India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని నేడు వందలాది మంది విద్యార్థులతో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించనున్నట్లు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటలకు బర్కత్పుర చౌరస్తా నుంచి లక్డికపూల్లోని కలక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వెంటే నడుస్తామని ఉమ్మడి RR, VKB బీసీ సంఘం నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజాభిప్రాయ సేకరణతో త్వరలో కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు. సోమవారం తాండూరుకు చెందిన బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్కుమార్, సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్ HYDలో ఆర్.కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.
గ్రూప్ -1 మెయిన్ పరీక్షలకు మొదటిరోజు 2,157 మంది డుమ్మా కొట్టారు. రంగారెడ్డి జిల్లాలో 11 పరీక్ష కేంద్రాల్లో 8,011 మంది అభ్యర్థులను కేటాయించింది. ఇందులో 5,854 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరు కాగా.. 2,157 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థులనే అనుమతించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సచివాలయంలో డిప్యూటీ CM భట్టివిక్రమార్కని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆస్కార్ అవార్డులో భాగం అయిన రాహుల్కు డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు నిర్మాత బండ్ల గణేశ్ ఉన్నారు. డిప్యూటీ సీఎంను కలవటంతో వారిద్దరు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వెంటే నడుస్తామని తాండూరు బీసీ సంఘం నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజాభిప్రాయ సేకరణతో త్వరలో కొత్త పార్టీని ఏర్పాటు ప్రకటించనున్నట్లు తెలిపారు. సోమవారం తాండూరుకు చెందిన బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్కుమార్, సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్ HYDలో ఆర్.కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.
తొలిరోజు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు హైదరాబాద్ జిల్లాలో 5,613 మంది అభ్యర్థులకు గానూ 4,896 మంది హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 87.23% హాజరైనట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పోలీసులు కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఈ నెల 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. కాగా మెయిన్స్కు మొత్తం 31,383 అభ్యర్థులు అర్హత సాధించగా, సోమవారం 22,744 మంది మాత్రమే పరీక్ష రాశారు.
అశోక్నగర్లో సోమవారం రాత్రి గ్రూప్-1 అభ్యర్థులు నిరసన చేపట్టారు. గ్రూప్ మెయిన్ పరీక్షలు నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామని పిలుపునిచ్చారు. రానున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేస్తామని వెల్లడించారు.
సుప్రీంకోర్టు తీర్పుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్పై మభ్యంతర ఉత్తర్వులకు సుప్రీం నిరాకరణ హర్షణీయమన్నారు. ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రయత్నాలను హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్థించాయని పేర్కొన్నారు. 13 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని అభ్యర్థులంతా సద్వినియోగం చేసుకొని ఉన్నత అవకాశాలు పొందాలన్నారు.
నేటినుంచి గ్రూప్-1 అభ్యర్థులకు పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థులు అందరూ ఆందోళన చెందకుండా, ఏకాగ్రతతో పరీక్ష రాయాలని సూచించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
నాచారంలో త్వరలో ప్రారంభించబోతున్న వ్యాల్యూ జోన్ హైపర్ మార్ట్లో పని చేయుటకు FMCG, ఫ్యాషన్, జనరల్ మర్చంటైజ్ విభాగంలో అనుభవం కలిగిన సేల్స్ పర్సన్స్, హెల్పర్స్, MIS, ఇన్వెంటరీ, లాజిస్టిక్స్, CSD టీమ్స్, ఆల్ట్రేషన్ టైలర్స్ కావలెను. Oct 23, 24 తేదీల్లో 11AM – 4PM వరకు ఇంటర్య్వూకు హాజరుకావచ్చు. అడ్రస్: వాల్యూజోన్ హైపర్ మార్ట్, నాచారం, మల్లాపూర్ రోడ్, హైదరాబాద్, పూర్తి వివరాలకు: 63097-77895
Sorry, no posts matched your criteria.