India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✓టపాసుల దుకాణం ఫైర్ ఎగ్జాస్టర్ మీ వద్ద ఉండాలి
✓ఫైర్ ఎగ్జాస్టర్ ఉపయోగించే విధానం పై అవగాహన అవసరం
✓దుకాణం ఏర్పాటు పై స్థానిక అధికారులకు సమాచారం అందించాలి
✓పరిసర ప్రాంతాలలో కాగితాలను కానీ, చెత్తను కానీ మంట పెట్టకూడదు
✓పరిసర ప్రాంతాల్లో సిగరెట్ లాంటివాటికి దూరంగా ఉండాలి
✓ఫైర్ యాక్సిడెంట్ గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయండి
•పై విధంగా హైడ్రా అధికారులు అవగాహన కల్పించారు
రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు RR జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న శశాంకను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న నారాయణరెడ్డిని RR జిల్లా కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2015 బ్యాచ్కు చెందిన IAS అధికారి. గతంలో VKBకి కలెక్టర్గా చేశారు.
డబ్బుకోసం భర్తను కిరాతకంగా హత్య చేసిన ఘటన HYD శివారు పోచారంలో జరిగింది. పోలీసుల వివరాలు.. 3 పెళ్లిళ్లైన నిందితురాలు విహారికకు వ్యాపారి బి.రమేశ్తో 2018లో ప్రేమ వివాహం జరిగింది. తర్వాత APకి చెందిన నిఖిల్తో ప్రేమలో పడింది. ఇటీవల భర్త ఆస్తి అమ్మగా రూ.8 కోట్లు వచ్చాయి. ఆ డబ్బుపై కన్నేసి, అంకుర్ అనే మరో వ్యక్తితో కలిసి ఉప్పల్లో హత్యచేసి కర్ణాటకలో పడేశారు. పోలీసులు విచారణ జరపగా పట్టుబడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫైర్ అయ్యారు. ‘నీ హైడ్రా దెబ్బకు HYDలో సొంతింటి కల కలగానే మిగిలి పోయింది. నీ మూసీ ముష్ఠి పనులకు కొత్తగా కట్టేటోడు లేక, కట్టినా కొనేటోడు లేక రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులయ్యాయి. బంగారు తెలంగాణను బక్కచిక్కిస్తున్న నీ దౌర్భాగ్యపు పాలనకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ లెక్కలే నిదర్శనం’ అంటూ విమర్శించారు.
IIT హైదరాబాద్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. IITHలో మొత్తం 31 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి, ITI, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ చేసిన వారు సంబంధిత పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్కు రూ. 500 చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, SC, ST అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. డిసెంబర్ 10 వరకు అవకాశం ఉంది.
లింక్: https://iith.ac.in/
SHARE IT
HYD, సికింద్రాబాద్ పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలపై పోలీసులు నిషేధం విధించారు. ఆదివారం సా. 6 గంటల నుంచి NOV 28 వరకు BNSS 163(144 సెక్షన్) అమలులో ఉండనుందని CP CV ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రదర్శనలు నిర్వహించాలని పలు పార్టీలు యోచిస్తున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో యాదవులే పశుగ్రాసాన్ని పెంచుకునేవారని CM రేవంత్ రెడ్డి సదర్ సమ్మేళనంలో గుర్తు చేశారు. ‘ఇప్పుడు మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దాం. ఈ నగర అభివృద్ధికి యాదవ సోదరులు అండగా నిలబడండి. శ్రీకృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడ్డాడు. అందుకే కురుక్షేత్రంలో అధర్మం ఓడింది.. ధర్మం గెలిచింది. యాదవ సోదరులారా ధర్మం వైపు నిలబడండి.. అధర్మాన్ని ఒడిద్దాం’ అంటూ రేవంత్ పిలుపునిచ్చారు.
ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న తెలంగాణ సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్లో అంజన్ కుమార్ యాదవ్ను గెలిపిస్తే మంత్రి అయ్యేవారని పేర్కొన్నారు. అయినప్పటికీ యాదవ సోదరులు రాజకీయాల్లో రాణించాలి, వారికి ఒక అండ కావాలన్న మంచి ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభకు పంపామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం నడపరాదని మాజీ మంత్రి KTR విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులనే కొడుతున్నారని, ఈ అంశంలో రేవంత్ రెడ్డి రికార్డ్ సాధించారన్నారు. HYD ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని నాచారం వద్ద నిర్మించిన STP (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ను BRS వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పరిశీలించారు.
సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ ముస్తాబైంది. నేటి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు NTR స్టేడియంలో తెలంగాణ సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇక దీపావళి వేళ నగరానికి దున్నపోతుల విన్యాసాలు ప్రత్యేక శోభను తీసుకొస్తాయి. నారాయణగూడ, ఖైరతాబాద్, ముషీరాబాద్, అమీర్పేటతో పాటు HYDలోని యాదవ సోదరులు నార్త్ ఇండియా నుంచి బలమైన దున్నరాజులను తీసుకొస్తున్నారు. ఈ ఏడాది సదర్ సయ్యాటలతో హైదరాబాద్ దద్దరిల్లనుంది.
Sorry, no posts matched your criteria.