RangaReddy

News September 4, 2024

HYD: రాహుల్ ద్వంద్వ వైఖరి: కేటీఆర్

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR విమర్శించారు. ‘X’ వేదికగా మంగళవారం స్పందిస్తూ.. ‘రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. ఓ వైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధమంటూ.. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో బుల్డోజర్‌తో జరుగుతున్న విధ్వంసంపై మాత్రం మౌనంగా ఉంటారు. ఇదేం ద్వంద్వ వైఖరి రాహుల్ జీ’ అని ప్రశ్నించారు.

News September 4, 2024

HYDను క్రీడా రాజధానిగా మార్చడమే లక్ష్యం: CM

image

HYD నగరాన్ని భారతదేశ క్రీడా రాజధానిగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HYD గచ్చిబౌలిలో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సందర్భంగా సీఎం ప్రసంగించారు. 4 దేశాల ఫుట్‌బాల్ టోర్నమెంట్, అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF) హైదరాబాద్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని జట్లకు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

News September 4, 2024

HYD: గెజిట్‌ను విడుదల చేసిన ప్రభుత్వం

image

రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని ఔటర్ రింగ్ రోడ్డు సమీప గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. క్యాబినెట్ సబ్‌కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని 51 గ్రామ పంచాయతీలను వాటి సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేయడం ద్వారా పట్టణ ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

News September 3, 2024

WOW: అయోధ్య మందిరంలో బాలాపూర్‌ గణేశుడు!

image

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా బాలాపూర్‌ గణేశుడు ఈసారి మరింత ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నాడు. ప్రతి ఏటా ప్రముఖ పుణ్యక్షేత్రాల థీమ్‌తో డెకరేషన్ చేస్తారు. 2023లో బెజవాడ దుర్గమ్మ గుడి సెట్టింగ్ వేశారు. ఈ ఏడాది అయోధ్య బాల రాముడి ఆలయ ఆకారంలో మండపం నిర్మిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సీనియర్ డెకరేటర్ సుధాకర్ రెడ్డి ఈ సెట్టింగ్ వేస్తున్నారు. భక్తులకు మరింత కనువిందుగా మండప నిర్మాణం ఉంటుందన్నారు.

News September 3, 2024

HYD: సర్కారు నిర్లక్ష్యానికి 20 మంది బలి: కేటీఆర్

image

రాష్ట్రంలో వరద సహాయక చర్యలు చేపట్టడంలో రేవంత్ సర్కారు విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ఈ నిర్లక్ష్యం ఖరీదు 20 మంది ప్రాణాలు కోల్పోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనుల వల్లే హైదరాబాద్‌కు వరద ముప్పు తప్పిందని అన్నారు.

News September 3, 2024

HYD: ఉస్మానియా ఆసుపత్రి పై సీఎం ఆదేశాలు

image

✓HYD గోషామహల్లో 32 ఎకరాల్లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం
✓రానున్న 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆసుపత్రి భవనాల డిజైన్లు ఉండాలి
✓అకడమిక్ బ్లాక్‌తో పాటు, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు నిర్మించాలి
✓కాంక్రీట్ భవంతులే కాక, ఆహ్లాదాన్ని పంచేలా విశాలమైన ఖాళీ ప్రాంగణం ఉండాలి
✓గోషామహల్ పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ భూములను వైద్యారోగ్య శాఖకు అప్పగించండి

News September 3, 2024

HYD: ‘ఆ రెండు శరీరాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచుతాయి’

image

సంపూర్ణ పోషకాహారం, వ్యాయామం శరీరాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచుతాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. HYD కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన ‘అందరికీ పోషకాహారం’ప్రోగ్రాంలో పాల్గొన్నారు. 5 రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచించారు.

News September 3, 2024

గచ్చిబౌలి: ప్రజలకు విజ్ఞప్తి.. ఈ రూట్లో వెళ్లండి

image

✓గచ్చిబౌలి జంక్షన్- GPRA క్వార్టర్స్ వద్ద లెఫ్ట్ టర్న్-రైట్ టర్న్ గోపీచంద్ అకాడమీ-లెఫ్ట్ టర్న్ ఇన్ఫోసిస్ విప్రో జంక్షన్-రైట్ టర్న్ గోపనపల్లి- HC యూనివర్సిటీ బ్యాక్ సైడ్ నుంచి లింగంపల్లి
✓లింగంపల్లి నుంచి HCU డిపో వద్ద లెఫ్ట్ టర్న్-మజీద్ బండ-బొటానికల్ గార్డెన్-రైట్ టర్న్ గచ్చిబౌలి
✓సెప్టెంబర్ 3,6,9న సా.4 నుంచి రా.9 వరకు ఈ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచించారు.

News September 3, 2024

HYD: హోటళ్లలో మహిళా భద్రతపై DGP సూచనలు

image

HYD నగరంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ DGP షికా గోయల్ హోటల్ అగ్రిగెటర్ల మీటింగ్లో ఈ సూచనలు చేశారు.
✓రెంటుకు ఇచ్చేటప్పుడు సరైన భద్రత చర్యలు పాటించాలి
✓ఐడి వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలి
✓హోటళ్లలో CCTV బ్యాకప్ ఉండాలి ఎమర్జెన్సీ పోలీస్ కాంటాక్ట్ నెంబర్ అందించాలి ✓హోటళ్లలో మహిళా భద్రతపై కఠినంగా వ్యవహరించాలి.

News September 3, 2024

HYD: GHMC పరిధిలో నిత్యావసరాల పంపిణీ: సీఎం

image

జీహెచ్ఎంసీ పరిధిలో వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో సమీక్షించారు. ‘హైదరాబాద్‌లో ఎక్కడా చిన్న ఆవాంఛనీయ ఘటన జరగడానికి వీల్లేదు. విద్యుత్, ట్రాఫిక్, తాగునీరు, పారిశుద్ధ్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలి. కూలీలు పనులు దొరక్క ఇంటి దగ్గరే ఉండిపోతారు. వారిని గుర్తించి బియ్యం, పప్పులు, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలి’ అని సీఎం ఆదేశించారు.