RangaReddy

News October 9, 2024

HYD: బస్సులు, రైళ్లు FULL.. వామ్మో కష్టమే..!

image

హనుమకొండ, వరంగల్, తొర్రూరు, ఖమ్మం సహా ఇతర ప్రాంతాలకు HYD నగరం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సొంతూర్లకు వెళ్తున్నారు. రేపు సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో సాయంత్రం వేళ రైళ్లు, బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. కనీసం కూర్చునే పరిస్థితి లేదని ప్రయాణికులు వాపోయారు. రైళ్లలో వెళ్తున్న వారు ప్రతి స్టేషన్ ట్రెయిన్ వద్ద దిగి మళ్లీ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News October 9, 2024

HYD: భర్త బయటపెట్టిన వీడియోలపై స్పందించిన దివ్యజ్యోతి

image

HYD మణికొండ డీఈఈ దివ్యజ్యోతిపై ఆమె భర్త శ్రీపాద్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె నిత్యం లంచం తీసుకుంటుందని పేర్కొంటూ.. నోట్ల కట్టలతో కూడిన వీడియోలను రిలీజ్ చేశారు. దీనిపై దివ్యజ్యోతి స్పందించారు. తాము గత సంవత్సరం నుంచి దూరంగా ఉంటున్నామని పేర్కొన్నారు. కోర్టులో విడాకుల కేసు నడుస్తోందని వెల్లడించింది. కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

News October 9, 2024

గ్రేటర్ HYDలో వ్యర్ధాల నిర్వహణకు కమాండ్ కంట్రోల్

image

గ్రేటర్‌లో ఘన వ్యర్ధాల నిర్వహణకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు GHMC కమిషనర్ తెలిపారు. వ్యర్ధాల నిర్వహణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వ్యర్ధాల నిర్వహణపై GHMC కమిషనర్ ఆమ్రపాలి అధ్యక్షతన సమావేశం జరిగింది. 11 మంది ఆపరేటర్లు నూతన టెక్నాలజీని వివరించారు. ఈ టెక్నాలజీతో గార్బేజి కలెక్షన్, స్ట్రీట్ స్వీపింగ్, ఫిర్యాదుల పరిష్కారం సులభతరం కానుంది.

News October 9, 2024

HYD: దసరా.. ఊరెళ్లేవారికి ఛార్జీల మోత!

image

బతుకమ్మ నేపథ్యంలో TGRTC ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే స్పెషల్ బస్సుల్లో దాదాపు 25 శాతం అధికంగా ఉన్నట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. పండుగ వేళ తమ జేబులకు చిల్లు పడుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఉప్పల్‌ అధికారులను వివరణ కోరగా.. కేవలం స్పెషల్‌ బస్సులకే మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయన్నారు.

News October 9, 2024

RR: జనాభా ఆధారంగా పంచాయతీలకు నిధులు

image

RR, MDCL, VKB జిల్లాలలో గ్రామ పంచాయతీలకు ఇటీవలే నిధులు విడుదల చేశారు. 3 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 వేలు, 3వేల నుంచి 8వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.75 వేలు, 8వేలకు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన కేటాయింపులు జరిగినట్లు తెలిపారు.

News October 9, 2024

బతుకమ్మ: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్!

image

సద్దుల బతుకమ్మ వేడుకలకు రాజధాని ముస్తాబైంది. ఎల్బీస్టేడియం, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌ అంతటా రేపు రాత్రి సందడే సందడి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి ట్యాంక్‌బండ్‌‌కు తీసుకొస్తారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు బాగ్‌లింగంపల్లి, KPHB, సరూర్‌నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్‌లోని GHMC మైదానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు బతుకమ్మ పాటలతో హైదరాబాద్‌ హోరెత్తనుంది.

News October 8, 2024

HYDRAపై రేపు MLA KVR ప్రెస్‌మీట్

image

HYD సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో రేపు మ.12 గంటలకు కామారెడ్డి BJP MLA కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ‘హైడ్రా’ పనితీరు గురించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే హైడ్రా పనితీరును కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మరి KVR ఏం చెబుతారో ఉత్కంఠ నెలకొంది.

News October 8, 2024

HYD: వీడియోలో ఏం తప్పుందో చెప్పాలి: హరీశ్‌రావు

image

జర్నలిస్టు గౌతమ్ వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గౌతమ్ షేర్ చేసిన వీడియోలో తప్పేముందో చెప్పాలని ఆయన X ద్వారా డిమాండ్ చేశారు. ప్రజల ఆందోళనలు, బాధలను తెలిపితే అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ తెలంగాణ డీజీపీని ఆయన ప్రశ్నించారు.

News October 8, 2024

రైల్వేలో JOBS.. సికింద్రాబాద్‌‌లో 478 పోస్టులు

image

దేశవ్యాప్తంగా 8,113 NTPC గ్రాడ్యుయేట్ పోస్టులకు RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగం చేయాలనుకునేవారికి అప్లై చేసేందుకు మరో 5 రోజులే గడువు ఉంది. అక్టోబర్‌ 13వ తేదీన అప్లికేషన్‌ గడువు ముగియనుంది. కేవలం మన సికింద్రాబాద్‌(SCR) రీజియన్‌లోనే 478 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ చేసిన వారు అర్హులు. ఇంగ్లిష్, హిందీ టైపింగ్, కంప్యూటర్‌పై అవగాహన ఉండాలి. ఆసక్తి గలవారు అప్లై చేసుకోవచ్చు.
SHARE IT

News October 8, 2024

HYD: LRS దరఖాస్తుకు కావలసిన పత్రాలు

image

HYD, RR, MDCL జిల్లాలలో LRS దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. LRS దరఖాస్తు కోసం తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు ఉండాలని అధికారులు తెలిపారు. LRS ప్రతి దరఖాస్తుకు లింక్ డాక్యుమెంట్, లే అవుట్ కాపీ, సైట్‌ప్లాన్, స్థల మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రం, ఈసీ, సేల్ డీడ్ దస్త్రాలను జత చేయాలని పేర్కొంది. సిటిజన్ లాగిన్‌లో చరవాణి ద్వారా ఈ దస్త్రాలను జత చేసే వీలు కల్పించింది.