RangaReddy

News October 25, 2024

నవంబర్‌లో RR జిల్లా కోర్టుల రజతోత్సవాలు

image

నవంబర్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన సముదాయం నిర్మించి 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నవంబర్ నెలలో రజతోత్సవాలు నిర్వహించాలని న్యాయవాదుల బృందం నిర్ణయించింది. జిల్లా కోర్టుల ఆవరణలో హైకోర్టు అనుమతితో ఓ భారీ పైలాన్ నిర్మించి, బ్రహ్మాండంగా ప్రారంభించనున్నట్లు అధ్యక్షుడు కొండల్ రెడ్డి తెలియజేశారు.

News October 25, 2024

HYD రైల్వే స్టేషన్లకు మహర్దశ

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.1830 కోట్లతో 38 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుండగా 12 స్టేషన్లు HYD రాజధాని పరిధిలోనే ఉన్నాయి. రూ.514 కోట్లతో 12 రైల్వేస్టేషన్ల అభివృద్ధి జరగనుంది. ఇప్పటికే చర్లపల్లి టర్మినల్ పూర్తికాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు పూర్తయితే రైల్వే స్టేషన్ల ముఖచిత్రం మారబోతుందని SCR అధికారులు తెలిపారు.

News October 25, 2024

HYD: పుష్కలంగా కురిసిన వర్షాలు.. REPORT ఇదే!

image

ఉమ్మడి HYD, RR జిల్లాల్లో గరిష్టంగా 956 మిల్లీమీటర్ల వర్షపాతం వికారాబాద్ జిల్లాలో నమోదైంది.రాష్ట్రంలో జూన్ నుంచి కురిసిన వర్షపాతం రిపోర్టును TSDPS వెల్లడించింది. మేడ్చల్-782, HYD-876, RR-751 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. సాధారణ వర్షపాతానికి మించి HYD, RR, VKB జిల్లాల్లో నైరుతి రుతుపవనాల్లోనే సరిపడేంత భారీ వర్షాలు పడ్డట్టు తెలిపింది. VKB జిల్లాలో సాధారణనికి మించి 256 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

News October 25, 2024

RR: MPDO అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

image

RR జిల్లా కలెక్టర్ శశాంక జిల్లా వ్యాప్తంగా ఉన్న MPDO అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు ✓మోడల్ గ్రామాలుగా మార్చేందుకు నాంది పలుకాలి ✓సింగల్ పిట్ టాయిలెట్లను ట్విన్ పిట్ టాయిలెట్లుగా మార్చాలి ✓అధిక జనాభా ఉన్న బస్టాండ్ లాంటి ప్రాంతాల్లో శానిటరీ కాంప్లెక్స్ నిర్మించండి ✓ప్లాస్టిక్ వ్యర్ధాల రీసైక్లింగ్ చేయండి ✓గ్రామాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయండి ✓అన్ని ప్రభుత్వ భవనాల్లో సోక్ పిట్ అవసరం.

News October 25, 2024

HYD నుంచి యాదాద్రి వరకు MMTS..త్వరలో!

image

HYD నగరంలో MMTS రెండవ దశ పనులు పూర్తి కావడం, చర్లపల్లి టర్మినల్ సిద్ధం కావడంతో కేంద్రం యాదాద్రి రైల్వే లైన్ పై దృష్టి సారించింది. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నగరం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రికి MMTS అందుబాటులో వస్తే సికింద్రాబాద్ నుంచి 45 నిమిషాల్లో కేవలం 20 రూపాయలకే చేరుకోవచ్చు.

News October 25, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓అభివృద్ధికి చిరునామాగా కేంద్ర ప్రభుత్వం:ఈటల ✓కూకట్పల్లి రోడ్లపై వ్యభిచారం, అదుపులోకి 31 మహిళలు ✓బౌరంపేట: నాలుగేళ్ల పాపపై అత్యాచారం..మహిళా కమిషన్ సీరియస్ ✓RR మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌పై ED విచారణ పూర్తి ✓ఉప్పల్: 9 నెలల్లో 2 వేలకు పైగా కేసులు ✓HYD: అక్టోబర్ 25ను బాలయ్య పండుగగా ప్రకటించాలని డిమాండ్

News October 24, 2024

HYD: ప్రహరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వినతి

image

ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం చుట్టూ ప్రహరీ నిర్మాణాన్ని దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ప్రహరీ నిర్మాణంతో దళితుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడం మానుకోవాలని జీహెచ్ఎంసీని కోరుతూ కమిషనర్ ఇలంబర్తికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రహరీ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని కోరారు.

News October 24, 2024

HYD: రేపు మంత్రుల రాక.. 26న మంత్రి మండలి మీటింగ్

image

సచివాలయంలో అక్టోబర్ 26న సాయంత్రం CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరుగనుంది. ఈ సమావేశం అక్టోబర్ 23వ తేదీన జరగాల్సి ఉండగా.. మంత్రులు అందుబాటులో లేకపోవడంతో శనివారానికి వాయిదా పడింది. సౌత్‌కొరియా పర్యటనకు వెళ్లిన పలువురు మంత్రులు అక్టోబర్ 25న తిరిగి హైదరాబాద్ చేరుకొని, 26న జరిగే సమావేశానికి హాజరవుతారు.

News October 24, 2024

HYD: నేడే లాస్ట్.. DONT MISS..

image

HYD, RR, MDCL, VKB జిల్లాల పరిధిలోని ట్రాన్స్‌జెండర్ల ఆధార్ నమోదు, వివరాల్లో మార్పుల కోసం HYD మలక్‌పేట ఆధార్ సెంటర్ హెడ్ ఆఫీస్ వద్ద అవకాశం కల్పించినట్లు ట్రాన్స్‌జెండర్ల సంక్షేమశాఖ తెలిపింది. నేటితో ప్రత్యేక క్యాంపు ముగియనుంది. వివరాలక కోసం 040-24559048 సంప్రదించాలని అధికారిక యంత్రాంగం సూచించింది. సాధ్యమైనంత మందికి ఈ సమాచారాన్ని చేరవేయాలని కోరారు. SHARE IT

News October 24, 2024

HYD: అభివృద్ధికి చిరునామాగా కేంద్ర ప్రభుత్వం: MP

image

దేశ అభివృద్ధికి చిరునామాగా కేంద్రం పనిచేస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అనేక రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు సేవలు మెరుగు పరిచిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో రైల్వే సేవల విస్తరణపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.