India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ HYDలోని పలు ప్రాంతాల్లో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మంచి నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణపై అలసత్వం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. సీవరేజ్ ఓవర్ ఫ్లో విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఎండీ అసహనం వ్యక్తం చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేసి సేవలపై ఆరా తీశారు.
బాలుడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన HYD శివారు షాద్నగర్ పరిధి హాజిపల్లి రోడ్డు సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సాయమ్మ, దుర్గయ్య దంపతులకు కట్టప్ప(6) కుమారుడు. ఉన్నాడు. ఎల్లయ్య అనే వ్యక్తి రాత్రి దుర్గయ్యకు చెందిన పందులను దొంగిలించేందుకు వెళ్లాడు. ఈ విషయాన్ని బాలుడు కట్టప్ప గమనించడంతో ఎవరికైనా చెబుతాడేమోనని భావించి బాలుడిని బండకేసి బాదడంతో మృతిచెందాడు.
వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద విద్యుత్తు భద్రతా చర్యలు పాటించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారప్ ఫరూఖీ HYDలో సూచించారు. మండపాలకు నిరంతరం విద్యుత్తు సరఫరా, భద్రత ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని సమీక్ష సమావేశంలో వెల్లడించారు. మండపాలకు విద్యుత్తు సరఫరా కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కకుండా సిబ్బందితోనే కనెక్షన్ తీసుకోవాలన్నారు. వైరింగ్ అసంపూర్తిగా ఉంటే వర్షాల వేళ షాక్ వచ్చే ప్రమాదముంటుందన్నారు.
గణేశ్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లో విగ్రహ నిమజ్జనం చేయడానికి ప్రజలకు అందుబాటులో 73 లొకేషన్లలో వివిధ రకాల పాండ్ లను జీహెచ్ఎంసీ సిద్ధం చేసినట్లు కమిషనర్ అమ్రపాలి తెలిపారు. నగర వ్యాప్తంగా 73 పాండ్ లలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్, 22 ఎస్కలేటర్ పాండ్స్ ఏర్పాటు చేశామన్నారు. అందులో పెద్ద విగ్రహాలు కాకుండా 2 నుంచి 5 ఫీట్ల చిన్న విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీలుగా ఏర్పాటు చేశామన్నారు.
ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలు ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు నుంచి విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు అంటే ఈనెల 17వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి పూజా కార్యక్రమాలు పూర్తయ్యే వరకు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సిటీ ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని ఆయన కోరారు.
వినాయక చవితి నేపథ్యంలో HYD, ఉమ్మడి RRలో యువత నైట్ అవుట్ చేసింది. అర్ధరాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు ఏ వీధిలో చూసినా యువకులు మండపాలు వేయడం, డెకరేషన్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇక విగ్రహాలు కొనుగోలు చేసేందుకు నాగోల్, ధూల్పేట్కు పోటెత్తారు. మరోవైపు పలు చోట్ల పండుగ సామగ్రి విక్రయ షాపులు అర్ధరాత్రి వరకు తెరిచే ఉండడంతో సందడి నెలకొంది. వినాయక చవితి తమకు స్పెషల్ ఫెస్టివల్ అని యువకులు తెలిపారు.
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు బాగా నష్టపోయాయని కేంద్రమత్రి బండి సంజయ్ HYDలో అన్నారు. నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారం TG, APకి కేంద్రం సహాయం చేస్తుందని చెప్పారు. ఇదీ రాజకీయాలతో కూడిన సమస్య కాదని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి.. రాజకీయాలను పక్కనపెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సచివాలయానికి వెళ్లినట్లు పేర్కొన్నారు.
జైనూరు ఘటనలో బాధితురాలని కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి పరామర్శించారు. మహిళ ముఖంపై ఉన్న గాయాలు చూసి మనసు చెలించిపోయిందని మంత్రి అన్నారు. మహిళ ప్రాణాల కంటే, ఓవైసీ పర్నిచర్కు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని, హిందూ యువతపై ఘర్షణ పేరిట అక్రమ కేసులు ఎందుకు బనాయిస్తున్నారని? ప్రశ్నించారు.
తెలంగాణ స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి (GSDP) 2036 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ప్రపంచ వాణిజ్య కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం GSDP 176 బిలియన్ డాలర్లుగా ఉందని, వచ్చే 12 ఏళ్లలో అది భారీగా వృద్ధి చెందుతుందని వెల్లడించింది. HYDలో జరుగుతున్న అంతర్జాతీయ కృత్రిమ మేధ (AI) సదస్సు సందర్భంగా నిన్న విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయం వెల్లడించింది.
రుణమాఫీ కాలేదని రైతన్నలు ధైర్యాన్ని కోల్పోవద్దని, రుణమాఫీ చేసే దాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని BRS ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మేడ్చల్లో రుణమాఫీ కాలేదని రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటం బాధ కలిగించిందన్నారు. పంట పండించే రైతన్న ప్రాణాలు కోల్పోయి గాంధీ ఆసుపత్రి వద్ద ఉంటే మనసు చలించి పోయిందన్నారు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు.
Sorry, no posts matched your criteria.