RangaReddy

News October 25, 2024

నవంబర్ 7న బీసీ కమిషన్ ఛైర్మన్ రాక: రంగారెడ్డి కలెక్టర్ 

image

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయాలను తెలుసుకునేందుకు తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం నవంబర్ 7న రంగారెడ్డి జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. ఇందులో భాగంగా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నవంబర్ 7న రంగారెడ్డి కలెక్టరేట్‌లో కమిషన్ ఛైర్మన్ నిరంజన్ నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు.

News October 25, 2024

RR: ఏ జిల్లాలో ఎంత మంది గ్రామీణ ఓటర్లు!

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 1.67 కోట్ల ఓటర్లు ఉన్నట్లు SEC తెలిపింది. వికారాబాద్-6,71,940 మంది, RR-7,94,653 మంది గ్రామ పంచాయతీల్లో ఓటర్లు ఉండగా, మేడ్చల్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 64,396 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది.

News October 25, 2024

HYD: అగ్రికల్చర్ యూనివర్సిటీలో భారీగా పెరిగిన సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు

image

HYD రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ యూనివర్సిటీలో 2024-25లో B.Sc (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం 227 సీట్లు ఉండగా మరో 200 పెంచినట్లు వీసీ ఆల్దాస్ జానయ్య తెలిపారు. ఈ సీట్లకు వార్షిక ఫీజులు సైతం తగ్గించామని, పెరిగిన సీట్లను వ్యవసాయ కళాశాలలో సర్దుబాటు చేస్తామన్నారు. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ అనంతరం వీటికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.

News October 25, 2024

HYD: యూనివర్సిటీల నూతన వీసీలతో గవర్నర్

image

ప్రభుత్వం ఇటీవల 9 యూనివర్సిటీలకు నూతన వీసీలను నియమించింది. తాజాగా వారందరూ ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టారు. HYDలోని రాజ్‌భవన్ నుంచి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపుమేరకు వీసీలు రాజ్ భవన్లో గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. స్కిల్ ఎడ్యుకేషన్‌పై దృష్టి పెట్టాలని వారికి సూచించారు. ఇందులో వీసిలు కుమార్, నిత్యానందరావు, యాదగిరి రావు పాల్గొన్నారు.

News October 25, 2024

HYD: రూ.2,245 కోట్లతో రైల్ ప్రాజెక్ట్: DRM

image

ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు ప్రాంతాలకు రూ.2,245 కోట్లతో 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించేందుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని HYD DRM లోకేష్ విష్ణోయ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా HYD, చెన్నై, కలకత్తా ప్రాంతాల నుంచి అమరావతికి డైరెక్ట్ కనెక్టివిటీ జరగనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు లోకల్ రీజియన్ రాకపోకలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు.

News October 25, 2024

HYD: సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష

image

ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్,ఈ-ఇన్-సీ అనిల్, చీఫ్ ఇంజినీర్‌లతో కలిసి శుక్రవారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది లేకుండా సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

News October 25, 2024

BREAKING: అమోయ్ కుమార్‌పై మరో ఫిర్యాదు

image

రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌పై మరో భూకుంభకోణంపై ఫిర్యాదు నమోదైంది. దాదాపు రూ.1,000 కోట్ల విలువ చేసే భూమిని అమోయ్ కుమార్ మాయం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా తట్టిఅన్నారం గ్రామంలోని మధురానగర్ కాలనీ ఫ్లాట్స్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు.

News October 25, 2024

లాస్ట్‌మైల్ కనెక్టివిటీపై HYD మెట్రో రైల్ ఫోకస్

image

HYD మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది. HYDలో మొత్తం 57 మెట్రో స్టేషన్లు ఉండగా.. మెట్రో‌స్టేషన్ నుంచి ప్రయాణికులు తమ ఇంటికి చేరుకునే మార్గాలను సులభమైన మార్గాలను అన్వేషిస్తున్న మెట్రో, కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. యాప్ ద్వారా బైక్, ఆటో, టాక్సీలు నడిపించే సంస్థలతో మాట్లాడి, డైరెక్ట్ మెట్రో టికెట్ యాప్ లోనే బుక్ చేసుకునే ఏర్పాట్లు చేసింది. రానూ, పోనూ మరిన్ని సదుపాయాలు కల్పిస్తోంది.

News October 25, 2024

HYD ట్రాఫిక్‌పై సర్వే.. త్వరలో సీఎంకు నివేదిక!

image

HYDలో నిత్యం దాదాపు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికి రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అంశంపై టెక్నికల్ విద్యార్థులతో సర్వే నిర్వహించనున్నారు. సర్వే బాధ్యతలను 2 విద్యా సంస్థలకు అధికారులు అప్పగించారు. పరిష్కారాలపై సీఎంకు ఓ నివేదిక సమర్పించనున్నారు.

News October 25, 2024

HYD: డిసెంబర్ నాటికి 96% మురుగు నీరు శుద్ధి

image

డిసెంబర్ చివరి నాటికి HYDలో ఉత్పన్నమయ్యే మురుగునీటిలో 96% శుద్ధి చేస్తామని వాటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. 31 ఎస్టీలకు ప్రస్తుతం 20 ఎస్టీపీలు పనులు దాదాపుగా ప్రారంభం కాగా, ఇప్పటికే 5 STPలు అందుబాటులోకి రాగా, పలు ఎస్టీపీలు ట్రయల్ రన్‌లో ఉన్నట్లు తెలిపారు. మిగతా 9 ఎస్టీపీల నిర్మాణపు పనులు డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామని 20 ఎస్టీపీల ద్వారా 1,106 మిలియన్ లీటర్ల మురుగు శుద్ధి చేస్తామన్నారు.