India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 4న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసేయాలని సీపీ అవినాశ్ మహంతి ప్రకటన జారీ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలోని కొన్ని మినహా అన్ని మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసేయాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 5న ఉదయం 6 గంటల వరకు బంద్ కొనసాగుతుందని చెప్పారు. మరో వైపు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా జూన్ 2న HYDలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్యాట్నీ క్రాస్ రోడ్ నుంచి స్వీకర్ ఉపకార్ వరకు.. పరేడ్ గ్రౌండ్ రోడ్డులో టివోలీ క్రాస్ రోడ్డు వరకు..అక్కడి నుంచి బ్రోక్ బ్యాండ్ క్రాస్ రోడ్డు వరకు.. CTOనుంచి YMCAక్రాస్ రోడ్డు, సెయింట్ జాన్ రోటరీ మార్గంలో వాహనాలను అనుమతించబోమన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలన్నారు.
> మాదాపూర్, ఉప్పల్ శిల్పారామంలో నృత్య ప్రదర్శనలు
> అమరవీరుల స్థూపం వద్ద KCR నివాళులు
> ఘట్కేసర్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురి ARREST
> సైఫాబాద్లో బైకులను దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
> ఓయూలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
> PHCలో అంబులెన్స్, ఆక్సిజన్ లేక శిశువు మృతి
> గవర్నర్తో CM రేవంత్ రెడ్డి భేటీ> కాచిగూడ రైల్వే స్టేషన్లో సెల్ఫోన్ స్నాచింగ్
> బాగ్ అంబర్పేట్లో కార్ల బ్యాటరీ చోరీ
వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా HYD మాదాపూర్లోని శిల్పారామంలో శనివారం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. కుమారి ప్రణవి తుమ్మటి వారి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను ఎంతో ఆకట్టుకుంది. నగరవాసులు పెద్ద ఎత్తున శిల్పారామానికి విచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు.
HYDలో MIM అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, చేవెళ్లలో BJP అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరిలో BJP అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని చాణక్య X సర్వే తేల్చి చెప్పింది. ఇక సికింద్రాబాద్లో మాత్రం BRS అభ్యర్థి పద్మారావు గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, BJP అభ్యర్థి కిషన్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉందని అంచనా వేసింది. ఇక్కడ ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.
HYDలో MIM అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరిలో BJP గెలుస్తుందని పొలిటికల్ ల్యాబొరేటరీ (PL) సర్వే అంచనా వేసింది. చేవెళ్లలో BRS నుంచి కాసాని, కాంగ్రెస్- రంజిత్ రెడ్డి, BJP- కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేశారు. మల్కాజిగిరిలో BRS-రాగిడి, కాంగ్రెస్-సునీత, BJP-ఈటల పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్లో BRS-పద్మారావు, కాంగ్రెస్- దానం నాగేందర్, BJP-కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు.
HYD, SEC లోక్సభ పరిధి 13 ప్రాంతాల్లో 16 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్లు రోనాల్డ్ రాస్ తెలిపారు. శనివారం నిజాంకాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టితో కలిసి పరిశీలించారు. ‘ఒక్కో సెంటర్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నాం. అత్యధికంగా జూబ్లీహిల్స్లో 20 టేబుళ్లు ఉన్నాయి. యాకుత్పురాలో 24 రౌండ్లు, చార్మినార్లో 15 రౌండ్లలో లెక్కింపు పూర్తి అవుతోంది’ అని ఆయన వెల్లడించారు.
కంటోన్మెంట్ ఉపఎన్నిక కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి లోక్సభ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఈవీఎంలను కూడా మేడ్చల్ జిల్లా పరిధి లెక్కింపు కేంద్రానికి తరలించారు. ఉప ఎన్నిక కౌంటింగ్లో భాగంగా మొత్తం 17 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని రొనాల్డ్ రాస్ శనివారం తెలిపారు. ఈ ఫలితాన్ని కంటోన్మెంట్ బోర్డు CEO పర్యవేక్షించనున్నారు.
చిలకలగూడ పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. సెల్లార్తో పాటు పిల్లర్లు, స్లాబ్, కిటికీల పెచ్చులు ఊడి కింద పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. PS భవనం ఎప్పుడు కుప్ప కూలుతుందోనని అటు పోలీస్ సిబ్బంది, ఇటు సందర్శకులు బిక్కు, బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. భవనం ఖాళీ చేయాలని GHMC పలుమార్లు నోటీసులిచ్చినా ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని బండారి శ్రీనివాస్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి శశాంక.. వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతితో కలిసి పరిశీలించారు. అనంతరం కౌంటింగ్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కౌంటింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.