India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HMDAలోని 3,532 చెరువులకుగానూ.. 230 చెరువులకు మాత్రమే బఫర్ జోన్, FTL నిర్ధారించారు. 2,525 చెరువులకు హద్దులను ఖరారు చేసింది. కాగా.. మరో 3 నెలల్లో 1,000 చెరువులకు హద్దులను నిర్ధారించాలని హైకోర్టు HMDAను ఆదేశించింది. హైకోర్టు నోటీసుల నేపథ్యంలో HMDA చర్యలకు ఉపక్రమించింది. నవంబర్లోగా పని పూర్తి చేయాల్సి ఉంది.
DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
RR 3231 205 1:15
HYD 2487 285 1:09
MDCL 646 41 1:15
VKB 4630 169 1:27
రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం VKB జిల్లా కోస్గి పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కాలేజీగా మార్చారు. తాజా మంత్రివర్గ సమావేశంలో మరో 9 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కూడా మార్చాలని నిర్ణయించింది. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రస్తుతం SBTET సాంకేతిక మండలి పర్యవేక్షిస్తుంది. ఈ బోర్డుకు ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలేషన్ ఇవ్వడానికి వీలు ఉండదని భవిష్యత్తులో వర్సిటీగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తుంది.
నాంపల్లిలోని IIHT తెలుగు యూనివర్సిటీలో కొనసాగుతుంది. మొదటి ఏడాది 55 మందిని మెరిట్ ప్రాతిపదికన అధికారులు ఎంపిక చేశారు. సాంకేతిక డిప్లమా కోర్సులో చేనేత, జౌళి,ఆపరేటర్, ఫ్యాషన్ సెక్టార్, ప్రొడక్షన్ డిజైనింగ్, వేవింగ్, డయ్యింగ్, ప్రింటింగ్, ఫినిషింగ్పై శిక్షణ అందించి డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తారు. రాబోయే రోజుల్లో IIHT స్కిల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తారు.
HMDA పరిధిలోని HYD, RR, MDCL, భువనగిరి, సంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట మొత్తం 7 జిల్లాల్లో 3,532 చెరువులు ఉన్నాయి. పలు చెరువుల సర్వే పూర్తయింది. గ్రేటర్ HYDలో అనేక చెరువుల రూపురేఖలు కోల్పోయాయని భారత రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తెలిపింది. గ్రేటర్లో 60 చెరువుల్లో భారీ ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. కొన్నిచోట్ల తప్పుడు సర్వే నంబర్లు ఉపయోగించి అనుమతులు తీసుకున్నట్లు సమాచారం ఉండడంతో నిఘా పెట్టారు.
మూసీ నిర్వాసితులను పరామర్శించడానికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం అత్తాపూర్లోని లక్ష్మీనగర్ కాలనీ, నందనవనం అపార్ట్మెంట్స్కు రానున్నారని ఆ పార్టీ నేత కొలను సుభాష్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించి వారితో మాట్లాడతారని పేర్కొన్నారు.
మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యా పథకం కింద అర్హులైన HYD, RR, MDCL, VKBలోని బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబర్ 15లోగా ఈపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. 35 ఏళ్లు, ఇంజనీర్, మేనేజ్మెంట్ సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సెన్స్, అగ్రికల్చర్లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు. విదేశీ వర్సిటీల నుంచి ఐ-20 ఫామ్ పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
HYD పంజాగుట్ట NIMSలో NIMS పేషెంట్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో దీనిని ఆమోదించారు. ఎవరైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, రూ.1 నుంచి రూ.కోటి వరకు విరాళం అందించవచ్చు. ఈ నిధితో తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్న నిరుపేదలకు వైద్యం, ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి పార్థీవదేహాలను సొంత ఊర్లకు తరలించనున్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జ్వరంతో బాధ పడుతూ రాలేకపోయినని Xలో వివరించారు.
రేపు మూసీ పరివాహక ప్రాంత బాధితుల దగ్గరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. తెలంగాణ భవన్లో సమావేశం అనంతరం మొదట రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్గూడలో పర్యటించనున్నారు. తర్వాత అత్తాపూర్లోని కిషన్బాగ్ ప్రాంతాల్లోని మూసీ ప్రాజెక్ట్తో నష్టపోతున్న ప్రజలను కలవనున్నారు.
Sorry, no posts matched your criteria.