RangaReddy

News October 20, 2024

బేగంపేట: సౌత్ ఇండియా సదస్సులో పాల్గొన్న గవర్నర్

image

బేగంపేటలో జరిగిన సౌత్ ఇండియా రీజినల్ సదస్సులో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు. HYD ఇంటర్ ఫర్ సోషల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ వద్ద జరిగిన ఈ ప్రోగ్రాంలో గవర్నర్ తెలంగాణ చాప్టర్‌పై ప్రసంగించారు. ఆర్థిక, సామాజిక అంశాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ నిపుణులు పాల్గొన్నారు.

News October 20, 2024

శేర్లింగంపల్లి: ఇన్నోవేషన్లకు పుట్టినిల్లుగా T-Hub

image

HYDలోని శేర్లింగంపల్లి రాయదుర్గం వద్ద ఏర్పాటు చేసిన T-Hub ఇన్నోవేషన్లకు పుట్టినిల్లుగా మారుతోంది. 20 దేశాలకు చెందిన 180 మంది ప్రముఖ ఇన్నోవేటర్లతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన టెక్నాలజీ, నూతన ఇన్నోవేషన్ల ద్వారా యువతకు ఉపాధి కల్పించే అంశాలపై చర్చలు జరిపినట్లుగా టెక్నోక్రాంట్ సాయి అభినయ్ తెలిపారు.

News October 20, 2024

HYD: గ్రూప్-1 పరీక్షకు ఏర్పాట్లు..! ఉత్కంఠత!

image

గ్రూప్-1 అభ్యర్థులు మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని, G.O.29 రద్దు చేయాలని గత వారం రోజులుగా HYDలో నిరసనలు చేస్తున్నారు. మరోవైపు HYDలో గ్రూప్-1 పరీక్షకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. HYD బేగంపేటలోని ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ ఎగ్జామ్ సెంటర్ తరగతి గదులలో ఎంటమాలజీ బృందం పిచికారి చర్యలు చేపట్టింది. HYD, RR, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మొత్తం 46 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి.

News October 20, 2024

HYDలో ఆదివారం అంగడి తెలుసా..? అయితే పదండి!

image

HYD ఎర్రగడ్డ అంగడి గత వందేళ్లుగా కొనసాగుతోంది. సంతలో అగ్గిపెట్టె నుంచి అలంకరణ వస్తువులు, కాళ్ల పట్టీల నుంచి కంప్యూటర్ విడిభాగాల వరకు దొరకందంటూ లేదు. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ పెరిగినా.. ఈ సంతకు డిమాండ్ తగ్గలేదు. ప్రతి ఆదివారం ఉ.5 నుంచి రా.10 వరకు ఈ సంత కొనసాగుతుంది. 1910 నిజాం కాలంలో దీన్ని మొదలుపెట్టారు. ఎర్రగడ్డ వంతెన, పెట్రోల్ బంక్, చౌరస్తా నుంచి ఫతేనగర్ బ్రిడ్జి వరకు 3KM ఉంటుంది.

News October 20, 2024

HYD: చిక్కడపల్లి CI బదిలీ

image

చిక్కడపల్లి CI సీతయ్యను HYD స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేస్తూ CP సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో బానోత్ రాజు నాయక్‌ను CI‌గా నియమించారు. అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో సీతయ్యను ట్రాన్స్‌ఫర్ చేసినట్లు సమాచారం. HYD కమిషనరేట్ పరిధిలో మరికొందరు అధికారులు బదిలీ అయ్యారు. ఖలీల్ పాషా-సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, సైదులు -ఖైరతాబాద్ DI, దోమలగూడ DIగా శ్రీశైలం‌ను నియమించారు.

News October 19, 2024

HYD: ఓయూ VC ప్రస్థానం! 

image

OUలో విద్యనభ్యసించిన ప్రొ.ఎం.కుమార్ అదే యూనివర్సిటీకి VCగా నియమితులయ్యారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పరిధి కొండాపురంకు చెందిన ఆయన, భద్రాచలం GMR పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లమా సివిల్ ఇంజినీరింగ్, ఉస్మానియాలో B.Tech, JNTUలో M.Tech, IIT బాంబే నుంచి Ph.D పట్టా అందుకున్నారు. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్‌గా, ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్‌తో పాటు వివిధ విభాగాల్లో పనిచేశారు. అనేక అవార్డులు సైతం పొందారు.

News October 19, 2024

HYD: సీఎస్‌కు గ్రూప్-1 అభ్యర్థుల లేఖ

image

తెలంగాణ సీఎస్‌ శాంతి కుమారికి గ్రూప్-1 అభ్యర్థులు లేఖ రాశారు. గ్రూప్-1 పరీక్షలు వెంటనే రీ షెడ్యూల్ చేయాలని, ఏ స్టడీ మెటీరియల్ చదవాలి అనేదానిపై TGPSC స్పష్టత ఇవ్వాలన్నారు. రిజర్వేషన్ హక్కులను పునరుద్ధరించాలని కోరారు. పోలీసుల దౌర్జన్యాన్ని ఆపి, శాంతియుతంగా నిరసనలు చేసుకొనివ్వాలని గ్రూప్-1 అభ్యర్థులు లేఖ రాశారు.

News October 19, 2024

HYD: సౌత్ కొరియా టూర్.. ప్రాధాన్యత ఏంటి..?

image

సౌత్ కొరియా రాజధాని సీయోల్ నగరంలో ఓ నాడు మురికి కుపమైన హన్ నదికి పునరుజ్జీవం పోసి అభివృద్ధి చేశారు.హన్ నదిని అభివృద్ధి చేసిన అనుభవాలు మూసికి ఉపయోగపడతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మురికిమయమైన మన HYD మూసి నది అభివృద్ధిలో భాగంగా,హన్ నదిని అభివృద్ధి పరిచిన తీరును ప్రత్యేక బృందం అధ్యయనం చేస్తుంది. అక్కడ ఉపయోగించిన టెక్నాలజీ, మేనేజింగ్ పద్ధతులను స్టడీ చేస్తారు.

News October 19, 2024

హైదరాబాద్‌లో రచ్చ రచ్చ..!

image

హైదరాబాద్‌లో నేడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ వైపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద లాఠీఛార్జ్ జరగగా మరోవైపు ట్యాంక్ బండ్ వద్ద గ్రూప్ -1 అభ్యర్థులతో బండి సంజయ్ ర్యాలీ జరుగుతోంది. ఈ క్రమంలో భారీగా పోలీసులు మోహరించగా VST ఫ్లైఓవర్ బంద్ చేశారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పరేడ్ గ్రౌండ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయి. మరోవైపు బంద్ నేపథ్యంలో షాపులన్నీ మూసివేయడంతో క్లాక్ టవర్ వద్ద ఖాళీగా మారింది.

News October 19, 2024

BIG BREAKING: సికింద్రాబాద్‌లో లాఠీఛార్జ్.. ఇంటర్నెట్ బంద్..!

image

సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఒక్కసారిగా వేలాది మంది హిందువులు తరలిరావడం, మసీదు ఉన్న రూట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కాగా పోలీసులపైకి ఆందోళనకారులు కుర్చీలు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. దీంతో పోలీసులు ఇంటర్నెట్ బంద్ చేసి వారిపై లాఠీఛార్జ్ చేశారు.