RangaReddy

News September 13, 2024

VKB: ఎయిడ్స్‌‌పై అవగాహన ఉండాలి

image

ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రి ఐసీటీసీ కౌన్సిలర్ పార్వతాలు సూచించారు. శుక్రవారం మండల పరిధి దేవనూరులో వైఆర్‌జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సుఖ వ్యాధులతో ఎయిడ్స్ ప్రబలుతుందన్నారు. ఎయిడ్స్ బాధితుడితో మాట్లాడటం, కలిసి ఉండటం, భోజనం చేయడం వల్ల వ్యాధి సోకదన్నారు.

News September 13, 2024

గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ బందోబస్త్ ఏర్పాట్లపై నగర సీపీ సమీక్ష

image

HYD సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం సౌత్ ఈస్ట్ & ఈస్ట్ జోన్లలో పర్యటించారు. ఈనెల 17న జరగనున్న గణేశ్ నిమజ్జనం, 19న జరగనున్న మిలాద్ ఉన్ నబీ బందోబస్త్ ఏర్పాట్ల గురించి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ అధికారులు మానసికంగా ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించి శాంతి భద్రతలు కాపాడాలని అన్నారు. అలాగే వేడుకల్లో భాగంగా ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం గురించి పలు సూచనలు చేశారు.

News September 13, 2024

HYD: రూ.2.94 కోట్ల బంగారం సీజ్..!

image

HYD నగర శివారు శంషాబాద్ ORR ఏరియాలో 3.98 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. దీని విలువ దాదాపుగా రూ.2.94 కోట్లు ఉంటుందని వెల్లడించారు. విదేశానికి చెందిన ఈ బంగారం.. కోల్‌కతా నుంచి తీసుకొస్తుండగా HYD నగరంలో పట్టుబడింది. కారు సీటు వెనక బ్రౌన్ టేపు వేసి, బంగారం దాచినట్లు అధికారులు తెలిపారు.

News September 13, 2024

HYD: దసరా, దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు

image

దసరా, దీపావళి, ఛాత్ పూజకు వెళ్లే ప్రయాణికులరద్దీని దృష్టిలో పెట్టుకుని 24 ప్రత్యేక రైలు సర్వీసులను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబరు 5 నుంచి నవంబరు 12 మధ్య ఒక్కో మార్గంలో ఆరేసి ట్రిప్పుల చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి, తిరుపతి-సికింద్రాబాద్, తిరుపతి-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-తిరుపతి మధ్య రైలు నడపనున్నట్లు తెలిపారు.

News September 12, 2024

BREAKING.. ఎమ్మెల్యే గాంధీపై నమోదైన కేసుల ఇవే

image

HYDలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఘటనను సుమోటోగా తీసుకున్న సైబరాబాద్ గచ్చిబౌలి పోలీసులు ఎమ్మెల్యే గాంధీపై కేసు నమోదు చేశారు. A1 ఎమ్మెల్యే గాంధీ సహా, 15 మంది అనుచరుల మీద కేసులు బుక్ చేశారు. 189, 191(2), 191(3), 61, 132, 329, 333,324(4), 324(5) 351(2) సహా ఇతర సెక్షన్ల కింద కేసులు ఫైల్ అయ్యాయని అధికారులు తెలిపారు.

News September 12, 2024

HYD: దౌర్జన్యమా, గుండాయిజమా..?: KTR

image

దౌర్జన్యమా, గుండాయిజమా..? ఇందులో ఏది ఇష్టమో చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి, మీ కాంగ్రెస్ గుండాల బెదిరింపులకు BRS సైనికులు భయపడరని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి తామంతా అండగా నిలబడతామన్నారు. మీ అవినీతి దుష్పరిపాలన నుంచి రాష్ట్రంలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకుంటామని, మీ భయానక వ్యూహాలు మా సంకల్పానికి ఆజ్యం పోస్తాయన్నారు.

News September 12, 2024

HYD: FREE వాటర్ పథకం.. ఇది మీ కోసమే!

image

గ్రేటర్ HYD పరిధిలో డొమెస్టిక్ యూజర్లు 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి సరఫరా పథకం పొందేందుకు HMWSSB అధికారులు పలు సూచనలు చేశారు. పథకం పొందెందుకు ఆధార్ నెంబర్ CAN నంబర్‌తో లింక్ చేసుకోవడంతో పాటు, వాటర్ మీటర్ ఉండాలన్నారు. మురికివాడల్లో ఉన్న ప్రజలు కేవలం ఆధార్ లింక్ చేస్తే సరిపోతుందన్నారు. వాటర్ మీటర్ కనెక్షన్‌పై మినహాయింపు అందించినట్లు తెలిపారు. ఇందుకోసం స్థానిక సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించాలన్నారు.

News September 12, 2024

గణేశ్ నిమజ్జనం: HYDలో ‘రేపటి కోసం’

image

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం కోసం హైదరాబాద్‌లో ఏర్పాట్లు‌ జరుగుతున్నాయి. మండపాల్లో విగ్రహాలను నిలబెట్టిన భక్తులు ‘రేపటి కోసం’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ‘నిమజ్జనం ఉంది. విరాళాలు కావాలి. సొంత డబ్బులు పోగు చేయాలి. అన్నదానం కోసం దాతల సహాయం కావాలి. మన గణపతిని అంగరంగ వైభవంగా ఊరేగించాలి’ అన్న తపనతో యువత‌ ముందుకు కదులుతున్నారు. మరి మీ మండపం‌ వద్ద పరిస్థితి ఎలా ఉంది. కామెంట్ చేయండి.

News September 12, 2024

HYD సిటీలో రౌడీల భరతం పడతాం: సీపీ

image

HYD సిటీ పోలీస్ కమిషనరేట్ సీపీ CV ఆనంద్ నేడు మంత్రి సీతక్క, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన ఆనంద్‌కు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. HYD నగరంలో రౌడీల భరతం పడతామని, గంజాయి, డ్రగ్స్ పై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. డ్రగ్స్ జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 12, 2024

HYD: సెప్టెంబర్ 17..ముఖ్య అతిథులు వీరే..!

image

రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. HYD జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, RR జిల్లాలో స్టేట్ చీఫ్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది.