India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపుల భయం పట్టుకుంది. గత కొన్ని రోజులుగా పదే పదే బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడంతో ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమౌతూ వస్తున్నారు. HYD నుంచి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పాఠశాలకు సైతం ఇటీవల బాంబు బెదిరింపు వచ్చింది. HYD పాఠశాల, కేంద్రీయ విద్యాలయాలను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి బెదిరింపులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ నగర్లో ఈరోజు ఉదయం ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్ క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీకొని చౌరస్తా నుంచి సాగర్ హోటల్ వరకు బస్సు ఈడ్చుకెళ్లింది. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న హరికృష్ణగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని అర్హులకు అందేలా కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. సమీకృత కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో ఇంటింటికీ సమగ్ర సర్వే నిర్వహించే సూపరింటెండెంట్ల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రతి పథకాన్ని గ్రామం నుంచి పట్టణం వరకు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు. జిల్లాకు చెడ్డపేరు తేవొద్దన్నారు.
హైదరాబాద్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని HYD సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం బంజరాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ ఆఫీస్లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నగర పరిధిలో ఆశ్రయం లేని వ్యక్తుల్లో కొందరికి మానసిక స్థితి సరిగా లేదని, వారు మతపరమైన ప్రదేశాల వద్దకు వెళ్లి దాడులు చేస్తున్నారని, వారిని కట్టడి చేయాలన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్పై నేడు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో పలు పబ్బులపై తాము నిఘా ఉంచినట్లు తెలిపారు. మైనర్లను పబ్బులోకి అనుమతించొద్దని ఆదేశించారు. పబ్బుల దగ్గర 40 శాతం స్థలం ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఇకపై నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని, పట్టుబడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
BRS కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఈరోజు HYDలో కీలక సూచనలు చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్, BJP, TDP వారి పెయిడ్ సోషల్ మీడియా ట్రోల్స్ BRSను టార్గెట్ చేస్తాయని వెల్లడించారు. తప్పుడు కేసులు, డీప్ ఫేక్ టెక్నాలజీతో అసత్య ప్రచారం చేస్తారని, అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 6 గ్యారంటీల అమలులో ఫెయిల్ అయినందుకు కాంగ్రెస్ను ప్రశ్నించాలన్నారు.
దీపావళి ముంగిట HYDలో అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. బొగ్గులకుంట ఘటన మరవక ముందే యాకుత్పురాలో ఘోరం జరిగింది. బాణసంచా నిల్వ ఉంచిన ఇంట్లో సిలిండర్ పేలి ఇద్దరు చనిపోయారు. అనుమతి లేకుండా టపాసులు నిల్వ చేయడం, నిబంధనలు పాటించకపోవడం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఫైర్ సేఫ్టీ పాటించాలని ఇప్పటికే పోలీసులు ఆదేశాలిచ్చారు. నిబంధనలు పాటిస్తూ విక్రయాలు చేయడం సురక్షితమని అధికారులు సూచిస్తున్నారు.
SHARE IT
HYD పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 వేలకు పైగా సైబర్ క్రైమ్ కేసులు నమోదు అయినట్లుగా అధికారులు తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఏడాది ఏకంగా రూ.205 కోట్లకు పైగా దోచుకున్నారు. బాధితుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. మరోవైపు దాదాపు 70 శాతం మంది విద్యావంతులే ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. మాయ మాటలు నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.మోదిని పేర్కొన్నారు. పెద్దల సమక్షంలోనే చిన్నారులు టపాసులు కాల్చాలన్నారు. కళ్లు పోతే జీవితాంతం అంధత్వమే అవుతుందన్నారు. ఈనెల 30, 31, నవంబర్ 1న స్పెషల్ టీమ్లు నిపుణులైన వైద్యులతో సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో అందుబాటులో ఉంటాయన్నారు.
HYD బంజారాహిల్స్ నంది నగర్లో మోమోస్ తిని ఒకరు మృతి చెందడంతో పాటు, మరో 20 మంది తీవ్ర అనారోగ్యం పాలైనట్లు భారీ ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.వెంటనే GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు మోమోస్ దుకాణాన్ని ట్రేస్ చేయాగా.. ఖైరతాబాద్ చింతల బస్తీలోని వావ్ హాట్ మోమోస్/ఢిల్లీ హాట్ మోమోస్ పేరిట ఉందని తేలింది.కానీ..FSSAI లైసెన్స్ లేదని,అపరిశుభ్ర ప్రాంతంలో నడిపిస్తున్నట్లు గుర్తించారు.
Sorry, no posts matched your criteria.