RangaReddy

News June 1, 2024

హైదరాబాద్‌: CM రేవంత్ ఆహ్వానం.. KCR వస్తారా?

image

రేపు HYD పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో సోనియా గాంధీ, ఉద్యమకారులు, అమరుల కుటుంబీకులను భాగస్వాములను చేయాలని‌ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఉద్యమంలో KCR కీలకం కావడంతో CM రేవంత్ ఆయనకూ ఆహ్వానం పంపారు. శుక్రవారం ప్రభుత్వ ప్రోటోకాల్ ఛైర్మన్‌ హర్కర వేణుగోపాల్ ఇన్విటేషన్ అందించారు. మరి CM పిలుపుతో KCR వస్తారా? లేదా? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

News June 1, 2024

హైదరాబాద్‌‌లో ACB తగ్గేదేలే!

image

HYDలో ACB మెరుపుదాడులు కొనసాగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే‌ 8 మందికి చెక్ పెట్టింది. లంచం తీసుకొంటున్న ఇరిగేషన్‌ శాఖ AE భన్సీలాల్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌ కార్తీక్‌, నిఖేష్‌కుమార్‌తో పాటు సర్వేయర్‌ గణేశ్‌ను పట్టుకొంది. కుషాయిగూడ PSలో రూ. 3 లక్షలు డిమాండ్ చేసిన CI వీరాస్వామి, SI షఫీ ఆట కట్టించింది. గొర్రెల పంపిణీ స్కాం విచారణలో భాగంగా మాజీ మంత్రి OSDతో పాటు మరో అధికారిని ACB అరెస్ట్ చేయడం విశేషం.

News May 31, 2024

గచ్చిబౌలి‌ విప్రో సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం

image

గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. గౌలిదొడ్డి నుంచి గచ్చిబౌలి వైపు వస్తోండగా బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్టూడెంట్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులు నవీన్ రెడ్డి(22), హరీశ్ చౌదరి(22)గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 31, 2024

HYD: మైనర్‌ను గర్భవతిని చేసిన యువకుడు

image

చేవెళ్లలో దారుణం చోటు చేసుకుంది. చేవెళ్లకు చెందిన పదోతరగతి విద్యార్థినిని ఓ వ్యక్తి గర్భవతిని చేశాడు. అబార్షన్ చేయించడంతో గాంధీలో ప్రాణాపాయ స్థితిలో విద్యార్థిని కొట్టుమిట్టాడుతుంది. విద్యార్థిని తండ్రి బుచ్చయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా సుదర్శన్ అనే వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు సుదర్శన్‌కు వివాహం కాగా.. ఓ కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 31, 2024

సమాజ నిర్మాణంలో తుమ్మబాల ఎనలేని సేవలు: సీఎం

image

సమాజ నిర్మాణంలో తుమ్మబాల ఎనలేని సేవలు అందించి శాంతి, మతసామరస్యం, విద్యను ప్రజలకు అందించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తుమ్మబాలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని 2019 ఎంపీ ఎన్నికల్లో, 2023 శాసనసభ ఎన్నికల్లో వారు మమ్మల్ని మంచి మనసుతో ఆశీర్వదించారు. ఆయన మరణం వారి అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు.

News May 31, 2024

HYD: స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు

image

స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిర్వాహకులు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లోని ఓ అపార్ట్‌మెంట్లో స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను పోలీసులు రైడ్స్ చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

News May 31, 2024

BREAKING.. HYD: నీటిపారుదల శాఖలో ఏసీబీ రైడ్స్, ముగ్గురి అరెస్టు

image

ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు వివిధ శాఖలపై రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అదేవిధంగా రెడ్ హిల్స్‌లో ఉన్న రంగారెడ్డి జిల్లా పర్యవేక్షక ఇంజినీరింగ్ శాఖలో రాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బన్సీలాల్, ఇల్లు కార్తీక్, నికేష్ అధికారులకు పట్టుపడ్డారు.

News May 31, 2024

HYD: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రిహార్సల్స్‌.. ట్రాఫిక్‌ ఆంక్షలు

image

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రిహార్సల్స్‌ సందర్భంగా గన్‌పార్క్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌, ట్యాంక్‌బండ్‌ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై శుక్రవారం ఆంక్షలుంటాయని పోలీస్‌ అధికారులు తెలిపారు. గన్‌పార్క్‌ పరిసరాల్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, పరేడ్‌ గ్రౌండ్స్‌ వద్ద ఉదయం 10నుంచి 11 గంటల వరకు, ట్యాంక్‌బండ్‌పై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయన్నారు.

News May 31, 2024

రంగారెడ్డి: జిల్లాలో విత్తనాల కొరత లేదు: కలెక్టర్

image

RR జిల్లాలో పత్తి, పచ్చిరొట్ట విత్తనాల కొరత లేదని కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్ లో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గీతారెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అగ్రో రైతు సేవ కేంద్రాల్లో రైతులకు అందజేస్తారని తెలిపారు. మేలు రకం పత్తి విత్తనాలు ప్రైవేటు డీలర్ల ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు.

News May 31, 2024

ఉద్యమానికి ఊపిరి ‘భాగ్యనగరం’

image

ప్రజల బలిదానాలు, అనేక మంది పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా ఇప్పటికీ నగరంలోని పలు ప్రాంతాలు ఆనాటి ఘటనలను గుర్తుచేస్తుంటాయి. 2009నవంబర్ 9న LBనగర్ చౌరస్తాలో శ్రీకాంతచారి బలిదానం, 2010జనవరి 3న OUలో విద్యార్థి మహాగర్జన, 2011మార్చి 10న HYDలో మిలియన్ మార్చ్, 2011సెప్టెంబర్ 13న ప్రారంభించిన సకలజనుల సమ్మె మలిదశోద్యమంలో ఓ మైలురాయిగా నిలిచింది.