India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు విశ్వవిద్యాలయానికి ఇంతవరకు దళితుడిని వీసీగా నియమించలేదని మంగళవారం దళిత బహుజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. HYDలో మాట్లాడుతూ.. బీసీ, ఓసీ, బ్రాహ్మణులు వీసీలుగా పనిచేసిన తెలుగు విశ్వవిద్యాలయానికి ఇప్పుడు తమ బహుజనులను నియమించాలని సీఎంను కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమ నాయకుడు ఆచార్య బన్న అయిలయ్యను వీసీగా నియమించాలని ఈ సందర్భంగా సూచించారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. మరో 2 గంటలు నగరంలో కుండపోత వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా మణికొండ, మాదాపూర్, KPHB, బాలానగర్, నార్సింగి, అత్తాపూర్, మియాపూర్, ట్యాంక్బండ్ పరిసరాల్లో వర్ష సూచన ఉందన్నారు. ఇప్పటికే నార్సింగిలో వాన దంచికొడుతోంది.
SHARE IT
HYDలోని పలు దేవాలయాల్లో విక్రయించే ప్రసాదాలకు ఫుడ్ లైసెన్సులు జారీ చేశారు. ఇందులో SEC-మహంకాళి టెంపుల్, బల్కంపేట-ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానం, కర్మాన్ఘాట్-హనుమాన్ దేవస్థానం, ఎస్పీరోడ్డు-వీర హనుమాన్ దేవస్థానం, సనత్ నగర్- హనుమాన్ దేవస్థానం, జూబ్లీహిల్స్-పెద్దమ్మ దేవాలయం, వివేక్ నగర్ హనుమాన్ దేవాలయం, RTC క్రాస్ రోడ్డు లక్ష్మీగణపతి దేవస్థానం,మినిస్టర్ రోడ్డు శ్రీసాయిబాబ సమాజం, SEC-గణేష్ టెంపుల్ ఉన్నాయి.
దామగుండం అటవీ సమస్యను పూడూరు నాయకులు నటుడు, సామాజికవేత్త సోనుసూద్కు వివరించారు. వికారాబాద్ జిల్లా పూడూరు దామగుండంలో నేవీ రాడార్ ఏర్పాటైతే అడవి పూర్తిగా నాశనం అవుతుందని వాపోయారు. దీని ఏర్పాటుకు అడవిలో మొక్కలు, వృక్షాలు నరికేస్తారని, మూగజీవాలు అంతరించిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని గురించి పరిశోధించి ఆ తర్వాత కార్యచరణ చెబుతానని ఆయన భరోసా ఇచ్చారు.
గ్రేటర్ HYD, RR, మేడ్చల్ ప్రాంతాల్లో వచ్చే వేసవిలో కరెంటు లోడు సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వేసవి కార్యాచరణపై విద్యుత్ సంస్థ దృష్టి పెట్టినట్లుగా ఎండి ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. రూ.384 కోట్లతో HYD, మేడ్చల్, రంగారెడ్డి జోన్లలో ప్రత్యేక 33/11KV ఉప కేంద్రాల ఏర్పాటు, ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.
HYD నగరం నుంచి డ్రగ్స్ దందా నడుపుతున్న ముఠాల సభ్యులకు దేశవ్యాప్తంగా లింకులు ఉన్నట్లు బయటపడింది. గంజాయి, అల్ఫ్రాజోలం, ఎంఫిటమైన్, MDM, హాష్ ఆయిల్ సహా అనేక రకాల డ్రగ్స్ తెలంగాణ రాష్ట్రంలో విక్రయిస్తున్న ముఠా సభ్యులకు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నట్లు పలు విచారణల్లో వెల్లడైంది. HYD నగరంలో డ్రగ్స్ దందాను ఒక వ్యాపారంగా చేస్తున్నారు.
రాజస్థాన్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. రాజస్థాన్ కేంద్రంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లకోసం రిక్కీ నిర్వహించారు. పక్కా ప్లాన్తో వారి స్థావరాలపై మెరుపుదాడి చేసి 27 మందిని అరెస్ట్ చేశారు.
ఏడాదికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతికి మాంసాహారం, మందు షాపులు బంద్ కానున్నాయి. దీంతో HYD,RR,VKB,మేడ్చల్ మల్కాజిగిరి, ప్రజలు పెత్తర అమావాస్య జరుపుకునేది ఎలా అనే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా.. పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని అంటున్నారట.
VKB జిల్లాలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఉన్నాయి. కుల్కచర్ల పాంబండ, కొడంగల్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, తాండూరులో భూకైలాస్, భద్రేశ్వర ఆలయం, జుంటుపల్లి సీతారాముల దేవాలయం, ఏకాంభరేశ్వరాలయం, పూడూరు దామంగం రామలింగేశ్వర స్వామి, పరిగి వేంకటేశ్వర స్వామి దేవాలయం, వికారాబాద్ శ్రీ బుగ్గరామలింగేశ్వర ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలుగా కొలువయ్యాయి.
HYD జిల్లాలో DSC ఫలితాల్లో SGT కే.స్వప్న 89.70, SGT(spl) జే. ఉపేంద్ర-82.90, హిందీ పండిట్ ఆర్.మహాలక్ష్మి-79.97, దత్తాత్రేయ మరాఠీ-49.10, వి.సంపత్ కుమార్ తెలుగు-78.50, యాస్మిన్ ఖానం ఉర్దూ-78.37, బి.సంతోష PET-72.50, ఎస్.తులసి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ-82.70, డీ.సాయి దీప్తి ఇంగ్లిష్-79.17, ఆర్.మహాలక్ష్మి హిందీ 71.47, కే.గోపాల్ గణితం-84.87, కే.విద్యాసాగర్ (PE)-66.50 స్కోర్లతో టాపర్లుగా నిలిచారు.
Sorry, no posts matched your criteria.