India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతాంగం అన్ని రకాలుగా మోసపోతున్నారాని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతు బంధు ఇయ్యక, రుణమాఫీ చెయ్యక, బోనస్ అందక.. చివరకు పంట కొనుగోలు కూడా చేయకపోవడం అన్నదాతకు శాపంగా మారిందని మండిపడ్డారు. వెంటనే హామీలను నిలుపుకోవాలని హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘పంటల కొనుగోలు ఇంకా స్టార్ట్ కాలేదు.. ఇప్పుడే బోనస్ ప్రస్తావన ఎందుకు హరీశ్రావు గారూ.. మా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తుంది. మీరు చేసిన అప్పులకు మిత్తిలు, కట్టుకుంటూ రైతులకు ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తున్నాం’ అని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ వివరణ ఇచ్చారు. అందులో భాగంగానే రైతుబంధు, రుణమాఫీ, రైతు భరోసా ఇస్తున్నామన్నారు.
HYD అశోక్ నగర్ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు G.O.29 రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు పలువురిని అరెస్టు చేసి, కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.అక్రమ కేసుల్లో అరెస్టైన జనార్దన్, సురేశ్, దామోదర్, రవి రాథోడ్లకు నాంపల్లి కోర్టులో బెయిల్ లభించినట్లు లాయర్ లక్ష్మణ్ తెలిపారు.
HYD నగర ప్రజలకు జలమండలి గుడ్ న్యూస్ తెలిపింది. నగరంలో పనికిరాని చేతిపంపుల వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 90 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వరద నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో జలమండలి, చేతి పంపులను ఇంజక్షన్ బోర్లుగా మార్చనుంది.
HYDలో జలమండలి 90 రోజుల స్పెషల్ డ్రైవ్లో సీవేరేజ్ టన్నెలింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయనుంది. జనవరి వరకు 90 % పనులు పూర్తి చేసి, మార్చి నాటికి ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. కింగ్ కోఠి, కాచిగూడ, బషీర్బాగ్ వద్ద 200 మీటర్ల మేర టన్నెలింగ్ పనులతో మురుగు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు.
✓ఇంటి పరిసరాలు ఎల్లప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి✓పూల కుండీలు, చెత్త డబ్బాలు, కొబ్బరి బోండాలు, కూలర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించండి✓పరిసర ప్రాంతాల్లో మురుగునీరు లేకుండా చూడండి✓వాటర్ ట్యాంకులు, సంపులను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి ✓ఇంటి కిటికీలు, తలుపులకు జాలీలు ఏర్పాటు చేసుకోండి ✓శరీరం పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తువులు ధరించండి •ఎంటమాలజీ అధికారి పై విధంగా రాంబాబు సూచించారు.
70,585 విద్యుత్ శాఖ ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఒకరోజు మూల వేతనం రూ.18.69 కోట్లు సీఎం సహాయనిధికి ప్రకటించారు. ఈరోజు సచివాలయంలో డిప్యూటీ సీఎంకు చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులకు వారి కుటుంబసభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ తదితరులు ఉన్నారు.
ఆదివాసీ పోరాటయోధుడు, గిరిజనుల ఆరాధ్య దైవం కొమురం భీమ్ జయంతి సందర్భంగా శాసనసభ మెంబర్స్లాంజ్లో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మధుసూదనా చారి తదితరులు పాల్గొన్నారు.
HYD కూకట్పల్లి MLA మాధవరం కృష్ణారావు నేడు తన క్యాంపు కార్యాలయంలో BRS నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 10 ఏళ్లలో KCR చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోరని, రూ.వేల కోట్లతో HYDను అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది.. కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పదేళ్లపాటు బుల్లెట్ వేగంతో పరుగులు పెట్టిన తెలంగాణకు.. అసమర్థ, అవినీతి పాలనే శాపంగా మారిందన్నారు. అనాలోచిత విధానాలతో ఆర్థిక వృద్ధికి బ్రేకులు వేసి పాతాళానికి పడిపోయేలా చేసిన పాపం ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ‘X’ వేదికగా ఫైర్ అయ్యారు.
Sorry, no posts matched your criteria.