RangaReddy

News October 20, 2024

FLASH: HYD: కొరియా టూర్‌పై KTR సెటైర్

image

మూసీ కోసం సౌత్ కొరియా టూర్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు. ప్రభుత్వం.. ఇంజనీర్లను, నిపుణులను, హైడ్రాలజిస్టులను స్టడీ చేసేందుకు పంపుతున్నందుకు అభినందించారు. తప్పకుండా వారందరూ కలిసి మూసీకి కావలసిన రూ.1.50 లక్షల కోట్లతో వస్తారని ఎద్దేవా చేశారు. #మూసీ లూటిఫికేషన్ అంటూ ట్విట్ చేశారు. కాగా.. టూర్లో పాల్గొనే 20 మందిలో 16 మంది మీడియా బృందం ఉండడం గమనార్హం.

News October 20, 2024

HYD: ఎస్సీ వర్గీకరణపై మాదిగ VS మాల

image

ఎస్సీ వర్గీకరణ చేస్తామని పీఎం మోదీ ప్రకటించి ముందుకెళ్తుండగా.. MRPS మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్వాగతించి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 1 వరకు మాలల మహా పాదయాత్ర చేస్తామని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తెలిపారు. డిసెంబర్ 1న మాలల మహా సంగ్రామ సభ నిర్వహిస్తామన్నారు.

News October 20, 2024

HYD: డిసెంబర్ 19 నుంచి బుక్ ఫెయిర్

image

‌పుస్తకాలు చదివే సంస్కృతి మరింతగా పెరగాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంత్రి కార్యాలయంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బుక్ ఫెయిర్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పుస్తకాభిమానులకు అనుకూలంగా నగర నడిబొద్దున పుస్తక ప్రదర్శన నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు.

News October 20, 2024

HYDలో పోలీస్ స్టేషన్లకు సైకిళ్లు..!

image

రాచకొండ పోలీస్ స్టేషన్లకు త్వరలో సైకిళ్లు రానున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెట్రోలింగ్ వాహనాలను పెంచడం, విజబుల్ పోలీసింగ్‌పై దృష్టి పెట్టినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇందులో భాగంగానే దాదాపు 200 సైకిళ్లను కొనుగోలుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. తద్వారా ప్రతి పోలీస్ స్టేషన్‌కు 2 నుంచి 5 సైకిళ్లు వస్తాయన్నారు. ప్రస్తుతం 3,000 మంది స్పెషల్ బ్లూ కొట్స్ పోలీసులు సేవలు అందిస్తున్నారు.

News October 20, 2024

బేగంపేట: సౌత్ ఇండియా సదస్సులో పాల్గొన్న గవర్నర్

image

బేగంపేటలో జరిగిన సౌత్ ఇండియా రీజినల్ సదస్సులో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు. HYD ఇంటర్ ఫర్ సోషల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ వద్ద జరిగిన ఈ ప్రోగ్రాంలో గవర్నర్ తెలంగాణ చాప్టర్‌పై ప్రసంగించారు. ఆర్థిక, సామాజిక అంశాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ నిపుణులు పాల్గొన్నారు.

News October 20, 2024

శేర్లింగంపల్లి: ఇన్నోవేషన్లకు పుట్టినిల్లుగా T-Hub

image

HYDలోని శేర్లింగంపల్లి రాయదుర్గం వద్ద ఏర్పాటు చేసిన T-Hub ఇన్నోవేషన్లకు పుట్టినిల్లుగా మారుతోంది. 20 దేశాలకు చెందిన 180 మంది ప్రముఖ ఇన్నోవేటర్లతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన టెక్నాలజీ, నూతన ఇన్నోవేషన్ల ద్వారా యువతకు ఉపాధి కల్పించే అంశాలపై చర్చలు జరిపినట్లుగా టెక్నోక్రాంట్ సాయి అభినయ్ తెలిపారు.

News October 20, 2024

HYD: గ్రూప్-1 పరీక్షకు ఏర్పాట్లు..! ఉత్కంఠత!

image

గ్రూప్-1 అభ్యర్థులు మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని, G.O.29 రద్దు చేయాలని గత వారం రోజులుగా HYDలో నిరసనలు చేస్తున్నారు. మరోవైపు HYDలో గ్రూప్-1 పరీక్షకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. HYD బేగంపేటలోని ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ ఎగ్జామ్ సెంటర్ తరగతి గదులలో ఎంటమాలజీ బృందం పిచికారి చర్యలు చేపట్టింది. HYD, RR, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మొత్తం 46 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి.

News October 20, 2024

HYDలో ఆదివారం అంగడి తెలుసా..? అయితే పదండి!

image

HYD ఎర్రగడ్డ అంగడి గత వందేళ్లుగా కొనసాగుతోంది. సంతలో అగ్గిపెట్టె నుంచి అలంకరణ వస్తువులు, కాళ్ల పట్టీల నుంచి కంప్యూటర్ విడిభాగాల వరకు దొరకందంటూ లేదు. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ పెరిగినా.. ఈ సంతకు డిమాండ్ తగ్గలేదు. ప్రతి ఆదివారం ఉ.5 నుంచి రా.10 వరకు ఈ సంత కొనసాగుతుంది. 1910 నిజాం కాలంలో దీన్ని మొదలుపెట్టారు. ఎర్రగడ్డ వంతెన, పెట్రోల్ బంక్, చౌరస్తా నుంచి ఫతేనగర్ బ్రిడ్జి వరకు 3KM ఉంటుంది.

News October 20, 2024

HYD: చిక్కడపల్లి CI బదిలీ

image

చిక్కడపల్లి CI సీతయ్యను HYD స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేస్తూ CP సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో బానోత్ రాజు నాయక్‌ను CI‌గా నియమించారు. అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో సీతయ్యను ట్రాన్స్‌ఫర్ చేసినట్లు సమాచారం. HYD కమిషనరేట్ పరిధిలో మరికొందరు అధికారులు బదిలీ అయ్యారు. ఖలీల్ పాషా-సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, సైదులు -ఖైరతాబాద్ DI, దోమలగూడ DIగా శ్రీశైలం‌ను నియమించారు.

News October 19, 2024

HYD: ఓయూ VC ప్రస్థానం! 

image

OUలో విద్యనభ్యసించిన ప్రొ.ఎం.కుమార్ అదే యూనివర్సిటీకి VCగా నియమితులయ్యారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పరిధి కొండాపురంకు చెందిన ఆయన, భద్రాచలం GMR పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లమా సివిల్ ఇంజినీరింగ్, ఉస్మానియాలో B.Tech, JNTUలో M.Tech, IIT బాంబే నుంచి Ph.D పట్టా అందుకున్నారు. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్‌గా, ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్‌తో పాటు వివిధ విభాగాల్లో పనిచేశారు. అనేక అవార్డులు సైతం పొందారు.