RangaReddy

News June 2, 2024

HYD: ప్రొ.జయశంకర్ ఆ జన్మ తెలంగాణ వాది: KCR

image

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆ జన్మ తెలంగాణ వాది అని.. ఈ సమయంలో ఆయన్ను స్మరించుకోకుండా ఉండలేమని BRS అధినేత కేసీఆర్‌ అన్నారు. HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. అప్పట్లో చాలా మంది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. గతంలో తెలంగాణ అనే పదాన్నే పలకవద్దని అప్పటి స్పీకర్‌ అసెంబ్లీలో అన్నారని చెప్పారు.

News June 2, 2024

HYD: ట్యాంక్‌బండ్‌పై ఘనంగా ‘పదేళ్ల పండుగ’ సంబురాలు

image

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కళాకారులు తరలివచ్చారు. 

News June 2, 2024

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో సైబరాబాద్ సీపీ

image

కొండాపూర్‌ పరిధిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీ అవినాశ్ మహంతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. 2014 జూన్ 2న అధికారికంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీసు శాఖ సిబ్బంది మనస్ఫూర్తిగా కర్తవ్య నిర్వహణ చేయాలని కోరారు.

News June 2, 2024

గ్రేటర్ HYDలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

image

గ్రేటర్ HYDలోని ప్రతి బస్ డిపోలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ పనులను ప్రారంభించింది. కంటోన్మెంట్, మియాపూర్-1 డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, గ్రేటర్‌లోని మరో 23 బస్ డిపోల్లోనూ జులై చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే 62 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా మరో 20 జూన్ చివరి నాటికి అందుబాటులో రానున్నాయి.

News June 2, 2024

HYD: తెలంగాణ భవన్‌లో జెండావిష్కరించిన KTR

image

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాల ఫలితం, తెలంగాణ ప్రజల పోరాటంతో ఏర్పడిన రాష్ట్రాన్ని 10 ఏళ్లు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నమని గుర్తు చేశారు. మాజీ సీఎం KCRతో సహా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కొనియాడారు.

News June 2, 2024

HYD: ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న రాచకొండ కమిషనర్

image

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి HYD నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కార్యాలయంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల పోరాటాలు, ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ప్రత్యేక రాష్ర్ట పోరాటాన్ని తాను స్వయంగా చూశానని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసుశాఖలో ఎన్నో నూతన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.

News June 2, 2024

RR: ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా జరగనుంది..!

image

✓జూన్ 4న ఉ.4 గంటలకు పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూములను తెరుస్తారు
✓ఉ.5:30 నుంచి 6 వరకు టేబుల్స్ కేటాయింపు రాండమైజేషన్
✓మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
✓ఉదయం 8 గంటలకు EVM ఓట్ల లెక్కింపు
✓ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు
✓ HYD, RR, MDCL,VKB జిల్లాల్లో సర్వం సిద్ధమైంది
•పై వివరాలను RR కలెక్టర్ శశాంక తెలిపారు.

News June 2, 2024

HYD: మీ సలహాలను మాతో పంచుకోండి!

image

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజల నుంచి ట్రాఫిక్ తగ్గించడం, జంక్షన్ డెవలప్మెంట్, కార్ పూలింగ్, రైడ్ షేరింగ్, ట్రాఫిక్ సంబంధిత సమస్యలపై సలహాలు, సూచనలను స్వీకరించనున్నట్లు తెలిపారు. మీ అమూల్యమైన ఐడియాలను 7569311356 వాట్సప్, Cyberabad Traffic police X అకౌంట్, @Cyberabadtrafficpolice ఫేస్ బుక్ అకౌంట్‌కు తెలపవచ్చని పేర్కొన్నారు.

News June 2, 2024

HYD: ORRపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

HYD ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలో ఆగి ఉన్న రెండు కార్లను ఢీకొంది. ఒక్కసారిగా వారి పైకి ట్యాంకర్ దూసుకువెళ్లడంతో యువతి, యువకుడు మృతి చెందారు. ఔటర్ రింగు రోడ్డులో కార్లు ఆపి ఫొటోలు దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు నార్సింగి పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.

News June 2, 2024

CPAC సర్వే: సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరిలో BRS గెలుపు!

image

సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరిలో BRS గెలుస్తుందని CPAC ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. TGలో BRSకు 11, BJPకి 2, కాంగ్రెస్, MIM చెరో స్థానంలో గెలుస్తాయని అంచనావేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, BRSకు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని CPAC తెలిపింది. కాగా ఈ స్థానాల్లో కొన్ని బీజేపీ, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేయగా.. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.