India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి సాయి అనురాగ్ కాలనీలో కుటుంబ కలహాలతో భర్త నాగేంద్ర భరద్వాజ.. భార్య మధులత(సాఫ్ట్వేర్ ఉద్యోగి)ను హత్య చేశాడు. ముక్కలు ముక్కలుగా నరకడానికి ప్రయత్నించినట్లు మృతురాలి తండ్రి రంగనాయకులు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశారు.
తమకు పూర్తి వేతనం చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం HYDలో వారు మాట్లాడుతూ.. కేవలం 10 నెలలకే జీతం ఇవ్వడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇతర గురుకుల సంస్థల్లో ఇచ్చినట్లు తమకు 12 నెలలపాటు వేతనాలు చెల్లించాలన్నారు. గత నెలలో 4వేల మంది సిబ్బందిని 2 నెలలపాటు తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు.
త్వరలో అమల్లోకి రానున్న నూతన చట్టాలు మన దేశ శాంతి భద్రతల పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తాయని రాచకొండ CP తరుణ్ జోషి అన్నారు. జులై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేర న్యాయ చట్టాలు అమలులోకి రానున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి RCIలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన చట్టాలతో కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందన్నారు.
గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రఘునాథ స్వామి హెచ్చరించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. గర్భధారణ, లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సలహా కమిటీ సభ్యులకు సూచించారు.
ఆస్ట్రేలియాలో HYD శివారు షాద్నగర్ వాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. BJP దివంగత నేత కృష్ణ కుమారుడు అరవింద్ యాదవ్(30) 12ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ AUSలోని సిడ్నీలో స్థిరపడ్డారు. సోమవారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన అరవింద్ కనిపించకపోవడంతో అక్కడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సముద్రంలో అరవింద్ మృతదేహం ఈరోజు లభించడంతో హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ చేపట్టారు.
గగనతలంలో విమానం తలుపు తీసేందుకు యత్నించిన వ్యక్తికి ఆర్జీఐఏ పోలీసులు 41 సీఆర్పీ నోటీసులు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD గాజులరామారం ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్ అనిల్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి శంషాబాద్కు వస్తున్నాడు. ఈ క్రమంలో గగనతలంలో విమానం తలుపు తెరిచేందుకు యత్నించాడు. దీంతో భద్రతాధికారులకు ఫిర్యాదు చేయగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనిల్పై కేసు నమోదు చేశారు.
స్టాక్ మార్కెట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.5.60 లక్షలు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యాపారి.. స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చేలా పెట్టుబడి పెట్టిస్తామని ఇన్స్టాగ్రామ్లో ఓ ప్రకటన చూశాడు. లింక్పై క్లిక్ చేయగా ఓ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అయ్యాడు. మొదట కొంత పెట్టుబడి పెట్టగా..లాభాలు వచ్చాయి. దీంతో విడతలవారీగా రూ.5.60 లక్షలు పెట్టి మోసపోయి CCSలో ఫిర్యాదు చేశాడు.
HYD లక్డీకపూల్లోని ఎంఎన్జే ప్రభుత్వ దవాఖానలో పైసా ఖర్చు లేకుండా పేద రోగులకు ఖరీదైన రోబోటిక్ శస్త్రచికిత్సలు చేస్తున్నామని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. దవాఖానలో 100 రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఎన్జేలో గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి రోబోటిక్ సర్జరీలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆమనగల్లు మండలం రామంతల గడ్డ సమీపంలో గల శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
మైనర్లు వాహనాలు నడుపుతూ ఇటీవల తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. తద్వారా వారితో పాటు ఇతరుల ప్రాణాలు సైతం పోతున్నాయి. HYD, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు తల్లిదండ్రులకు, మైనర్లకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా మార్పు రావడం లేదు. 18 ఏళ్లు నిండి, లైసెన్స్ పొందిన తర్వాతే బండ్లు నడపాలన్నారు. లేదంటే వాటిని ఇచ్చిన తల్లిదండ్రులు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుని, జైలుకు పంపుతామని హెచ్చరించారు. SHARE IT
Sorry, no posts matched your criteria.