWBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కల్పించారు. దరఖాస్తుకు చివరి తేదీ: 24-11-2024
లింక్: https://hal-india.co.in/home‌
SHARE IT

News November 1, 2024

HYD: నారాయణగూడలో సదర్‌.. CM రేవంత్‌కి ఆహ్వానం

image

నారాయణగూడ YMCA చౌరస్తాలో రేపు నిర్వహించనున్న యాదవ సదర్ సమ్మేళనంకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. నిర్వాహకులు సి.వినోద్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఆహ్వాన పత్రికను CMకు అందజేసింది. ప్రతిఏటా నారాయణగూడలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అధికారికంగా సదర్ నిర్వహిస్తామని ప్రకటించడం హర్షణీయమని అన్నారు.

News October 31, 2024

GHMC ఎన్నికలు.. KTR ఆన్సర్ ఇదే!

image

గ్రేటర్ ఎన్నికలపై KTR స్పందించారు. ‘ రాబోయే GHMC ఎన్నికల కోసం BRS కార్యాచరణ, ప్రణాళిక ఏంటి?’ అని ఓ నెటిజన్‌ ‘X’లో ప్రశ్నించారు. ‘GHMC అలాగే ఉంటుందో లేదో తెలియదు. బహుళ యూనిట్లుగా విభజిస్తారని పుకార్లు వస్తున్నాయి. వేచి చూద్దాం’ అంటూ AskKTRలో ఆయన బదులిచ్చారు. కాగా, గ్రేటర్‌లో ప్రస్తుతం 150 డివిజన్లు ఉన్నాయి. అయితే, GHMCలో శివారు మున్సిపాలిటీలు విలీనం అవుతున్నాయి. దీంతో డివిజన్ల సంఖ్య పెరగనున్నాయి.

News October 31, 2024

HYD: టీటీడీ బోర్డు ఛైర్మ‌న్‌కు సీఎం అభినంద‌న‌లు

image

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్‌గా నియ‌మితులైన బీఆర్ నాయుడుకు, బోర్డు స‌భ్యుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌రస్వామి ఆల‌య ప‌విత్ర‌త‌ను, ఔన్న‌త్యాన్ని మ‌రింత‌గా పెంచేలా నూత‌నంగా నియ‌మితులైన ఛైర్మ‌న్‌, బోర్డు స‌భ్యులు కృషి చేయాల‌ని సీఎం ఆకాంక్షించారు.

News October 31, 2024

HYD: మీరు దీపావళి ఇలాగే జరుపుతారా..!

image

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ లక్ష్మీపూజలు నిర్వహిస్తారు. గ్రామాల్లో అయితే పొలాల్లోని జీనుగ, పుంటికూర (గోగునార)లతో కుటుంబసభ్యులకు దిష్టి తీయడం ఆనవాయితీ. చుట్టాలతో కలిసి కొత్త దుస్తులు ధరించి రంగురంగుల దీపాలు, పిండి వంటలు, పలు రకాల టపాకాయలు అబ్బో ఆ సంబరాలు మాటల్లో చెప్పలేం. నేడు చతుర్దశి కావడంతో ఉదయం భోగి మంగళహారతులు, సాయంత్రం నోము ఆచరిస్తారు. మీరు ఎలా జరుపుతారో కామెంట్ చేయండి.

News October 31, 2024

HYD: అన్ని జిల్లాల్లో సకుటుంబ సర్వేకు సిద్ధం!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లో ప్రభుత్వం తలచిన సకుటుంబ సర్వేకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీలు, జిల్లా, మండల కార్యాలయాల్లో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాల్లో ఎన్యుమరేటర్లకు అధికారులు శిక్షణ ఇచ్చారు. ప్రజలను అడగాల్సిన 50 ప్రశ్నలపై అవగాహన కల్పించారు. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధిపై సర్వే జరగనుంది.

News October 30, 2024

HYD: విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరి మృతి

image

యాదాద్రి జిల్లా మూటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామంలోని అబిద్‌నగర్‌లో ఇద్దరు నగరవాసులు మృతి చెందారు. సరదాగా 12 మంది ఇంటర్ చదువుతున్న విద్యార్థులు HYD నుంచి స్నేహితుడి ఊరైన మూటకొండూరు మండలం అబిద్‌నగర్‌కు వెళ్లారు. ఆ ఊరిలోని చెరువులో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు శశి, చరణ్ అనే విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు బోడుప్పల్ వాసులుగా గుర్తించి కేసు నమోదు చేశారు.

News October 30, 2024

హైదరాబాద్‌లో దీపావళి ఎఫెక్ట్

image

దీపావళి పండుగ వేళ హైదరాబాద్‌లో మిఠాయి దుకాణాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. బేగంబజార్, చార్మినార్, అత్తాపూర్, మెహిదీపట్నం, గుల్ మొహర్ బజార్, రాణిగంజ్, సికింద్రాబాద్, తార్నాక లాంటి ప్రాంతాల్లో స్వీట్ షాప్స్ వద్ద రద్దీ ఏర్పడింది. హైదరాబాద్ నగరం సహా ఇతర ప్రాంతాల నుంచి హోల్ సెల్ డీలర్లు బేగం బజార్‌లో మిఠాయిలు కొనుగోలు చేసేందుకు లైన్లలో బారులు తీరారు.

News October 30, 2024

HYD: ప్రాణాంతకంగా మారుతున్న గాలి కాలుష్యం!

image

హైదరాబాద్‌లో గాలి కాలుష్యం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. దాదాపు 5.6% మరణాలు కాలుష్యం వల్లే జరుగుతున్నట్లు ల్యాన్ సెట్ నివేదికలో వెల్లడైంది. 2008 నుంచి 2019 మధ్య 11 ఏళ్ల కాలంలో సంభవించిన 36 లక్షల మరణాలను ల్యాన్ సెట్ నివేదిక అధ్యయనంలో విశ్లేషించింది. ఏడాదిలో వాయు కాలుష్యం వల్ల 1597 మరణాలు సంభవించాయని పేర్కొంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సరిగా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.