India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గచ్చిబౌలి నవోదయ విద్యాలయం ప్రధానాచార్యుడు డి.విజయ్ భాస్కర్ శుభవార్త చెప్పారు. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష గడువును పొడిగించినట్లు వెల్లడించారు. జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు దరఖాస్తు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించారు. ఆన్లైన్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
కొవిడ్ సమయంలో మూడు ఏళ్ల పాటు శ్రమించి వైద్య సేవలందించిన నిమ్స్ వైద్యులకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. వైద్యుల సేవలను గుర్తిస్తూ ICMR ప్రశంసా పత్రాలను అందజేసింది. వీరిలో జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు నవాల్ చంద్ర, YSN రాజు, సుబ్బలక్ష్మి, జమునా హుస్సేన్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ఉమాబాల, తేజా, పద్మజా, MVLN రామ్మోహన్ ఉన్నారు.
HYDలో గణేశ్ ఉత్సవాలు మొదలయ్యాక భారీగా వ్యర్థాల సేకరణ పెరిగిందని అధికారులు వెల్లడించారు. ఆగస్టులో సగటున 7,900 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడితే, చవితి రోజు 8337.96 మె.టన్నులు సేకరించినట్లు తెలిపారు. 11తేదీన 8810.10 మె.టన్నులు, 17న 8547.58 మె.టన్నులు సేకరించారు. కాగా మంగళ, బుధవారాల్లో పోగైనది సేకరిస్తున్నారు. ఇందులో అత్యధికంగా కలర్ పేపర్లు, పూజా వ్యర్థాలే ఉన్నట్టు తెలిపారు.
హైదరాబాద్ శివారులో బుధవారం హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి తొండుపల్ల మసీదు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. యాచకుడిగా గుర్తించి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆకలితో అలమటిస్తూ ఆ వృద్ధుడు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇది విన్న స్థానికులు చలించిపోయారు.
RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శంకర్పల్లి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మున్సిపల్ పరిధి బుల్కాపూర్ వార్డు శివారులో గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. HYD నుంచి శంకర్పల్లి వైపు వస్తున్న RTC బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
✓బండ్లగూడ జాగీర్ రిచ్మండ్ విల్లాస్లో రూ.1.87 కోట్లు
✓బాలాపూర్ గణపతి రూ.30,01,000
✓కొంపల్లి అపర్ణ మెడోస్ రూ.29.10 లక్షలు
✓శంకర్పల్లి విఠలేశ్వరుడి వద్ద రూ.12.51 లక్షలు
✓అత్తాపూర్ భక్త సమాజ్ రూ.11.16 లక్షలు
✓ఉప్పరపల్లి వీరాంజనేయాలయంలో రూ.10 లక్షలు
✓చేవెళ్ల ఖానాపూర్లో రూ.6.63 లక్షలు
✓బాచుపల్లి బడా గణేశ్ రూ.6.2 లక్షలు
✓శంకర్పల్లి పర్వేదలో రూ.4 లక్షలు
మీ ప్రాంతంలో ఎంతో కామెంట్ చేయండి
ఎల్బీనగర్ పరిధిలోని సరూర్నగర్ చెరువు, ట్యాంక్బండ్ పరిసరాల్లో అర్ధరాత్రి సమయంలోనూ శానిటేషన్ పనులు కొనసాగాయి. రాత్రుళ్లు విధులు నిర్వహించిన బృందాలను కమిషనర్ ఆమ్రపాలి కాటా ప్రత్యేకంగా అభినందించారు. ఆయా ప్రాంతాల్లో నిమజ్జనాలు సజావుగా సాగినట్లుగా డిప్యూటీ కమిషనర్ సుజాత పేర్కొన్నారు.
HYD సిటీ కమిషనర్ CV ఆనంద్ రంగంలోకి దిగారు. గణపతి నిమజ్జన చివరి ఘట్టం నేడు ఉదయం MJ మార్కెట్ రోడ్డుకు చేరుకుంది. ఎంజీ మార్కెట్ సహా, ట్యాంక్ బండ్ పరిసరాల పరిస్థితులను సీపీ పరిశీలించారు. కేవలం కొన్ని వాహనాలు మాత్రమే అప్రోచ్ రోడ్లలో ఉన్నాయని, తక్కువ సమయంలో నిమజ్జనం ముగుస్తుందని, జనరల్ ట్రాఫిక్ వెళ్లొచ్చన్నారు. గతం కంటే ఈసారి ఉదయం 5 గంటలకు, పరిస్థితి చాలా మెరుగుగా ఉందని అభిప్రాయపడ్డారు.
✓నారాయణగూడ: టస్కర్ పై నుంచి పడి మహిళ మృతి
✓ఖైరతాబాద్: జులూస్ డ్యాన్స్ అదుర్స్
✓ఘట్కేసర్: మైనర్ బాలిక పై కేశవరెడ్డి(36) లైంగిక దాడి
✓మోడీకి బాలాపూర్ లడ్డు అందిస్తాం: శంకర్ రెడ్డి
✓HYDలో ఘనంగా జరిగిన విమోచన, ప్రజాపాలన, సమైక్యత వేడుకలు
✓ఖైరతాబాద్ గణనాథునికి పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
✓VKB: గల్లీ గల్లీలో గణనాథుని ఊరేగింపు
టస్కర్ కింద పడి ఓ యువతి మృతి చెందిన ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు.. నిన్న అర్ధరాత్రి హిమాయత్నగర్లో వినాయకుడిని తీస్కెళ్తున్న టస్కర్పై నుంచి ఎల్బీనగర్కు చెందిన మహేందర్ కిందపడ్డాడు. ఆయనకోసం కుమార్తె పూజిత (17) కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది.
Sorry, no posts matched your criteria.