India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గచ్చిబౌలి పరిధిలో వివిధ రాష్ట్రాలకు చెందిన నిపుణుల సమక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాలపై గ్లోబల్ సబ్ సమ్మిట్ జరిగింది. AI సిస్టమ్స్ ప్రాముఖ్యతపై నిపుణుల బృందం విస్తృతంగా చర్చించినట్లు తెలంగాణ స్టేట్ ఎమర్జింగ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు.
గణపతి విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్ ధూల్పేట. వినాయకచవితి సమీపించడంతో HYD, ఇతర జిల్లాల నుంచి విగ్రహాల కొనుగోలుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే, గతంతో పోల్చితే ఈసారి విక్రయాలు ఎక్కువగా ఉంటాయని భారీగా గణనాథులను వ్యాపారులు సిద్ధం చేశారు. అనుకున్న స్థాయిలో విక్రయాలు జరగలేదు. ధరలు తగ్గించి అమ్మకాలు సాగిస్తున్నట్లు టాక్. 2023లో రూ.60 వేలు పలికిన విగ్రహం ఈసారి రూ. 40 వేలకు అమ్ముతున్నట్లు ఓ వ్యాపారి తెలిపారు.
బంజారాహిల్స్లోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నీలోఫర్ కేఫ్ కిచెన్ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. రిఫ్రిజిరేటర్లో భద్రపరిచిన షుగర్ సిరప్, మసాలా దినుసులు వంటి లేబుల్ లేని వస్తువులు చూసి అసహనం వ్యక్తం చేశారు. అమ్మకానికి ఉంచిన కేక్లను కూడా లేబుల్ చేయలేదు. దీంతో పాటు వంటగదిలో ఎక్స్పైరీ అయిన అరకిలో చీజ్, మిరప పొడి, 5 కిలోల కాల్చిన వేరుశెనగలు ఉన్నాయి.
హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కొంతమంది బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ విభాగాన్ని నీరు గార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా పేరుతో బెదిరిస్తే పీఎస్లో ఫిర్యాదు చేయాలన్నారు.
HYD నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా, ప్రజల నుంచి వినతులను సైతం స్వీకరిస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. భవిష్యత్తులో సామాన్య మానవుడు సైతం చూసుకునేలా చెరువులు, కుంటల FTL, బఫర్ జోన్ వివరాలను యాప్లో పొందుపరుస్తామని తెలిపారు. తద్వారా భూమి కొనుగోలు చేసేటప్పుడు అందరూ చెక్ చేసుకోవడానికి వీలుంటుందన్నారు. అక్రమాలు, సహా ఇతర ఫిర్యాదులను సైతం యాప్ ద్వారా స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
✓HYD హిమాయత్సాగర్ జలాశయం 4 ఫీట్ల నీటిమట్టం పెరిగితే నిండిపోతుంది ✓వర్షాలు తగ్గడంతో ఇన్ఫ్లో తగ్గింది
✓ఒక్క వర్షం వచ్చినా జలాశయం పూర్తిగా నిండి పోతుంది
✓జలయశయం నిండితే దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
✓HYD, RR జిల్లా కలెక్టర్లు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి
✓ఎప్పటికప్పుడు అధికారిక యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షించాలి.
HYD నగరంలోని పరేడ్ గ్రౌండ్ వద్ద సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలలో భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. మరోవైపు HYD,RR, MDCL,VKB జిల్లాల వ్యాప్తంగా అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డుల పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ప్రభుత్వం,వీటికి సంబంధించిన వివరాలు సేకరించనుంది.
HYD, RR, MDCL,VKB జిల్లాలలో జూన్, జూలై, ఆగస్టు లోటు వర్షపాతం నమోదు కాగా.. SEP-1 నుంచి 4 వరకు వర్షం బీభత్సం సృష్టించింది. కేవలం 4 రోజుల్లో ఏడాదికి సరిపోయేంత కురిసిందని అధికారులు రిపోర్ట్ విడుదల చేశారు. అత్యధికంగా తాండూరులో 859.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మోమిన్పేట-843, యాలాల-824, దుండిగల్ గండి మైసమ్మ-812, శంకర్పల్లి-736.4, ఘట్కేసర్-713.9, ముషీరాబాద్-709.1, SEC-701.1 మి.మీ నమోదైంది.
తెలంగాణకు కృత్రిమ మేధ(ఏఐ)లో అంతర్జాతీయ గుర్తింపు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తమ ప్రభుత్వం 200 ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ఈనెల 5, 6 తేదీల్లో హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లాలోని 100 చెరువులకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ పెండింగ్లో ఉందని కలెక్టర్ శశాంక అన్నారు. ఇప్పటి వరకు 925 చెరువుల్లో 99 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా 820 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.