India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD మెట్రో 2వ దశ ప్రాజెక్ట్ DPR ఇప్పటికే సిద్ధం చేశారు. నాగోల్-RGIA ఎయిర్పోర్ట్ 36.6KM, ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట ఓల్డ్ సిటీ కారిడార్ 7.5KM, రాయదుర్గం-కోకాపేట 11.6KM, మియాపూర్ -పటాన్చెరు 13.4KM, ఎల్బీనగర్ -హయత్నగర్ 7.1KM, ఎయిర్పోర్ట్-ఫోర్త్ సిటీ 40KM పనులను రూ.32,237 కోట్ల అంచనాతో చేపట్టనున్నారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత, కేంద్రానికి పంపి అనుమతులు వచ్చాక పనులు మొదలుపెట్టనున్నారు.
HYD వాసులకు ముఖ్య గమనిక. కృష్ణా తాగునీటి సరఫరా ఫేజ్-3లో మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. సరూర్నగర్, ఆటోనగర్, బోడుప్పల్, చెంగిచెర్ల, పెద్ద అంబర్పేట, లాలాపేట, షేక్పేట, మల్లికార్జుననగర్, శంషాబాద్, జూబ్లీహిల్స్, బండ్లగూడ, బోజగుట్ట, శాస్త్రిపురం, ఫిల్మ్నగర్, ప్రశాసన్నగర్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.
SHARE IT
చలికాలం మొదలులోనే హైదరాబాద్ వణికిపోతోంది. గురువారం ఉదయం OU, KBR పార్క్, HCU, ఇందిరా పార్క్, ట్యాంక్బండ్ పరిసరాల్లో పొగ మంచు అలుముకుంది. గతేడాది కంటే ఈసారి చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2024, JANలో సిటీలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఏకంగా 5 నుంచి 6కు పడిపోయే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిలో బీ కేర్ ఫుల్.
లిబర్టీలోని అంబేడ్కర్ విగ్రహం చుట్టూ అడ్డు గోడ కట్టారని పలువురు కూల్చివేశారు. ఈ వివాదంపై జీహెచ్ఎంసీ వివరణ ఇచ్చింది. నగరంలోని వివిధ జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ నమూనాను అంబేడ్కర్ విగ్రహం చుట్టూ నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. HYD DRDOకు చెందిన రిసెర్చ్ సెంటర్ ఇమారత్లో(RCI) తాత్కాలిక పద్ధతిన ఖాళీల భర్తీ చేస్తున్నారు. SEP-27న నోటిఫికేషన్ విడుదలైంది. 30 రోజుల్లోగా దరఖాస్తు(OCT-26) చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. BE, B.TECH, M.TECH, MSC, PHD చేసిన వారు అర్హులు.
LINK: www.drdo.gov.in/drdo/careers
SHARE IT
అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
హైదరాబాద్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్లో స్కిన్లెస్ KG రూ. 200కే విక్రయించారు. గత 3 వారాలుగా మాంసం ధరలు పెరుగుతూ వచ్చాయి. బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ KG రూ. 243, విత్ స్కిన్ KG రూ. 213గా ధర నిర్ణయించారు. రిటైల్లో రూ. 147, ఫాంరేటు ధర రూ. 125 ఉంది. నగరంలోని కొన్ని హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 15 వరకు తగ్గించి అమ్మకాలు చేస్తుంటారు.
బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఆకాశ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. అప్రమత్తమైన సిబ్బంది అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. సీఐఎస్ఎఫ్ భద్రత అధికారులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు విమానంలో సోదాలు చేశాయి. చివరకు ఫేక్ కాల్ అని తేలడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
గతేడాది నవంబర్లో 9వ తరగతి బాలికపై ఆమె సవతి తండ్రి మహమ్మద్ ఖాజా పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనిపై అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంగళవారం న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఎల్బీనగర్లోని స్పెషల్ సెషన్స్ జడ్జి పోక్సో చట్టం కింద రూ. 30 వేల జరిమానా, జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. బాధితురాలికి నష్టపరిహారంగా రూ. 12 లక్షలు ప్రభుత్వం నుంచి అందజేయాలన్నారు.
చారిత్రాత్మక కట్టడం చార్మినార్ బ్యూటిఫికేషన్ పనుల నిర్వహణకై NTPC సంస్థ తమ CSRలో భాగంగా స్వచ్ఛ్ ఐకానిక్ ప్లేసేస్ ప్రాజెక్ట్ కింద GHMCతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు సంస్థల ప్రతినిధులు MOUలపై సంతకాలు చేశారు. NTPC AGM అఖిల్ పట్నాయక్, కులీకుత్బ్షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ జి.గురువీర లు ఫైళ్ల సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. దీనికి నిధులను NTPC సంస్థ సమకూర్చనుంది.
Sorry, no posts matched your criteria.