RangaReddy

News October 21, 2024

HYD: నివాళులర్పించే అర్హత కూడా లేదా: RSP

image

అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి ఆహ్వానించి హౌస్ అరెస్ట్ చేస్తారా అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి తనను ఆహ్వానించి వెళ్లనివ్వకుండా రాత్రి నుంచి హౌస్ అరెస్టు చేశారని వాపోయారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులర్పించే అర్హత కూడా తనకు లేదా అంటూ ప్రశ్నించారు. తామంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకంత భయమని ప్రశ్నించారు.

News October 21, 2024

HYD: అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా నివాళులు సీఎం

image

గోషామహల్‌లో పోలీసు అమరవీరుల స్మారకం వద్ద ఫ్లాగ్ డే పరేడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు విడిచిన యోధులందరికీ పోలీసు అమరవీరులకు, కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. త్యాగానికి, సేవకు ప్రతీక పోలీసులు అని, కర్తవ్యాన్ని నిర్వర్తించడంతో పాటు సమాజానికి తోడ్పాటు అందించడంలో పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

News October 21, 2024

గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్‌కు రెండు గోల్డ్ మెడల్స్

image

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రొఫెసర్ డా.జె.భూపేందర్ సింగ్ రాథోడ్ రెండు గోల్డ్ మోడల్స్ సాధించారు. హైదరాబాదులో జరిగిన 19th సౌత్ ఇండియా కాన్ఫరెన్స్‌లో బెస్ట్ సర్జికల్ వీడియో ప్రజెంటేషన్.., బెస్ట్ పేపర్ బై సీనియర్ టీచింగ్ ఫ్యాకల్టీ.. రెండు విభాగాల్లో రాథోడ్ రెండు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు ENT హెచ్ ఓ డి ప్రొ.రాథోడ్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

News October 21, 2024

HYD: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

HYD బాచుపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి, కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన అనూష బాచుపల్లి చౌరస్తాలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. దసరాకు ఇంటికెళ్లి తిరిగి.. తల్లిదండ్రులు నిన్న కాలేజీలో వదిలివెళ్లిన కొద్ది నిమిషాలకే కూతురు స్పృహ కోల్పోయిందని సిబ్బంది తెలిపారు. వారు కళాశాలకు చేరుకోగానే అనూష మరణించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 21, 2024

HYD: ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా..? మీకోసమే FREE

image

ఫోటోగ్రఫీ అంటే ఇష్టమై, వీడియో, ఫోటోగ్రాఫర్ కోర్స్ పూర్తి చేయాలనుకున్న వారికి HYD బషీర్ బాగ్ ఫోటోగ్రఫీ అకాడమీ ఛైర్మన్ శేఖర్ శుభవార్త తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ డిప్లమా కోర్సులు అందిస్తున్నారు. అక్టోబర్ 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని 2వ బ్యాచ్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుందని, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.

News October 20, 2024

BREAKING: హరియాణా గవర్నర్ కాన్వాయ్‌కు రోడ్డు ప్రమాదం

image

గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ఒక వ్యక్తి అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేయగా..ఒకదానికొకటి మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 20, 2024

HYD: GREAT..10 ఏళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి

image

HYD పంజాగుట్ట NIMSలో పదేళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి చేసి అరుదైన ఘనత సాధించింది. 2014 నుంచి 2024 వరకు ఈ ఘనత సాధించినట్లు అధికారులు తెలిపారు.1989లో ఆసుపత్రిలో కిడ్నీల మార్పిడి ప్రారంభించగా..అప్పటి నుంచి 2014 వరకు 730 మందికి కిడ్నీల మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. జీవన్ దాన్ కేడవర్ ట్రాన్ ప్లాంటేషన్ కార్యక్రమం ప్రవేశపెట్టడంతో కిడ్నీల మార్పిడి ఆపరేషన్ల వేగం గణనీయంగా పెరిగింది.

News October 20, 2024

HYD: ఏకంగా బ్యాంకులనే రూ.528.26 కోట్ల మోసం..!

image

హైదరాబాద్‌లో నకిలీ పత్రాలతో ఏకంగా రూ.528.26 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసిన శ్రీకృష్ణ స్టాకిస్ట్ అండ్ ట్రేడర్స్ పై ED విచారణ జరిపింది. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకుల నుంచి శ్రీకృష్ణ సంస్థ ప్రతినిధులు నకిలీ పత్రాలతో రుణాలు పొంది, చెల్లింపుల్లో జాప్యం చేసి, లోన్ వచ్చాక అవసరాలకు కాకుండా వేరే ఖాతాల్లోకి సొమ్ము మళ్లించారు.

News October 20, 2024

HYD: సీఎం ఆదేశాలకు కట్టుబడి ఉంటాం: హైడ్రా

image

అనుమతులు ఉంటే రియల్ ఎస్టేట్ వెంచర్ల జోలికి వెళ్లమని హైడ్రా తెలిపింది. రియల్ ఎస్టేట్ వెంచర్ల యజమానులు భయపడాల్సిన అవసరం లేదని, చెరువుల దగ్గర అనుమతులు ఉన్న నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేస్తుందని తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. అనుమతులున్న నిర్మాణాలను కూల్చేదిలేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారని, సీఎం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.

News October 20, 2024

HYD: CM రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న.!

image

మూసీ అంశం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న సందించారు. మూసిలోకి వచ్చే డ్రైనేజీ డైవర్ట్ చేయకుండా మూసి బ్యూటిఫికేషన్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. హైదరాబాద్ సిటీలోని శామీర్పేట, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల డ్రైనేజీ నీరు డైరెక్ట్ మూసిలో కలుస్తుందని. GHMC, జలమండలి మూసిలోకి డ్రైనేజీ పైప్ లైన్లు వేసిందని తెలిపారు.