India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ HYDలో మ్యాన్ హోల్ క్లీనింగ్ కోసం అనేకచోట్ల ఇన్ని రోజులు బకెటింగ్ యంత్రాలను ఉపయోగించారు. తాజాగా 90 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పలుచోట్ల మళ్లీ పాత పద్ధతిని అవలంబించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాన్ హోల్ క్లీనింగ్ కారణంగా భారతదేశంలో 1993-2021 వరకు 971 మంది మరణించారని రికార్డులు చెబుతున్నప్పటికీ, ఎందుకు మళ్లీ పాత పద్ధతినే కొనసాగిస్తున్నారని..? ప్రజలు ప్రశ్నించారు.
హైదరాబాద్లో చికెన్ ధరలు తగ్గాయి. ఈ వారం ప్రారంభంలో KG రూ.243కు విక్రయించారు. గత 3 వారాలుగా మాంసం ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ శనివారం ధరలు మాంసం ప్రియులకు ఊరట కలిగించాయి. నేడు స్కిన్ లెస్ KG రూ.226, విత్ స్కిన్ KG రూ.199గా ధర నిర్ణయించారు. రిటైల్లో రూ. 137, ఫాంరేటు ధర రూ. 115 ఉంది. నగరంలోని కొన్ని హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 15 వరకు తగ్గించి అమ్మకాలు చేస్తుంటారు.
దూర విద్య ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ విధానంలో నవంబర్ 5వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుంతో 8వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 9న జరగనుందని తెలిపారు. వెబ్సైట్: www.ouadmissions.com
HYD హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపి, బంధించి చిత్రహింసలు పెట్టిన మహిళకు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిందితురాలు కే.ఆశ(24) పై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట ఈరోజు హాజరుపర్చగా జీవిత ఖైదు శిక్ష విధించారు. ఈ కేసులో నిందితురాలికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.3,19,000 జరిమానా విధించారు.
వరి ధాన్యం ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని RR,MDCL, VKB పౌర సరఫలాల శాఖ అధికారులు సూచించారు. ✓క్వింటా(100KG)ధాన్యంలో మట్టి, పెళ్లలు,రాళ్లు -1KG✓చెత్త, తాలు-1KG ✓రంగులు మారిన, మొలకెత్తిన, పురుగులు తిన్న వరి ధాన్యం-5KG✓పూర్తిగా తయారు కానీ, ముడుచుకొని ధాన్యం-3KG✓తక్కువ రకాల మిశ్రమం-6KG✓తేమ-17%లోపు ఉండాలి ✓క్వింటా సాధారణ వరి రకం రూ.2,300, ఏ గ్రేడ్ రూ.2,320, సన్న రకం వడ్లకు రూ.500 బోనస్
HYD అఫ్జల్గంజ్ ఉస్మానియా ఆస్పత్రిలో డెర్మటాలజీ ప్రత్యేక విభాగం అందుబాటులోకి తెచ్చినట్లు డెర్మటాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ భూమేశ్ కుమార్ వెల్లడించారు. ఉచిత చికిత్స అందిస్తున్నామని నిత్యం 100 మంది ఓపీ వస్తుంటారని, తీవ్రమైన చర్మవ్యాధి లక్షణాలు ఉంటే బయాప్సి పరీక్షలు చేస్తామని తెలిపారు. పిల్లల కోసం పీడియాట్రిక్ డెర్మటాలజీ చికిత్స కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు.
HYD బేగంపేట్లోని ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణిలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. శుక్రవారం నాటి ప్రజావాణిలో మొత్తం 509 అర్జీలు దాఖలు అయ్యాయి. ప్రజావాణి ఇన్ఛార్జ్ డాక్టర్ జీ.చిన్నారెడ్డి ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకుని సంబంధిత అధికారులకు అందించారు. ఆయా శాఖల అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి అర్జీదారుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు.
సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ గుడిలో వారం క్రితం దాడి ఘటన అందరికీ తెలిసిన విషయమే. కాగా దేవాదాయ శాఖ నుంచి ఐఏఎస్ అధికారిణి శైలజ రామయ్యర్ వచ్చి గుడి రేనోవేషన్ పనులను ఈరోజు పరిశీలించారు. ఈ రేనోవేషన్ పనులు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గుడిలో ప్రహరీ, గ్రిల్స్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
GHMC పరిధిలో ఇంజినీరింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే నూతనంగా ఉద్యోగ పత్రాలు పొందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు 125 మంది జీహెచ్ఎంసీకి రిపోర్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 146 మంది కొత్తగా నియామకమైనట్లు అధికారులు తెలిపారు. పెండింగ్లో ఉన్న సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
HYD నగరంలో నెల రోజుల్లో జరిగిన సైబర్ నేరాల్లో అత్యధికంగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్, పార్ట్ టైం టైం వంటి వివిధ మోసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ లాభాలు వస్తాయని, ఎవరైనా ఆఫర్లు చెబితే, నమ్మొద్దని పోలీసులు సూచించారు. ప్రతి దానికి పాస్ కోడ్ చేసుకుని పదేపదే మార్చుకోవాలని తెలిపారు. నెల రోజుల్లో సుమారు రూ.11 కోట్ల వరకు కొట్టేశారని, జాగ్రత్తగా ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.