RangaReddy

News June 8, 2024

HYD: దారుణం.. మంత్రాల పేరిట అత్యాచారం

image

మేడ్చల్ PS పరిధి‌లో దారుణం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కిష్టపూర్‌లో ఒడిశా వాసి ఉంటున్నాడు. తన భార్య ఆరోగ్యం బాగోలేదని సహద్యోగి షేక్ మోసిన్(41)కు చెప్పుకున్నాడు. మంత్రం వేసి నయం చేస్తానని నమ్మించిన మోసిన్‌ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అందరూ బయటే ఉండాలి.. మంత్రం వేస్తానని చెప్పి గదిలో అత్యాచారం చేశాడు. అవమానంతో బాధితురాలు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఈ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు.

News June 8, 2024

BREAKING: HYDలో మరో MURDER

image

HYDలో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాపూర్ సమీపంలోని మీర్‌పేట్ PS పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నందనవనం రౌడీ షీటర్ సల్మాన్(23) హత్యకు గురయ్యాడు. అయితే అర్ధరాత్రి అతడి సోదరి.. సల్మాన్‌కి కాల్ చేసి డబ్బులు ఇస్తానని అయ్యప్ప గుడి వద్దకు రమ్మని పిలిచింది. అక్కడే ఉన్న సూరి, అతడి స్నేహితులు కలిసి సల్మాన్‌ని గొంతు కోసి చంపేశారు. కేసు నమోదైంది. 

News June 8, 2024

BREAKING: HYDలో మరో MURDER

image

HYDలో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాపూర్ సమీపంలోని మీర్‌పేట్ PS పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నందనవనం రౌడీ షీటర్ సల్మాన్(23) హత్యకు గురయ్యాడు. అయితే అర్ధరాత్రి అతడి సోదరి.. సల్మాన్‌కి కాల్ చేసి డబ్బులు ఇస్తానని అయ్యప్ప గుడి వద్దకు రమ్మని పిలిచింది. అక్కడే ఉన్న సూరి, అతడి స్నేహితులు కలిసి సల్మాన్‌ని గొంతు కోసి చంపేశారు. కేసు నమోదైంది. 

News June 8, 2024

HYD: ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన మహిళ మృతి

image

HYD కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బేగంపేట్‌లోని కుందన్ బాగ్‌లో నివాసం ఉంటున్న పరిణిత సంతానం కోసం ఐవీఎఫ్ చికిత్స చేయించుకునేందుకు మే 31న KPHB కాలనీలోని ప్రసాద్ ఆసుపత్రిలో చేరింది. వైద్యం వికటించి ఆమె మృతిచెందగా పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. విషయం బయట పడకుండా ఆస్పత్రి యాజమాన్యం గోప్యంగా ఉంచారు. కాగా విషయం ఈరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

News June 8, 2024

HYD: రామోజీరావుకు నివాళులర్పించిన KTR

image

HYD రామోజీ ఫిలిం సిటీలో ఈనాడు అధినేత రామోజీరావు పార్థివదేహానికి ఈరోజు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నివాళులర్పించారు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ.. రామోజీరావు మరణించడం చాలా బాధాకరమన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారని, మీడియా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులున్నారు.

News June 8, 2024

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మత్తు పదార్థాల కలకలం

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోకి కొందరు పేషంట్ సహాయకులు కల్లు, గుట్కా ప్యాకెట్లు లాంటి మత్తు పదార్థాలను తీసుకురావడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది గాంధీ సందర్శకులను తనిఖీలు చేస్తూ నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఆసుపత్రిలోకి మత్తు పదార్థాలను తీసుకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

News June 8, 2024

HYD: రామోజీరావుకు హరీశ్‌రావు నివాళి 

image

ఈనాడు అధినేత రామోజీరావు మృతిచెందడం చాలా బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈరోజు HYD రామోజీ ఫిలింసిటీలో ఆయనకు హరీశ్‌రావు నివాళులర్పించి మాట్లాడారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. మీడియా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

News June 8, 2024

HYD: మహా నగరాభివృద్ధి సంస్థ బలోపేతానికి స్పెషల్ ఫోకస్ 

image

HYD మహానగరాభివృద్ధి సంస్థను బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం HMDA పరిధిలోని 7 జిల్లాల్లో 7228 చ.కి.మీ.ల వరకు ఉంది. దీన్ని ప్రాంతీయ వలయ రహదారి వరకు విస్తరించనున్నారు. మరికొన్ని ప్రాంతాలను HMDA పరిధిలోకి తీసుకురావడమే కాకుండా.. జోన్ల సంఖ్యను ఆరు లేదా ఎనిమిది చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. HMDAలో కీలకమైన ప్రణాళిక విభాగాన్ని బలోపేతం చేయనున్నారు. SHARE IT

News June 8, 2024

HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు పోటెత్తారు..!  

image

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈరోజు ఉదయం నుంచి చేప మందు పంపిణీ కొనసాగుతోంది. ఈ క్రమంలో వివిధ రాష్టాల నుంచి భారీ ఎత్తున ప్రజలు చేప ప్రసాదం తీసుకునేందుకు తరలిరావడంతో గ్రౌండ్‌లో ఫుల్ రద్దీ నెలకొంది. వేలాది మంది తరలి రావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీ తెలిపారు.  

News June 8, 2024

HYD: వాట్సాప్‌ యూజర్లకు పోలీసుల ALERT

image

సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో కాల్ చేసి బెదిరిస్తూ డబ్బులు కాజేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి టెలికాం శాఖ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ వాట్సాప్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ..మనీలాండరింగ్ కేసులో మీ పై కేసు నమోదైందని, మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి రూ.10లక్షలు ఇవ్వాలని బెదిరించగా డబ్బు పంపి బాధితుడు మోసపోయాడు.