India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సద్దుల బతుకమ్మ వేడుకలకు రాజధాని ముస్తాబైంది. ఎల్బీస్టేడియం, ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్ అంతటా రేపు రాత్రి సందడే సందడి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి ట్యాంక్బండ్కు తీసుకొస్తారు. హుస్సేన్సాగర్తో పాటు బాగ్లింగంపల్లి, KPHB, సరూర్నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్లోని GHMC మైదానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు బతుకమ్మ పాటలతో హైదరాబాద్ హోరెత్తనుంది.

HYD సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో రేపు మ.12 గంటలకు కామారెడ్డి BJP MLA కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ‘హైడ్రా’ పనితీరు గురించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే హైడ్రా పనితీరును కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మరి KVR ఏం చెబుతారో ఉత్కంఠ నెలకొంది.

జర్నలిస్టు గౌతమ్ వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గౌతమ్ షేర్ చేసిన వీడియోలో తప్పేముందో చెప్పాలని ఆయన X ద్వారా డిమాండ్ చేశారు. ప్రజల ఆందోళనలు, బాధలను తెలిపితే అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ తెలంగాణ డీజీపీని ఆయన ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా 8,113 NTPC గ్రాడ్యుయేట్ పోస్టులకు RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగం చేయాలనుకునేవారికి అప్లై చేసేందుకు మరో 5 రోజులే గడువు ఉంది. అక్టోబర్ 13వ తేదీన అప్లికేషన్ గడువు ముగియనుంది. కేవలం మన సికింద్రాబాద్(SCR) రీజియన్లోనే 478 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ చేసిన వారు అర్హులు. ఇంగ్లిష్, హిందీ టైపింగ్, కంప్యూటర్పై అవగాహన ఉండాలి. ఆసక్తి గలవారు అప్లై చేసుకోవచ్చు.
SHARE IT

HYD, RR, MDCL జిల్లాలలో LRS దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. LRS దరఖాస్తు కోసం తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు ఉండాలని అధికారులు తెలిపారు. LRS ప్రతి దరఖాస్తుకు లింక్ డాక్యుమెంట్, లే అవుట్ కాపీ, సైట్ప్లాన్, స్థల మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రం, ఈసీ, సేల్ డీడ్ దస్త్రాలను జత చేయాలని పేర్కొంది. సిటిజన్ లాగిన్లో చరవాణి ద్వారా ఈ దస్త్రాలను జత చేసే వీలు కల్పించింది.

HYD, RR, MDCL జిల్లాలో అనుమతి లేని ఇంటి స్థలాలతో పాటు, అనధికార లేఅవుట్లలోని ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు 2020 నవంబరులో అప్పటి ప్రభుత్వం LRS పేరిట దరఖాస్తులు స్వీకరించింది. మధ్యలో దరఖాస్తు ప్రక్రియ ఆగిపోయినప్పటికీ మళ్లీ ప్రస్తుతం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. https://lrs.telangana.gov.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని X వేదికగా టౌన్ ప్లానింగ్ అధికారులు సూచించారు.

దసరా పండుగతో నగరం ఖాళీ అవుతోంది. HYD ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు క్యూ కట్టారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు పట్టణం నుంచి పల్లెబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో MGBS, JBS, ఉప్పల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అన్ని రంగాల్లో కీలకంగా మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) టెక్నాలజీపై ప్రభుత్వం డిగ్రీ, పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. కృత్రిమ మేధలో ఉచిత శిక్షణ అందించేందుకు HYDలో ‘నెక్ట్స్ వేవ్’ స్టార్టప్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్క ఏడాదిలో కనీసం లక్ష మందికి శిక్షణ అందించాలనే లక్ష్యం పెట్టుకుంది. వర్క్షాప్ ద్వారా 2-3 నెలల ట్రైనింగ్ అందిస్తారు. మొదట HYD కాలేజీల్లో దీన్ని అమలు చేస్తారు.

తెలంగాణలో బహిరంగ మార్కెట్లో ఎంఫిటమైన్ ముడి ధరలు కిలో రూ.1 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకూ పలుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిమాండ్ను బట్టి దళారులు ఈ ధరలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ముడి సరుకును ల్యాబ్కు తరలించి ఎండీఎం తయారీకి ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. కూకట్పల్లిలో ఎంఫిటమైన్ తయారీ చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయి.

HYD బాలాపూర్ పరిధి మీర్పేట్ PS పరిధిలో <<14294955>> రోడ్డు ప్రమాదంలో<<>> చనిపోయిన ఇద్దరి వివరాలు పోలీసులు తెలిపారు. షేక్ మదీనా బాషా (కుడి) TGRTCలో అసిస్టెంట్ మెకానిక్గా పని చేస్తున్నాడు. అన్నోజు శ్రావణ కుమార చారి (ఎడమ) TKR కాలేజ్లో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నాడు. మదీనా బాషా TKR కమాన్ వైపు వెళ్తుండగా శ్రావణ లిఫ్ట్ అడిగాడు. వీరి మరణవార్తతో కుటుంబపెద్దలను కోల్పోయామని వారు రోదిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.