RangaReddy

News June 4, 2024

ELECTION RESULTS: ఫస్ట్ సికింద్రాబాద్.. లాస్ట్ హైదరాబాద్!

image

లోక్‌సభ ఎన్నికల ఘట్టం నేటితో తుది దశకు చేరుకుంది. సరిగ్గా ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవనుంది. HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కలిపి మొత్తం 155 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా మొదట సికింద్రాబాద్ రిజల్ట్ సా.4గంటలకల్లా రానుంది. సా.4.40కి మల్కాజిగిరి, సా.5కి చేవెళ్ల, సా.5.20కి HYD రిజల్ట్ రానుంది. ఇక కంటోన్మెంట్ ఫలితం మ.3కే తేలనుంది.

News June 4, 2024

హైదరాబాద్‌లోని: నేడే కౌంటింగ్.. అంతా సిద్ధం

image

రాజధాని పరిధి‌ 4 MP స్థానాలు, కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక‌ కౌంటింగ్‌ నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. ఇప్పటికే RR జిల్లా కలెక్టర్ శశాంక, VKB కలెక్టర్‌ నారాయణరెడ్డి గొల్లపల్లిలోని కౌంటింగ్‌ సెంటర్‌ను పరిశీలించారు. HYD జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్‌ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో‌ ఏర్పాట్లపై ఆరా తీశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా‌ లెక్కింపు చేపట్టాలని అధికారులకు సూచించారు.

News June 3, 2024

హైదరాబాద్‌: తెల్లారితే కౌంటింగ్.. టెన్షన్!

image

లోక్‌సభ‌ ఎన్నికల కౌంటింగ్‌ వేళ HYD, RR జిల్లాల పరిధి MP అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే పలు సర్వేలు రాజధానిలో‌ని 3 స్థానాలు BJPకి అనుకూలంగా ఇచ్చాయి. కాంగ్రెస్‌కూ అవకాశం ఉందని మరికొన్ని సర్వేలు చెప్పగా.. BRSకు ఆదరణ ఉందని ఒకటి, రెండు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, HYD పార్లమెంట్‌లో కీలక నేతలు పోటీలో ఉండడం‌తో నగరవాసుల్లో‌నూ‌ ఈ ఎన్నికలు ఆసక్తిని పెంచాయి.

News June 3, 2024

RTV Survey: రాజధానిలో BRS ఓటమి!

image

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల సందర్భంగా RTV Survey‌‌ తాజాగా వివరాలు వెల్లడించింది‌. రాష్ట్రంలో BJP-10, INC-6, BRS-0, MIM- ఒక స్థానంలో‌ గెలిచే అవకాశం ఉన్నట్లు‌ తెలిపింది. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల‌లో‌ BJP, హైదరాబాద్‌లో MIM పార్టీ‌ గెలవబోతున్నట్లు‌ RTV Survey‌‌ పేర్కొంది. రాజధాని‌లో BRS ఖాతా తెరవదని‌ అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 3, 2024

REWIND 2023: కంటోన్మెంట్‌లో BRS గెలుపు!

image

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌‌లో 1,23,397 ఓట్లు పోలయ్యాయి.
లాస్య నందిత(BRS)-59,057(WIN)
శ్రీ గణేశ్(BJP)-41,888
వెన్నెల(INC)-20,825 ఓట్లు పడ్డాయి.
లాస్య నందిత అకాల మరణంతో‌ ఉపఎన్నిక అనివార్యమైంది. గతంలో BJP నుంచి పోటీ చేసి ఓడిన శ్రీ గణేశ్‌ ప్రస్తుతం INC నుంచి పోటీ చేశారు.‌ నివేదిత సాయన్న(BRS), వంశతిలక్‌(BJP) బరిలో ఉన్నారు. ఉప ఎన్నికలో 1,30,929 మంది ఓటేశారు. మరి గెలుపెవరిది.. మీ కామెంట్?

News June 3, 2024

HYD: రూ.50 కోట్లతో పారిపోయాడు..!

image

HYD మేడిపల్లి పీఎస్ పరిధి బోడుప్పల్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఓ వ్యక్తి భారీ మోసం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. భాషెట్టి నాగరాజ్ అనే వ్యక్తి అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ.50 కోట్లను ప్రజల నుంచి వసూలు చేసి పరారయ్యాడు. రూ.10 వడ్డీ ఇస్తామని చెప్పి ఒక్కొక్క వ్యక్తి వద్ద సుమారు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల పైన వసూలు చేశాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News June 3, 2024

HYD: స్టేట్-15 ర్యాంకుల్లో మన జిల్లాల విద్యార్థులు..!

image

POLYCET-2024 ఫలితాల్లో RR జిల్లా నుంచి MPCలో కటకం లలిత్ మనోహర్-119 మార్కులతో రాష్ట్రంలోనే 2వ, HYD చెలిమిళ్ల రోహన్-118 మార్కులతో 10వ ర్యాంకు, మేడ్చల్ వనం అమూల్య-118 మార్కులతో 12వ ర్యాంకు సాధించారు. HYD నుంచి బైపీసీలో మూతోజు విష్ణువర్ధన్-117 మార్కులతో స్టేట్ 5వ ర్యాంకు సాధించి ప్రభంజనం సృష్టించారు. స్టేట్ 15 ర్యాంకుల్లో రాజధాని విద్యార్థులు సత్తా చాటారు.

News June 3, 2024

HYD: మాధవి హత్య.. పోలీసుల దర్యాప్తు

image

HYD మల్కాజిగిరిలోని నేరేడ్‌మెట్ పీఎస్ పరిధి బలరాంనగర్‌లో ఈరోజు <<13367811>>మాధవి(34) అనే మహిళ<<>> హత్యకు గురైన విషయం తెలిసిందే. పిల్లలతో కలిసి అద్దె గదిలో ఉంటున్న ఆమెను ఎవరు చంపి ఉంటారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగిందా లేదా దోపిడీ దొంగలు ఎవరైనా ఇంట్లోకి చొరబడి ఆమెను చంపేశారా అనే కోణంలో క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నారు.

News June 3, 2024

HYD: పాలిసెట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

image

పాలిసెట్ ఫలితాల్లో రాజధాని విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. HYDలో 10,095 మంది పరీక్ష రాయగా..84.40% ఎంపీసీ, 80.73% బైపీసీ, RR జిల్లాలో మొత్తం 4,103 మంది పరీక్ష రాయగా.. 86.74% ఎంపీసీ, 83.55% బైపీసీ, మేడ్చల్ జిల్లాలో మొత్తం 4,267 మంది పరీక్ష రాయగా.. 91.74% ఎంపీసీ, 84.09% బైపీసీ, VKB జిల్లాలో మొత్తం 1145 మంది పరీక్ష రాయగా..86.99% ఎంపీసీ, 85.59% బైపీసీలో ఉత్తీర్ణత సాధించినట్లుగా అధికారులు వెల్లడించారు.

News June 3, 2024

BREAKING: గోల్కొండ బోనాల జాతర తేదీల ప్రకటన

image

భాగ్యనగర్ శ్రీమహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు ఈరోజు మాట్లాడారు. ఈ ఏడాది HYD గోల్కొండలో ఆషాఢ మాసం బోనాల జాతరను జులై 7వ తేదీన ప్రారంభించనున్నామని తెలిపారు. ఇక పాతబస్తీలోని లాల్‌దర్వాజ సహా అన్ని ఆలయాల్లో జులై 19న ఉత్సవాలు ప్రారంభమవుతాయని, జులై 28న బోనాలు సమర్పిస్తామని చెప్పారు. 29వ తేదీన జాతర, సామూహిక ఘటాల ఊరేగింపు ఉంటుందని వెల్లడించారు. SHARE IT