RangaReddy

News October 18, 2024

HYD: ట్రాఫిక్ నియంత్రణపై రంగంలోకి హైడ్రా..!

image

HYDలో ట్రాఫిక్ నియంత్రణకు హైడ్రా నడుం బిగించింది. వాహనాల రద్దీ సమస్యతో పాటు, అక్రమ ఫుట్ పాత్, రహదారి ఆక్రమణల తొలగింపునకు ట్రాఫిక్ బృందంతో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. రహదారులు, కాలనీల్లో ఆక్రమణల తొలగింపు, నీరు నిలిచే ప్రాంతాల సమస్యల పరిష్కారానికి DRF బృందాలకు శిక్షణ అందించనుంది. అక్రమంగా ఉన్న ఫుట్‌పాత్, రోడ్ల పక్కన ఉన్న దుకాణాలు, చెత్త డబ్బాలు, ట్రాన్స్‌ఫార్మర్లను సైతం తొలగించనున్నారు.

News October 18, 2024

HYD: అక్టోబర్ 20.. BE READY డోంట్ మిస్!

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు HYD నగరంలోని KBR పార్కులో అక్టోబర్ 20వ తేదీన ప్రజా సంబరాలు నిర్వహించనున్నారు. ఆర్ట్ క్రాఫ్ట్, లైవ్ మ్యూజిక్, షాపింగ్ అడ్వెంచర్ లాంటి అనేక సౌకర్యాలను ఈ సంబరాల్లో ప్రదర్శించనున్నారు. పెయింటింగ్ కాంపిటీషన్ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ తెలిపింది. ప్రోగ్రాం మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 6:30 వరకు జరుగుతుందని పేర్కొంది.

News October 18, 2024

HYD:కమిషనర్ ఇలంబర్తికి శుభాకాంక్షలు వెల్లువ

image

HYD జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇలంబర్తికి జోనల్ కమిషనర్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో ఎల్బీనగర్ జోన్ ZC హేమంత పటేల్, ఖైరతాబాద్ ZC అనురాగ్ జయంతి, శేర్లింగంపల్లి ZC ఉపేందర్ రెడ్డి, సికింద్రాబాద్ ZC రవికిరణ్, చార్మినార్ ZC వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

News October 18, 2024

HYD: నాణ్యమైన విద్యకు కట్టుబడి ఉన్నాం: సీతక్క

image

రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోనూ HYD పట్టణంలో అందుతున్న నాణ్యమైన విద్యను అందించేందుకు కట్టుబడి ఉన్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. విద్య వ్యవస్థలో పట్టణాలు, పల్లెల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగిస్తామన్నారు. HYD డిజిటల్ విద్యా సదస్సులో పాల్గొన్న మంత్రి, కంపెనీలు గ్రామాలను దత్తత తీసుకొని, డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం సహకారం అందించి,అందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో భాగం కావాలన్నారు.

News October 18, 2024

పూడూరు: దామగుండం ప్రాజెక్ట్ మోడల్ ఇదే..!

image

VKB జిల్లా పూడూరు పరిధిలోని దామగుండం అటవీ ప్రాంతంలో IVF లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రాజెక్టు మోడల్ రూపొందించారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగే సమయంలో నష్టపోయిన చెట్లకు బదులుగా వేరే ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు సాధ్యమైన కొన్ని చెట్లను వేరే ప్రాంతానికి తరలించనున్నారు.

News October 18, 2024

HYD: 30 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరం!

image

TG రాష్ట్రంలో సన్న వరి పండించిన రైతులకు ప్రోత్సాహకంగా క్వింటాకు అదనంగా రూ.500 అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని RR జిల్లా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వానాకాలం పంట ధరల ఫోర్ క్యాస్టింగ్ రిపోర్టులో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థులకు సన్న బియ్యం అవసరం తీర్చేందుకు దాదాపు 30 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరం అవుతుందని అంచనా వేశారు.

News October 18, 2024

RR: వరి ధాన్యం ధరల అంచనాపై REPORT

image

ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర మార్కెట్లలో వరి ధాన్యం సాధారణ రకం ధర క్వింటాకు రూ.2203- రూ.2350, ఏ గ్రేడ్ రకం రూ.2290- రూ.2680 ఉండొచ్చని RR జిల్లా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంచనా వేసింది. వరి ధాన్యం ధరలను అంచనా వేసేందుకు రాష్ట్ర అగ్రికల్చర్ మార్కెట్ డిపార్ట్మెంట్ ఆర్థిక సాయం అందించగా.. అగ్రికల్చర్ మార్కెట్ ఇంటలిజెన్స్ సెంటర్ ఏర్పాటు చేసి, 22 ఏళ్ల ధరల ఆధారంగా ఈ రిపోర్ట్ వెల్లడించింది.

News October 18, 2024

మేడ్చల్: ఇలా చేస్తే.. కల్తీ లేని కూరగాయలు!

image

HYలో ఎక్కడ చూసినా ఆహార కల్తీలు వెలుగు చూస్తున్నాయి. కూరగాయల్లోనూ పలుచోట్ల రసాయనాలు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో కల్తీ లేని కూరగాయల కోసం మేడ్చల్ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ యాదవ్ అనే వ్యక్తి మిద్దె వ్యవసాయం చేసి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మేడ్చల్ రాయల్ ఫంక్షన్ హాల్స్ సమీపంలో వంకాయ, టమాటా, కొత్తిమీర, పూదీన, పాలకూర, గోంగూర, తోటకూర పండిస్తున్నట్లు తెలిపారు.

News October 18, 2024

HYD: బస్సుల్లో చిల్లర కష్టాలు తీరనున్నాయి..

image

ప్రయాణికులకు RTC గుడ్ న్యూస్ చెప్పింది. QR కోడ్ స్కాన్ చేసి టికెట్ పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. బండ్లగూడ, DSNR డిపో బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ తీసుకొచ్చి సక్సెస్ అయింది. అన్ని బస్సుల్లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి అవసరమైన 4,500 ఇంటెలిజెంట్ టికెటింగ్ యంత్రాలను (ITM) తీసుకురానుంది. అలాగే విద్యార్థుల బస్‌పాస్‌ల కోసం ప్రత్యేక యాప్ తీసుకురానుంది. దీంతో వారికి క్యూలైన్ కష్టాలు తీరతాయి.

News October 18, 2024

RR: జిల్లా కలెక్టర్ శశాంక మీటింగ్ HIGHLIGHTS

image

✓రోడ్లపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించండి ✓RR జిల్లాలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 11 కేంద్రాలు సిద్ధం ✓జిల్లాలో గ్రూప్-1 పరీక్ష రాయనున్న 8 వేల మంది ✓అక్టోబర్ 21 నుంచి 27 వరకు మ.2 నుంచి సా.5 వరకు పరీక్ష ✓అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తారు ✓మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసేస్తారన్నారు.