India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి గ్రూప్-1 అభ్యర్థులు లేఖ రాశారు. గ్రూప్-1 పరీక్షలు వెంటనే రీ షెడ్యూల్ చేయాలని, ఏ స్టడీ మెటీరియల్ చదవాలి అనేదానిపై TGPSC స్పష్టత ఇవ్వాలన్నారు. రిజర్వేషన్ హక్కులను పునరుద్ధరించాలని కోరారు. పోలీసుల దౌర్జన్యాన్ని ఆపి, శాంతియుతంగా నిరసనలు చేసుకొనివ్వాలని గ్రూప్-1 అభ్యర్థులు లేఖ రాశారు.
సౌత్ కొరియా రాజధాని సీయోల్ నగరంలో ఓ నాడు మురికి కుపమైన హన్ నదికి పునరుజ్జీవం పోసి అభివృద్ధి చేశారు.హన్ నదిని అభివృద్ధి చేసిన అనుభవాలు మూసికి ఉపయోగపడతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మురికిమయమైన మన HYD మూసి నది అభివృద్ధిలో భాగంగా,హన్ నదిని అభివృద్ధి పరిచిన తీరును ప్రత్యేక బృందం అధ్యయనం చేస్తుంది. అక్కడ ఉపయోగించిన టెక్నాలజీ, మేనేజింగ్ పద్ధతులను స్టడీ చేస్తారు.
హైదరాబాద్లో నేడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ వైపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద లాఠీఛార్జ్ జరగగా మరోవైపు ట్యాంక్ బండ్ వద్ద గ్రూప్ -1 అభ్యర్థులతో బండి సంజయ్ ర్యాలీ జరుగుతోంది. ఈ క్రమంలో భారీగా పోలీసులు మోహరించగా VST ఫ్లైఓవర్ బంద్ చేశారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పరేడ్ గ్రౌండ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయి. మరోవైపు బంద్ నేపథ్యంలో షాపులన్నీ మూసివేయడంతో క్లాక్ టవర్ వద్ద ఖాళీగా మారింది.
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఒక్కసారిగా వేలాది మంది హిందువులు తరలిరావడం, మసీదు ఉన్న రూట్కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కాగా పోలీసులపైకి ఆందోళనకారులు కుర్చీలు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. దీంతో పోలీసులు ఇంటర్నెట్ బంద్ చేసి వారిపై లాఠీఛార్జ్ చేశారు.
HYD, RR జిల్లాల్లో బతుకమ్మ, వినాయక చవితి, దుర్గామాత పలు శుభకార్యాల్లో పోలీసులు నిషేధం విధించిన పెద్ద ఎత్తున డీజేలు పెడుతున్నారు. శబ్దానికి దగ్గరగా ఉండి.. డాన్స్ చేయడంతో చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం. DJ ధ్వనులతో పలువురు యువకులతో పాటు పిల్లలు, వృద్ధుల జీవితాలు తల్లడిల్లుతున్నాయని, 50dB సౌండ్ వింటే గుండె బాగానే పని చేస్తుందని.. ఆ సౌండ్ పెరిగే కొద్దీ 8% గుండె దడ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ప్రకటనలో తెలిపారు. బీఈడీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలను వచ్చే నెల 5 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
HYD నగరంలోని కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రూప్-1 మెయిన్స్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు సాగనున్న పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించే వద్ద సరైన భద్రత చర్యలు చేపట్టాలని సూచించారు.
✓G.O.29 రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థుల నిరసన ✓గ్రూప్-4 బ్యాక్ లాగ్ పోస్టులు మిగలకుండా భర్తీ చేయాలని డిమాండ్ ✓కూకట్పల్లి:ఓకే కుటుంబంలో ముగ్గురికి MBBS✓19న సికింద్రాబాద్ బంద్ ✓HYD ట్రాఫిక్ నియంత్రణ పై హైడ్రా ఫోకస్ ✓ఉన్మాదుల ట్రైనింగ్కు అడ్డాగా HYD:ఎంపీ ఈటల✓మూసి కోసం సిద్ధమవుతున్న మాస్టర్ ప్లాన్ ✓RR: వరి ధాన్యం కొనుగోలుకు 45 కేంద్రాలు
సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టెస్టింగ్ రూమ్ తనిఖీలు చేశారు. తనిఖీల సమయంలో అధికారులు ఇంటర్ లాకింగ్ వాయిస్ లాగర్ సిస్టం పనిచేసే విధానాన్ని జనరల్ మేనేజర్ అధికారికి వివరించారు. సరైన సమయానికి సమాచారాన్ని చేరవేసి, ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు నూతన టెక్నాలజీ సహకరిస్తుందని తెలిపారు.
సికింద్రాబాద్ బంద్కు స్థానికులు పిలుపునిచ్చారు. కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసానికి నిరసనగా సికింద్రాబాద్ ప్రాంత ప్రజలు శనివారం బంద్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆలయం ముందు నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికతో కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానిక వ్యాపారులు, ఉద్యోగులు, దుకాణదారులు సహకరించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.