RangaReddy

News March 29, 2024

HYD: ‘ఆ ఒక్క సెకండ్.. ప్రాణాన్ని కాపాడుతుంది’

image

HYD వాహనదారులకు ఎల్లప్పుడూ రాచకొండ పోలీసులు డ్రైవింగ్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా మరో సూచన చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కేవలం ఒక్క సెకండ్ పడుతుంది. ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకోరో..! ప్రమాదం జరిగినప్పుడు ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఆ క్షణంలో సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని, వాహనంలో వెళ్లే అందరూ ధరించాలని సూచించారు.

News March 29, 2024

HYD: గ్రీన్ హైడ్రోజన్ తయారీపై ప్రయోగాలు

image

HYD తార్నాకలోని IICT గ్రీన్ హైడ్రోజన్ తయారీపై ప్రయోగాలు చేస్తుంది. శిలాజ ఇంధనాల వినియోగం నియంత్రించడంపై దృష్టి సారించింది. క్లీన్ ఎనర్జీగా హైడ్రోజన్‌కు పేరున్న నేపథ్యంలో కోబాల్ట్ టెర్పరిడిన్ రసాయన మూలకాన్ని ఉపయోగించి వాణిజ్యపరంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు.

News March 29, 2024

HYD: దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

BJPతో కలిసి BRS పనిచేయనుందని స్వయంగా KTR చెప్పడంతోనే దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌లో చేరానని ఖైరతాబాద్ MLA, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ.. BJPతో కలిస్తే BRS సెక్యులర్ పార్టీ ఎలా అవుతుందని తాను ప్రశ్నించానన్నారు. గతంలో KCR అపాయింట్‌మెంట్ దొరకడమే కష్టమని కానీ ప్రస్తుతం రేవంత్‌రెడ్డి అందరికీ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. మీ కామెంట్?

News March 29, 2024

HYD: డబ్బుల కోసమే రంజిత్ రెడ్డి కాంగ్రెస్లోకి..!: కొండా

image

డబ్బుల కోసమే ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో ఈసారి 3 లక్షల మెజార్టీతో తానే గెలుస్తానని, హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిని సైతం మంజూరు చేయించినట్లుగా తెలిపారు. 100 రోజుల్లో కేవలం 50 రోజులు మాత్రమే రేవంత్ రెడ్డి పాలన బాగుందన్నారు. బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అన్నారు.   

News March 29, 2024

HYD: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌

image

కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు షెడ్యూల్‌ వచ్చేసిందని HYDలోని అధికారులు తెలిపారు. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 1 ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుందన్నారు. ఏప్రిల్‌ 15 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ కోసం తమ వెబ్‌సైట్‌ https://kvsangathan. nic. in/ను సందర్శించాలని వారు కోరారు.

News March 29, 2024

HYD: త్వరలో 24 గంటలు వాటర్ ట్యాంకర్ నీటి సరఫరా

image

వచ్చే నెల మొదటి వారం నుంచి 24 గంటల పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిశోర్ తెలిపారు. HYD ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణ, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే, ఈ సారి ట్యాంకర్ల డిమాండ్ 50 శాతం పెరిగిందన్నారు.

News March 29, 2024

HYD: KTRపై కేసు నమోదు

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై కేసు నమోదైంది. CM రేవంత్ రెడ్డిపై KTR అనుచిత వ్యాఖ్యలు చేశారని, అతడిపై చర్యలు తీసుకోవాలని TPCC సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ నేతలు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలను KTR తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై IPC సెక్షన్లు 504, 505 కింద జీరో FIR నమోదు చేసి కేసును HYD బంజారాహిల్స్ PSకు బదిలీ చేశామని అక్కడి ఇన్‌స్పెక్టర్ సతీశ్ తెలిపారు. 

News March 29, 2024

HYD: KCRలానే రేవంత్‌రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయి: ఈటల 

image

మాజీ సీఎం KCRకు కళ్లు నెత్తికెక్కడానికి ఐదేళ్లు పడితే.. ఆయన లానే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మూడు నెలల్లోపే కళ్లు నెత్తికెక్కాయి’ అని బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విమర్శలు చేశారు. గురువారం HYD రామంతాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి ఓడిపోగానే BRS పరిస్థితి పూర్తిగా దిగజారిందన్నారు. 6 నెలల తర్వాత ఆరు గ్యారంటీల విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు.

News March 29, 2024

HYD: పకడ్బందీగా పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ: కమిషనర్

image

పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ సంబంధిత అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ హాల్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారులు, ఏఆర్‌ఓలకు పోస్టల్‌ బ్యాలెట్‌పై శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అధికారులకు సూచనలు చేశారు.

News March 29, 2024

HYD: నకిలీ వజ్రాన్ని విక్రయిస్తున్న ముఠా ARREST

image

రూ.3 కోట్ల విలువైన వజ్రాన్ని రూ.30 లక్షలకే విక్రయిస్తామని ప్రజలను నమ్మిస్తున్న ముఠాను HYD పాతబస్తీ హబీబ్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.సౌత్‌వెస్ట్‌ DCP ఉదయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపిన వివరాలు.. ముంబైకి చెందిన బాలచంద్ర తులేరే(48), పాతబస్తీకి చెందిన ముస్తాబా అహ్మద్‌ఖాన్‌, సాజిద్‌ అలీతో కలిసి నకిలీ వజ్రం విక్రయించేందుకు గురువారం మల్లేపల్లికి వచ్చారు.స్థానికుల సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు.