RangaReddy

News May 21, 2024

ట్యాంక్ బండ్‌ వద్ద పర్యాటకుల సందడి!

image

HYDలోని పర్యాటక ప్రదేశాలకు ఇటీవల ప్రజలు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే జూపార్కుకు 25,600 మంది వచ్చిన విషయం తెలిసిందే. ఇక అదే రోజు ట్యాంక్ బండ్‌కు లక్ష మందికిపైగా రాగా 13,350 మంది బోటు షికారు చేసి గత రికార్డులన్నీ బద్దలుకొట్టారు. ఆ రోజు రూ.13.52 లక్షల ఆదాయం వచ్చిందని జి.ప్రభుదాస్ తెలిపారు. కొవిడ్ తర్వాత ఇంత ఆదాయం రావడం ఇదే ప్రథమమన్నారు. సోమవారం సాయంత్రం సైతం భారీగా జనం వచ్చారు.

News May 21, 2024

HYD: స్కీముల పేరిట స్కాములు.. జాగ్రత్త!

image

HYD నగరంలో అధిక వడ్డీ ఆశ చూపి ప్రత్యేక స్కీముల పేరిట పెట్టుబడులను స్వీకరించి స్కాములతో ప్రజలను మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాచకొండ కమిషనరేట్ సీపీ తరుణ్ జోషీ ప్రజలను హెచ్చరించారు. పలు సంస్థలలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీతో పాటు, తక్కువ సమయంలో భారీగా లాభాలు పొందవచ్చని మాయమాటలు చెప్పే వారిని నమ్మొద్దన్నారు. 

News May 20, 2024

HYD: రానున్న మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

బంగాళాఖాతంలో ఈనెల 22 నాటికి ఓ అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది వాయువ్య దిశలో కదిలి ఈనెల 24 నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40కి.మీ ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.

News May 20, 2024

HYD: ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

image

తెలుగు హీరో ఎన్టీఆర్‌కు జనసేనాని పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆస్కార్ పురస్కారాలు అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రియుల మెప్పు పొందారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్ మరిన్ని విజయాలు అందుకోవాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

News May 20, 2024

తెలంగాణలోనే GHMC టాప్.. తగ్గేదేలే!

image

రాష్ట్రంలో TS-bPASS అమలులోకి వచ్చిన NOV 2020 నుంచి ఏప్రిల్ 2024 వరకు జరిగిన భవన నిర్మాణాల్లో GHMC టాప్ ప్లేస్‌లో నిలిచింది. GHMC పరిధిలో 36,057 భవనాలకు అనుమతులిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక బడంగ్‌పేట్ కార్పొరేషన్ 9,241 నిర్మాణాలతో థర్డ్ ప్లేస్‌లో ఉంది. తుర్కయంజాల్‌లో 5,526, బోడుప్పల్‌లో 5,419 నిర్మాణాలకు అనుమతులు జారీ చేశారు. భవన నిర్మాణ రంగంలో జీహెచ్ఎంసీ దూసుకెళ్తుందని పేర్కొంది.

News May 20, 2024

OU: ఓరియంటల్ లాంగ్వేజెస్ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఓరియంటల్ లాంగ్వేజెస్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఉస్మానియా లాంగ్వేజ్ సర్టిఫికెట్ కోర్స్, ప్రీ డిగ్రీ కోర్స్, బీఏ లాంగ్వేజెస్, ఎంఏ లాంగ్వేజెస్ పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చన్నారు.

News May 20, 2024

FLASH: ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి, కారోబార్‌

image

ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి, కారోబార్‌లు ఇద్దరు ACBకి పట్టుబడ్డ ఘటన శంషాబాద్ మం. నానాజీపూర్ గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. HYDకు చెందిన బర్కత్ అలికి ఉన్న 500 గజాల స్థలంలో కాంపౌండ్ వాల్‌తో పాటు, చిన్న రూమ్ వేసుకోవడానికి గ్రామపంచాయతీ కార్యదర్శి రాధికను సంప్రదించగా.. రూ.65 వేలు లంచం అడిగింది. చివరిగా రూ.30 వేలు ఇవ్వాలంది. నగదు ఇస్తుండగా ACB అధికారులు పట్టుకున్నారు.

News May 20, 2024

తెలంగాణలోనే GHMC టాప్.. తగ్గేదేలే!

image

రాష్ట్రంలో TS-bPASS అమలులోకి వచ్చిన NOV 2020 నుంచి ఏప్రిల్ 2024 వరకు జరిగిన భవన నిర్మాణాల్లో GHMC టాప్ ప్లేస్‌లో నిలిచింది. GHMC పరిధిలో 36,057 భవనాలకు అనుమతులిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక బడంగ్‌పేట్ కార్పొరేషన్ 9,241 నిర్మాణాలతో సెకెండ్ ప్లేస్‌లో ఉంది. తుర్కయంజాల్‌లో 5,526, బోడుప్పల్‌లో 5,419 నిర్మాణాలకు అనుమతులు జారీ చేశారు. భవన నిర్మాణ రంగంలో జీహెచ్ఎంసీ దూసుకెళ్తుందని పేర్కొంది.

News May 20, 2024

HYD: మరో అరగంటలో నగర వ్యాప్తంగా వర్షం!

image

HYD నగరంలోని ఎల్బీనగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, మలక్పేట, బేగంపేట, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్, అమీర్పేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మరికొద్ది సేపట్లో వర్షం కురుస్తుందని ’తెలంగాణ వెదర్ మెన్‘ తెలిపింది. మరో అరగంటలో నగరంలోని ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. GHMC అధికారులు సైతం ప్రజలకు అలర్ట్ జారీ చేశారు.

News May 20, 2024

HYD: జూన్ 6 నుంచి నేషనల్ త్రో బాల్ ఛాంపియన్ షిప్

image

47వ సీనియర్ నేషనల్ త్రో బాల్ ఛాంపియన్ షిప్ జూన్ 6 నుంచి 8 వరకు HYD హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీడ్ ఎడ్యుకేషనల్ అకాడమీలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర త్రో బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ ఛైర్మన్, స్టేట్ డాక్టర్ సత్యం శ్రీరంగం తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈరోజు వారు మాట్లాడుతూ.. ఈ ఈవెంట్‌లో 26 రాష్ట్రాల నుంచి దాదాపు 750 మంది పురుషులు, మహిళా క్రీడాకారులు రానున్నారని తెలిపారు.