RangaReddy

News March 26, 2025

జిల్లాలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు

image

రంగారెడ్డి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మంగళవారం మామిడిపల్లె, తొమ్మిదిరేకుల 38.8 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు కాసులాబాద్ 38.7℃, రెడ్డిపల్లె 38.6, మంగళ్‌పల్లె 38.4, మొగలిగిద్ద 38.3, కేతిరెడ్డిపల్లె, మొయినాబాద్, షాబాద్ 38.1, తుర్కయంజాల్, తొర్రూర్ 38, దండుమైలారం 37.7, హస్తినాపురం, నాగోల్ 37.5, గచ్చిబౌలి, మాదాపూర్, రాజేంద్రనగర్ 37.4, ఇబ్రహీంపట్నంలో 37℃ఉష్ణోగ్రత నమోదైంది.

News March 26, 2025

HYDలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. RAIDS

image

HYDలో వ్యభిచార ముఠాలకు పోలీసులు చెక్ పెట్టారు. మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌‌లో బంగ్లా యువతితో వ్యభిచారం చేయించడం గుర్తించారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన కార్తీక్, ఓ కస్టమర్‌, యువతిని అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్‌లో ఫొటోలు పంపి కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు గుర్తించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోనూ ఉగాండ యువతితో వ్యభిచారం చేయిస్తూ మరో వ్యక్తి పట్టుబడ్డాడు.

News March 26, 2025

భారీ శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధం

image

భారీ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. APR 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాంబాగ్‌ ఆలయం నుంచి హనుమాన్‌ వ్యాయామశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఇటీవల ఈ రూట్‌ను గోషామహల్‌ MLA రాజాసింగ్ పరిశీలించారు. ఈ సారి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వేలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొని రాముడి విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీరామనవమి రోజు ‘జై శ్రీరామ్’ నినాదాలతో HYD హోరెత్తనుంది.

News March 26, 2025

HYD: గ్రేట్.. చనిపోతూ ఏడుగురిని కాపాడాడు!

image

తాను చనిపోతూ ఏడుగురికి ప్రాణం పోశాడు ఓ యువకుడు. ఎల్బీనగర్‌లో నివాసం ఉండే శ్రీ అశ్లేశ్ గురునానక్ కాలేజీ‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. మైగ్రేన్, ఫిట్స్‌తో మార్చి 21 అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించగా మార్చి 23న అతడి బ్రెయిన్ డెడ్ అయ్యింది. తల్లిదండ్రులు శివశంకర్, ప్రమీల రాణి కుమారుడి అవయవదానానికి ఒప్పుకున్నారు. దీంతో జీవన్‌దాన్ ద్వారా ఏడుగురి ప్రాణాలు కాపాడారు.

News March 25, 2025

మేడ్చల్: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని SUICIDE

image

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మండల పరిధిలోని గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 25, 2025

HYD: ఓయూలో విధించిన ఆంక్షలపై వాయిదా తీర్మానం

image

ఓయూలో విధించిన ఆంక్షలపై శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. విద్యార్థుల ర్యాలీలు, ధర్నాల నిషేధంపై చర్చ కోరుతూ పార్టీ సభ్యులు అసెంబ్లీ కార్యదర్శికి వాయిదా తీర్మానం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వాయిదా తీర్మానం అందించారు.

News March 25, 2025

MMTS అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు

image

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్‌గా గుర్తించారు. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని యువతి గుర్తించింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

News March 25, 2025

రంగారెడ్డి జిల్లా ఉష్ణోగ్రతలు ఇలా..

image

రంగారెడ్డి జిల్లాలో సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. రెడ్డిపల్లె, చుక్కాపూర్‌లో 37.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. తోమ్మిదిరేకుల, ప్రొద్దుటూరు 37.3, మొయినాబాద్, మంగళ్‌పల్లి 37.2, కాసులాబాద్ 36.9, మొగలిగిద్ద 36.8, కేతిరెడ్డిపల్లి 36.7, కేశంపేట 36.6, ధర్మసాగర్, తుర్కయంజాల్, షాబాద్ 36.4, హస్తినాపురం, నాగోల్ 36.2, పేద్దషాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్లో 36.1℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 25, 2025

రంగారెడ్డి: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

image

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల పరిధిలో 2,158 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్‌కు 13 పరీక్ష కేంద్రాల పరిధిలో 2,965 మంది హాజరుకానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

News March 25, 2025

కేబినెట్ విస్తరణ.. హైదరాబాద్‌కు NO ఛాన్స్..!

image

మంత్రి వర్గ విస్తరణలో HYD, ఉమ్మడి RRకు చెందిన ఒక్క కాంగ్రెస్ MLAకు ఛాన్స్ దక్కలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ అంశం కొలిక్కి వచ్చింది. శ్రీగణేశ్ (కంటోన్మెంట్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), రామ్మోహన్ రెడ్డి(పరిగి), మనోహర్ రెడ్డి (తాండూర్), ఆరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కాలే యాదయ్య (చేవెళ్ల) ఉండగా ఎవరికీ ఛాన్స్ దక్కలేదని సమాచారం.