India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానం MIMదే అని సర్వేలన్నీ తేల్చి చెప్పాయి. ఇక్కడ MIM నుంచి అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేశారు. BJP నుంచి మాధవీలత, BRS నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ సమీర్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత MIM, BJPకి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా తాజాగా విడుదలైన అన్ని సర్వేల్లో MIMదే విజయమని అంచనా వేశాయి. దీనిపై మీ కామెంట్?
సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాలు BJPవే అని ఆరా మస్తాన్ సర్వే తేల్చి చెప్పింది. చేవెళ్లలో BRS నుంచి కాసాని, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, BJP నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేశారు. మల్కాజిగిరిలో BRSనుంచి రాగిడి, కాంగ్రెస్ నుంచి సునీత, BJPనుంచి ఈటల పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్లో BRS నుంచి పద్మారావు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, BJPనుంచి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణానికి మనందరం కృషి చేయాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత అధ్యాపకుడు, ప్రొఫెసర్ జి.హరగోపాల్ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులకి పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక కౌతం, తక్కువేమి మనకు, రామకోదండ రామ, శ్రీమన్నారాయణ, పలుకే బంగారమయేహ్న, వినరో భాగ్యం, వింతలు వింటివా యశోద, నాటకరంజిని పదవర్ణం, త్యాగరాజ కీర్తన అంశాలను లక్ష్మీప్రియా, సహస్ర, వైష్ణవి, రిధి, నిహారిక, హిరణ్య, ఈషా, సాన్విక, అధిత్రి, వైద్య, సంకీర్త్ ప్రదర్శించారు.
సికింద్రాబాద్ నుంచి దివ్య దక్షిణ యాత్ర పేరిట ప్రత్యేక రైలు జూన్ 22వ తేదీన అందుబాటులో ఉంటుందని IRCTC తెలిపింది. ఒక వ్యక్తికి రూ.14,250 ఛార్జి ఉంటుందని, అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, తంజావూరు లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని పేర్కొంది. ఆసక్తి ఉంటే https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG25 లింక్ ద్వారా బుక్ చేసుకోవాలని తెలిపింది. SHARE IT
రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఈరోజు పరిశీలించారు. 10వ ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో MLA దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, MP అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలత, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా నకిరేకల్కు చెందిన సంగీత(24) తన సోదరుడితో కలిసి HYD వచ్చింది. మేడ్చల్లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉంటూ గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని చనిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు.
HYDలో పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ నైజీరియన్ను పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపిన వివరాలు.. నైజీరియా దేశానికి చెందిన కాస్మోస్ రాంసి అలియాస్ ఆండి బిజినెస్ వీసాపై 2014లో భారతదేశానికి వచ్చాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మకాం మార్చి డ్రగ్స్ పెడ్లర్గా మారాడు. టెలిగ్రామ్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్న రాంసిని అరెస్టు చేసి 16 గ్రా. కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
TG ఏర్పాటైన పదేళ్లలో ప్రపంచ నగరాలతో HYD పోటీ పడిందని చెప్పొచ్చు. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ (2022) గెలుచుకోవడం ఇందుకు నిదర్శనం. HYDలో జరిగిన కీలక ఘట్టాలు.. 1. మెట్రో ప్రారంభం, 2. SRDPతో 36 ఫ్లై ఓవర్లు, 3. ట్యాంక్బండ్, HMDA పార్కుల సుందరీకరణ, 5. కేబుల్ బ్రిడ్జి, 6. IT కారిడార్, 7. నూతన సెక్రటేరియట్, 8. అమరవీరుల స్తూపం, 9. అంబేడ్కర్ విగ్రహం, 10. SNDP పనులు. ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి.
లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు ముగియనుండడంతో అందరి చూపు ఎగ్జిట్ పోల్స్పై పడింది. గత MP ఎన్నికల్లో రాజధాని ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. హైదరాబాద్లో (MIM), సికింద్రాబాద్(BJP), మల్కాజిగిరి(INC), చేవెళ్ల(BRS)ని గెలిపించుకొన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సాయంత్రం 6.30 తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఎవరివైపు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.
Sorry, no posts matched your criteria.