RangaReddy

News March 18, 2024

HYD: ట్రైన్ నుంచి జారిపడి బీటెక్ విద్యార్థి మృతి

image

ట్రైన్ నుంచి జారిపడి బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ GRP పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. ఆదివారం నీలం సుమంత్ తన తమ్ముడితో కలిసి సొంతూరు ఖమ్మం జిల్లా కల్లూరు వెళ్లడానికి SCBD రైల్వే స్టేషన్‌కు వచ్చి ట్రైన్ ఎక్కాడు. అయితే ట్రైన్ ఎక్కే సమయంలో జారీ కింద పడ్డాడు. సుమంత్‌ను తమ్ముడు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికత్స పొందుతూ.. మృతి చెందినట్లు తెలిపారు.

News March 18, 2024

హైదరాబాద్‌లో వర్షం

image

హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. లింగంపల్లి, BHEL, చందానగర్, గచ్చిబౌలితో పాటు.. పలు ప్రాంతాల్లో కురిసింది. మీ ప్రాంతంలో కూడా వర్షం ఉంటే కామెంట్‌లో తెలపండి.

News March 18, 2024

HYD: ఢీకొట్టిన ట్రైన్.. కాళ్లు తెగి వ్యక్తి మృతి 

image

రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు.. HYD అల్వాల్‌లో నివాసం ఉండే కే.దుర్గయ్య(41) డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో సనత్‌నగర్-అమ్ముగూడ రైల్వేస్టేషన్ల మధ్య అతడు పట్టాలు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో అతడి రెండు కాళ్లు తెగి, చికిత్స పొందుతూ మరణించాడు. 

News March 18, 2024

UPDATE.. బెంగళూరు నుంచి కాశీకి వెళ్తుండగా ప్రమాదం

image

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జాతీయ రహదారిపై MSN పరిశ్రమ ముందు మారుతి ఈకో వ్యాన్ అదుపుతప్పి పక్కన చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బెంగళూరు నుంచి కాశీకి వెళ్తున్నట్లు సమాచారం.

News March 18, 2024

దేవేందర్ గౌడ్‌ను కలిసిన ఈటల, కొండా

image

మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌ను తుక్కుగూడలోని వారి నివాసంలో ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వేణుగోపాలచారి, అందెల శ్రీరాములు, కేఎస్ రత్నం, నరసింహరెడ్డి, విక్రమ్ రెడ్డి, పలువురు కౌన్సిలర్స్ కార్పొరేటర్లు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈటల, విశ్వేశ్వర్ రెడ్డి, పూలబొకే ఇచ్చి ఘనంగా సన్మానించారు. అనంతరం వారితో ముచ్చటించి వారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.

News March 18, 2024

FLASH.. HYD: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ 44వ జాతీయ రహదారి MSN పరిశ్రమ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2024

మల్కాజిగిరిలో పాగా వేసేదెవరో?

image

గత MP ఎన్నికల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఆయనకు 6,03,748 ఓట్లు రాగా BRS అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి 5,92,829 ఓట్లు, BJP అభ్యర్థి రాంచందర్‌రావుకు 3,04,282 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. BRS తరఫున రాగిడి లక్ష్మారెడ్డి పేరును ప్రకటించగా BJP నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.

News March 18, 2024

HYD: ‘KCR, KTR వల్లనే రాష్ట్రం అభివృద్ధి’ 

image

మల్కాజిగిరి పార్లమెంట్ BRS MP అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి కోరారు. MLA అధ్యక్షతన HYD కర్మాన్‌ఘాట్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ CM KCR, KTR వల్లనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, BRSకు ఓటేసి గెలిపించాలని లక్ష్మారెడ్డి కోరారు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, రాజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులున్నారు.

News March 18, 2024

తుది దశకు చేరుకున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ పనులు

image

నగరానికి మణిహారంగా భావిస్తున్న HYD చర్లపల్లి రైల్వేస్టేషన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. చర్లపల్లి టెర్మినల్లో రూ.430 కోట్ల అంచనాతో ప్రయాణికులకు అనేక వసతులు కల్పిస్తున్నారు. 3 రైల్వే లైన్లుగా ఉన్న చర్లపల్లిలో ఇప్పుడు 9 ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. బస్ బేలు, ప్రవేశమార్గాలు, పార్కింగ్ స్థలం ఏర్పాటు చేస్తున్నారు.

News March 18, 2024

సికింద్రాబాద్ సీటు.. VERY హాట్  

image

సికింద్రాబాద్ MP స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 2019లో ఇక్కడి నుంచి BJP తరఫున కిషన్ రెడ్డి MPగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లు రాగా BRS అభ్యర్థి తలసాని సాయికిరణ్‌కి 3,22,666ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్‌కు 1,73,229 ఓట్లు వచ్చాయి. ఈసారి కిషన్ రెడ్డిని ఓడించేందుకు BRS, కాంగ్రెస్‌ బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాయి.