India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరంలో వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు GHMC రోడ్ల పరిసరాల్లో సంపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. PVNR పిల్లర్ నంబర్-264, నేతాజీ నగర్, రంగ మహల్ జంక్షన్, సోమాజిగూడ ఇమేజ్ ఆసుపత్రి, సోమాజిగూడ జోయ్ ఆలుకాస్, రాజీవ్ గాంధీ విగ్రహం, లక్డీకపూల్ ద్వారక హోటల్, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్, అయ్యప్ప సోసైటీ చెక్ పోస్ట్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఓల్డ్ కేసీపీ ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు.
బాలాపూర్లో బీటెక్ స్టూడెంట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో పక్కా ప్లాన్ చేసి మరీ ప్రశాంత్ని హత్య చేసినట్లు గుర్తించారు. హంతకులు అంతా ఒకే బస్తీకి చెందిన వారు అని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో దొరికిన సీసీ ఫుటేజ్ ద్వారా మూడు గంటల్లో నిందితులకు చెక్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
కరోనా కష్టకాలంలో రోగులకు సేవలందించిన గాంధీ మెడికల్ కాలేజీ, సనత్ నగర్ ఈఎస్ఐసీ ఆస్పత్రులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రశంసలతో ముంచెత్తింది. గురువారం ఢిల్లీ క్లినికల్ రిజిస్ట్రీ ఫర్ కొవిడ్-19 రిపోర్టు రిలీజ్ అండ్ డిస్సెమినేషన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు, ప్రొఫెసర్ త్రిలోక్ చందర్ను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.
విపత్తుల సమయంలో బాధితులకు సాయం అందించడం సవాళ్లతో కూడుకున్న పని, చాలాసార్లు హెలికాప్టర్ వెళ్లలేని ప్రాంతాలు సైతం ఉంటాయి. ఇలాంటి పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఐఐటీ హైదరాబాద్ చేపట్టిన డ్రోన్ల తయారీ ప్రాజెక్టు తుది దశకు చేరింది. ఇప్పటికే 60 కిలోల బరువు తీసుకువెళ్లే డ్రోన్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా 100 కిలోల బరువును అవలీలగా తరలించే ప్రాజెక్టు ప్రయోగ దశలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ (మంకీపాక్స్) అలజడి రేకెత్తిస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రులను సిద్ధం చేసింది. అక్కడ ప్రత్యేక వార్డులు నెలకొల్పింది. గాంధీలో 20 పడకలు కేటాయించారు. ఇందులో పురుషులకు, మహిళలకు పదేసి పడకలు కేటాయించినట్లు గాంధీ వైద్యులు పేర్కొన్నారు. ఫీవర్ ఆసుపత్రిలో ఆరు పడకలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి తన భూమికి సంబంధించి ధరణి సమస్య పరిష్కారం కాకపోవడంతో తలకిందులుగా నిరసన చేశాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితుడు చేసిన పనికి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, కార్యాలయ అధికారులు అవాక్కయ్యారు.
ప్రజలతో మర్యాదపూర్వకంగా, బాధితులపై సానుభూతితో వ్యవహరించాలని ట్రైనీ ఎస్ఐలకు డీజీపీ జితేందర్ సూచించారు. అకాడమీలో అందుతున్న శిక్షణ, కల్పిస్తున్న మౌలిక వసతులు తదితర అంశాలను డీజీపీ జితేందర్, అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ బుధవారం కలిసి పరిశీలించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 547 మంది ట్రైనీ ఎస్ఐలతో కాసేపు మాట్లాడారు. శిక్షణపై ట్రైనీ ఎస్ఐలు సంతృప్తి వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి ట్రైన్ ప్రయాణాలు సాగించేవారిని సౌత్ సెంట్రల్ అలర్ట్ చేసింది. ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ రైల్వే డివిజన్ల పరిధిలో పలు ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్ నుంచి వరంగల్, హైదరాబాద్, కాజీపేట నుంచి బల్లార్ష వెళ్లే ట్రైన్లు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
HYD రాజేంద్రనగర్లోని IIRR (ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్) విద్యా సంస్థలు, అగ్రికల్చర్ సైంటిస్ట్ డా.కృష్ణమూర్తి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజ్ఞాన్ యువ అవార్డు పొందారు. అవార్డు పొందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశోధనలకు నాంది పలుకుతామని తెలిపారు.
కోఠి ENT ఆసుపత్రిలో వినికిడి సమస్య సంబంధించిన సర్జరీలు ఇటీవల పెద్ద సంఖ్యలో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఖరీదైన వినికిడి యంత్రాలు, సర్జరీలు చేయించుకున్న వారికి LOC, CMRF ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. చికిత్సల అనంతరం ఉచితంగా వినికిడి యంత్రాలతో పాటు, ఏడాది పాటు AVT( Auditions Verbal Therapy) అందిస్తారు.
Sorry, no posts matched your criteria.