India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD శివారు ORR వెలుపల RRR అలైన్మెంట్ మార్కింగ్ వేగం పుంజుకుంది. GIS సర్వేయర్లు, సివిల్ ఇంజనీర్లు, ప్రత్యేక టెక్నికల్ బృందం నిరంతరాయంగా విధులు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ DPR ప్లాన్ అమలు చేస్తున్నారు. HYD అంతర్భాగం నుంచి RRR వరకు రేడియల్ రోడ్ల ప్లాన్లను సిద్ధం చేయటంపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ భాగాలుగా RRR నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు.
గ్రేటర్ HYD పరిధిలో GHMC డోర్ టూ డోర్ GIS ఫీల్డ్ సర్వేయర్ల నియామకానికి SEP 10 నుంచి 13 వరకు మెగా జాబ్ మేళా జరగనుంది. రూ.14 వేల జీతం, అలవెన్స్ ఉంటుంది. 10వ తరగతి పాసై ఉండాలి. 500+ఖాళీలు ఉన్నాయని, శేర్లింగంపల్లి తారానగర్ విద్యానికేతన్ హై స్కూల్ ఎదురుగా Spatial Hawk Geo informatics ప్రైవేట్ లిమిటెడ్ వద్ద జాబ్మేళా ఉంటుందని తెలిపారు. 9581519970, 93906 29693 కు సంప్రదించండి.
DSC అభ్యర్థులు ఈరోజు HYDలో ఉన్న పాఠశాల విద్యా కార్యాలయంలోని విద్యాశాఖ అధికారులకు కలిశారు. ఇటీవల విడుదల చేసిన DSCఫైనల్ కీలో కొన్ని తప్పులు ఉన్నాయని, పాఠ్య పుస్తకాల ప్రకారం సమాధానాలు ఇవ్వకుండా కొన్ని సమాధానాలు మార్పు చేశారని అభ్యర్థులు వాపోయారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు ఇచ్చిన ఆధారాలను మరోసారి రివ్యూ కమిటీకి సెండ్ చేస్తామని అదికారులు తెలిపారని వారు అన్నారు.
పద్మవిభూషణ్, ప్రజాకవి, స్వర్గీయ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులు పాల్గొన్నారు.
HYDలో సైబర్ నేరాల నియంత్రణకు, 7 జోన్లలో ప్రత్యేక సైబర్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజూ 20-30 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు వస్తుండగా, రూ.లక్ష వరకు నష్టపోయిన కేసులను స్థానిక పోలీస్ స్టేషన్లలో దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ నేరాల పై త్వరగా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయడమే ఈ సెల్స్ ప్రధాన లక్ష్యం అని తెలిపారు.
HYD శివారులో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ట్రామా కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,116 కోట్లు అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ హవర్ మిస్ కాకుండా ఉంటే ప్రాణాలు కాపాడొచ్చని, క్షతగాత్రులకు వైద్యం అందించటం ట్రామా కేంద్రాల ద్వారా సాధ్యమని ప్రభుత్వం నమ్ముతోంది.
ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ల పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా తెలిపారు. ‘హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంప పెట్టు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యం. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యం’ అని అన్నారు.
HYD పోలీస్ కమిషనర్గా మరోసారి నేడు CV ఆనంద్ (డీజీపీ ర్యాంక్ IPS) తన బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాదిలో జరిగిన సీపీ మార్పుల్లో ఒకటి, నాలుగో స్థానాలు ఆయనవే. 2,3 స్థానాల్లో సందీప్ శాండిల్య, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అంతేకాక 21 ఏళ్ల తర్వాత డీజీపీ స్థాయి అధికారిని HYD నగర పోలీస్ కమిషనర్గా నియమించడం ప్రత్యేక విషయం. నూతన సీపీకి నగర ప్రజలు X వేదికగా స్వాగతం పలికారు.
వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు HYDలో ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఈనెల 5న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చేతుల మీదుగా రాష్ట్ర పరిశ్రమల కమిషనర్ డా.జీ.మల్సూర్ అవార్డును అందుకున్నారని తెలిపారు. అత్యుత్తమ సాధకులు (టాప్ అచీవర్స్)గా ఎంపికైన 17 రాష్ట్రాల్లో తెలంగాణ ఉందన్నారు.
అర్హత ఉన్నా పలువురికి వంట గ్యాస్ సబ్సిడీ అందడంలేదని ఆరోపిస్తున్నారు. జీరో బిల్లులకు అర్హత సాధించినా గ్యాస్ సబ్సిడీ ఎందుకు అందడం లేదని, కారణమేంటని గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. గ్రేటర్ HYD పరిధిలో 17 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఇందులో 7.4 లక్షల మందికే జీరో బిల్లు అమలవుతుండగా.. కేవలం 3 లక్షల మందికే వంట గ్యాస్ సబ్సిడీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది.
Sorry, no posts matched your criteria.