RangaReddy

News October 1, 2024

HYDలో విడాకులు ఎక్కువగా తీసుకునేది వీరే!

image

గ్రేటర్ హైదరాబాద్‌లోని కుటుంబ న్యాయస్థానాల్లో ప్రతీనెల 300కు పైగా విడాకుల కేసులు నమోదవుతున్నాయి. చిన్నాచితక సమస్యలను సైతం ఆలుమగలు అర్థం చేసుకోకపోవడంతో కౌన్సెలింగ్ సెంటర్లకు 10 నుంచి 15% మంది వెళ్తున్నారంటే సమస్య ఎంత జటిలంగా ఉందో అర్థమవుతోంది. వీరిలో అత్యధికంగా 25 నుంచి 35లోపు వయసు ఉన్న జంటలు 75% ఉండగా.. వారిలో ఐటీ ఉద్యోగులు ఎక్కువమంది ఉంటున్నారని తేలింది.

News September 30, 2024

HYD: దసరాకు 6 వేల ప్రత్యేక బస్సులు: వీసీ సజ్జనార్

image

దసరాకు 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్, ఆరాంఘ‌ర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ, రూట్‌ల నుంచి స్పెష‌ల్ స‌ర్వీసులను అందుబాటులో తీసుకొస్తామన్నారు. ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ అధికారిక వెబ్ సైట్ tgsrtbus.in.ని సమాచారం కోసం త‌మ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాల‌న్నారు.

News September 30, 2024

HYD: మూసీ నిర్వాసితులపై BRS మొసలి కన్నీళ్లు: మంత్రి

image

మూసీ నిర్వాసితులపై బీఆర్ఎస్ వాళ్లు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా అంశాన్ని బీఆర్ఎస్ భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గతంలో రైతు సోదరులపై బుల్డోజర్లు పంపించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మండిపడ్డారు. మూసీ నిర్వాసితులకు తాము అండగా ఉంటామని, HYDను బెస్ట్ సిటీగా మారుస్తామని స్పష్టం చేశారు.

News September 30, 2024

HYD: రూ.35 కోట్లతో చర్లపల్లికి మహర్దశ

image

HYD చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో రోడ్ల అభివృద్ధికి రంగం సిద్ధమైంది. GHMC రైల్వే స్టేషన్ వద్ద 3 ప్రధాన ద్వారాలు నిర్మించాలని నిర్ణయించింది. 100, 28 అడుగుల వెడల్పుతో 2 ద్వారాలు నిర్మిస్తారు. వీటిని 100 అడుగుల రోడ్డుతో జత చేస్తారు. పార్కింగ్ కేంద్రాలు, బస్టాండ్, ఆటోస్టాండ్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. రూ.35 కోట్లతో కొత్త రోడ్లు వేయనున్నారు.

News September 30, 2024

HYD: మార్పు చెందకపోతే మనుగడ కష్టమే: ఇస్రో ఛైర్మన్

image

HYD బాలనగర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC) ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవలు అందించినట్లు ISRO ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తోన్న మార్పులకు అనుగుణంగా మారకపోతే రిమోట్ సెన్సింగ్ మనుగడ కష్టమేనన్నారు. సాంకేతికతలో వేగంగా మార్పులు వస్తున్నాయని, సమాచారం అత్యంత వేగంగా కావాలని ప్రజలు, వ్యవస్థలు కోరుకుంటున్నాయన్నారు. రాబోయే 25 ఏళ్లకు వచ్చే మార్పులను అంచనా వేసి నివేదిక రూపొందించాలన్నారు.

News September 30, 2024

BREAKING: HYD: కాసేపట్లో DSC ఫలితాలు విడుదల

image

DSC ఫలితాలు మరికొద్ది క్షణాల్లో విడుదల కానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2 నెలల క్రితం పూర్తయిన DSC పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. కాగా, 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

News September 30, 2024

HYD: సామాన్యుడి బతుకుబండి బరువేక్కుతుంది..!

image

‘కూటి కోసం కోటి తిప్పలు’ అన్నట్లు పట్టణాలకు వలస వచ్చిన పేదల బతుకు బండి బరువెక్కుతోంది. చిన్నాచితక పనిలో రూ.10-15 వేల అరకొర జీతంతో కుటుంబాన్ని ముందుకు నడుపుతున్న వేళ కూరగాయల, నిత్యావసరాల ధరలు పెరగటంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. మరోవైపు ఇంటి రెంట్, పిల్లల చదువులు, దవాఖాన ఖర్చులు ఇలా నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వ మిగలడంలేదని సగటు వ్యక్తి ఆవేదన.

News September 30, 2024

HYD: కొండెక్కిన కూరగాయల ధరలు..!

image

HYDలో కూరగాయల ధరలు కొండెక్కాయి. కేవలం 3 రోజుల్లోనే 20 % మేరకు ధరలు పెరిగినట్లు విక్రయదారులు తెలిపారు. ఉప్పల్ మార్కెట్లో టమాటా కిలో-70, వంకాయ-80
బెండకాయ-60, చిక్కుడు కాయ-60, దొండకాయ-60, పచ్చిమిర్చి-30, క్యాప్సికం-80 కాకరకాయ-60, గోరుచిక్కుడు-60, సొరకాయ ఒకటి-30-40, ఆలుగడ్డ-50-60, బీరకాయ- రూ.70-80గా ఉంది. నగరంలోని వివిధ మార్కెట్లలో రూ.10-20 వ్యత్యాసం ఉన్నట్లుగా పేర్కొన్నారు.

News September 30, 2024

HYD: ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య 24వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రతిభావంతుల నుంచి పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమాఖ్య జాతీయ కార్యదర్శి డా.గణగళ్ల విజయ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్యం, సమాజసేవ, సాహిత్యం, నృత్యం తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారు అక్టోబరు 2లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 93913 79903 నంబరును సంప్రదించండి.

News September 30, 2024

ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌కు ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులు…

image

ప్ర‌యాణికుల‌కు స‌మ‌యాభావం త‌గ్గించేందుకు HYD ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌కు ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులను న‌డ‌పాల‌ని #TGSRTC యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. మొద‌టి ద‌శ‌లో 2 ఈ-గ‌రుడ బ‌స్సులను నేడు ప్రారంభించనుంది. ఈ బ‌స్సులు బీహెచ్ఈఎల్‌-రామ‌చంద్ర‌పురం, నిజాంపేట క్రాస్‌రోడ్స్, సైబ‌ర్ ట‌వ‌ర్స్, గ‌చ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌కు చేరుకుంటాయని సజ్జనర్ తెలిపారు.