RangaReddy

News May 28, 2024

HYD: సిద్ధమవుతోన్న ఎన్నికల అధికారులు

image

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. సరిగ్గా వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఏడు రోజుల్లో ఏమేం పనులు చేయాలి?రోజువారి ఏఏ అంశాలపై సమీక్షలు నిర్వహించాలనే దానిపై రిటర్నింగ్ అధికారులు వేరువేరుగా సమాలోచన నిర్వహిస్తున్నారు. ఈవీఎం యంత్రాల్లో ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లో ఓట్లను కంప్యూటర్లలో ఎలా నమోదు చేయాలో వారికి వివరించారు.

News May 28, 2024

HYD: వీధి దీపాలు లేక ప్రజల ఇబ్బందులు

image

గ్రేటర్ HYD పరిధిలో పాడైపోయిన లైట్లకు మరమ్మతులు జరగట్లేదు. కొత్త ప్రాంతాల్లో, ప్రమాదాలు జరిగే చీకటి ప్రాంతాల్లో కొత్త వీధిలైట్ల ఏర్పాటు అందని ద్రాక్షగా మారింది. దీని వల్ల ప్రజలు నరకం చూస్తున్నారు. పాదచారులు రహదారులపై నడవలేకపోతున్నారు. ముందు నడుస్తూ వెళ్లే వారిని వాహనదారులు గమనించలేకపోతున్నారు. దుర్భర పరిస్థితులతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని సర్వాత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

News May 28, 2024

HYD: పిల్లలను ఎత్తుకెళుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

image

HYDలో పిల్లలను ఎత్తుకెళుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. 16 మంది చిన్నారులను ఘట్‌కేసర్ పరిధి మేడిపల్లి పోలీసులు కాపాడారు. ఇందులో HYDతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులు సైతం ఉన్నట్లు వారు గుర్తించారు. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఒంటరిగా బయటకు పంపించొద్దని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే తమకు తెలియజేయాలన్నారు. SHARE IT

News May 28, 2024

HYD: ఆర్టీసీ ITI కాలేజీలో ప్రవేశాలకు గోల్డెన్ ఛాన్స్

image

HYD శివారు మేడ్చల్ జిల్లా హకీంపేట్ వద్ద ఉన్న TGSRTC ITI కాలేజీలో మోటార్ మెకానికల్ వెహికల్, డీజిల్ మెకానిక్, పెయింటర్, వెల్డర్ విభాగాల్లో ఐటీఐ చేయడానికి గోల్డెన్ ఛాన్స్ ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 8, పదో తరగతి చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు HYD ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లను 9100664452, 040-23450033 సంప్రదించాలని సూచించారు. SHARE IT

News May 28, 2024

HYD: వైద్యురాలిని వేధించిన విభాగాధిపతిపై బదిలీ వేటు

image

ఉస్మానియా ఆసుపత్రి సీటీ తొరాసిక్ సర్జరీ విభాగాధిపతి శ్రీనివాస్ రెడ్డి తనను మానసిక వేధింపులకు గురిచేస్తున్నట్లు డీఎంఈకి పీజీ వైద్యురాలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యా సంచాలకురాలు వాణి ప్రత్యేక కమిటీని నియమించారు. కమిటీ విచారణ చేపట్టి పీజీ వైద్యురాలిని వేధించిన ఘటనలో సంబంధిత విభాగాధిపతి శ్రీనివాస్ రెడ్డిని వనపర్తి మెడికల్ కళాశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News May 28, 2024

HYD: తెరుచుకున్న జేఎన్టీయూ కళాశాల

image

వేసవి సెలవులు అనంతరం JNTU ఇంజినీరింగ్ కళాశాల తెరుచుకుంది. మూడో ఏడాది వారికి ఇంటర్న్‌షిప్‌లను దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 3వ తేదీ వరకు సెలవులు ఇవ్వగా, ఇటీవల నాలుగో ఏడాది విద్యార్థులు పరీక్షలు ముగించుకున్నారు. దీంతో కళాశాల మొదటి రోజు 1, 2వ ఏడాది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. కళాశాలలో మళ్లీ విద్యార్థుల కోలాహలం మొదలైంది. కాగా నాలుగో ఏడాది ఐడీపీ విద్యార్థులకు ప్రాజెక్ట్ వైవా కొనసాగుతుంది.

News May 28, 2024

HYD: కాల్పులు జరిపిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి: ఒవైసీ

image

ఏఐఎంఐఎం మాలేగావ్ అధ్యక్షుడు అబ్దుల్ మాలిక్ పై కాల్పులు జరిపిన దుండగులను తక్షణమే గుర్తించి అరెస్ట్ చేయాలని హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. పథకం ప్రకారం తమ పార్టీ మాలేగావ్ అధ్యక్షుడిపై దుండగులు ఆదివారం రాత్రి మూడుసార్లు కాల్పులు జరిపి పారిపోయారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గాయపడ్డ అబ్దుల్‌ను ప్రైవేటు చేర్పించి చికిత్స జరిపిస్తున్నామని.. కాల్పుల ఘటనపై విచారణ జరపాలని కోరారు.

News May 28, 2024

HYD: అక్రమ హోర్డింగుల తొలగింపుపై దృష్టి

image

నగరంలో కొన్ని రోజులుగా గాలిదుమారం రేగుతోంది. ఆదివారం పలు ప్రాంతాల్లో విపరీతమైన వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో అనేక ప్రాంతాల్లో హోర్డింగులపై ఏర్పాటు చేసిన ప్లెక్సీ బోర్డులు చెల్లాచెదురయ్యాయి. ఒకవేళ అవి వాహనాలపై పడితే. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో GHMC ప్రకటనల విభాగం అప్రమత్తమైంది. నగరవ్యాప్తంగా అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీ బోర్డులను తొలగించేందుకు ప్రైవేటు ఏజెన్సీలను ఆహ్వానించింది.

News May 28, 2024

HYD: బిర్యానీ కోసం వెళ్లారు.. ఇంతలోనే విషాదం

image

HYDలో విషాద ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ రాజు తెలిపిన వివరాలు.. గుంటూరు వాసులు యజ్ఞ నారాయణ(25), సత్యనారాయణ (30), సాయిపవన్(32) సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ముగ్గురు కలిసి బైక్‌పై బిర్యానీ తినేందుకు బయటకు వెళ్లగా కవాడిగూడ క్రాస్ రోడ్ వద్ద ఓ మినీ బస్సు వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో యజ్ఞ నారాయణ, సాయిపవన్ మృతిచెందగా సత్యనారాయణకు గాయాలయ్యాయి. కేసు నమోదైంది.

News May 28, 2024

HYD: నేడు పలు MMTS రైళ్ల రద్దు

image

హఫీజ్‌పేట్-సనత్‌నగర్ మధ్య పాదచారుల వంతెన మరమ్మతుల కారణంగా పలు ఎంఎంటీఎస్ రైళ్లను కొన్నింటిని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. నేడు (మంగళవారం) 7 ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసులను పూర్తిగా.. 3 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మేడ్చల్-సికింద్రాబాద్ మధ్య నడిచే 6 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 28, 29, 30 తేదీల్లో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.