India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దివ్యాంగులకు రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్పై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రాథమిక దశలోనే హైకోర్టు కొట్టివేసింది. స్మితా సభర్వాల్ వ్యాఖ్యల వల్ల ఎవరి హక్కులకూ భంగం కలగలేదని, ఎవరూ నష్టపోలేదని, వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఆమెకు ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది.

ప్రత్యేక అధికారులు ప్రతినెలా 10 పాఠశాలలను సందర్శించి రిజిస్టర్లను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లో డీఈవో, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలను సందర్శించి నివేదికలు సమర్పించడానికి నియమించబడిన ప్రత్యేక అధికారులు వారానికి 2, నెలలో 10 పాఠశాలలను పరిశీలించాలని అన్నారు.

వర్షానికి నగరంలోని రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. సీసీ రోడ్లు, బీటీ రోడ్లని తేడాలేకుండా గుంతలుపడి నీళ్లు నిలిచాయి. మ్యాన్హోళ్ల మరమ్మతులు లేక రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. మహానగంలో ఉమ్మడి జిల్లాను కలుపుతూ 10వేల కి.మీ.ల రోడ్లుంటే అందులో 885 కి.మీ. ప్రధాన రహదారులు నిర్వహణ బాధ్యత ప్రైవేట్ సంస్థలది. వీటిపై అధికారులు పర్యవేక్షణను గాలికొదిలేశారు. బల్దియాకు రోజుకు 1000కిపైగా రహదారులపై కంప్లెంట్స్ వస్తున్నాయి.

HYD వాతావరణ కేంద్రం ఆగస్టు 27న పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందని MLA KTR తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసినా.. ఈ కుంభకర్ణ కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్తలు, ప్రజలకు హెచ్చరికలు జారీ చేయలేదన్నారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువ శాస్త్రవేత్త, 20 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. KTR వ్యాఖ్యలపై మీ కామెంట్..?

HYD నగర ప్రజలకు సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కప్-2024 సెప్టెంబర్ 3, 6, 9వ తేదీలలో GMCB గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, IIIT సర్కిల్ నుంచి విప్రో రూట్లో ఆయా రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్ రావుపై కొంత మంది బీజేపీ నేతలు చేస్తున్న అనుచిత దాడి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని BRS ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. రాజకీయ విమర్శలను జవాబుగా రాజకీయ విమర్శలతోనే ఎదుర్కోవాలిగాని, అందుకు భిన్నంగా భౌతిక దాడులు చేస్తామని, బయట తిరగనివ్వబోమని బెదిరిస్తూ తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా దుర్భాషలాడటం అప్రజాస్వామికం అన్నారు.

HYD నుంచి విజయవాడ, ఖమ్మం ప్రాంతాలకు అత్యవసరంగా వెళ్లాలంటే ఈ రూట్లలో వెళ్లండి.
✓HYD నుంచి చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ
✓HYD నుంచి చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, మరిపెడ బంగ్లా, ఖమ్మం
✓HYD పోలీస్ ట్రాఫిక్ హెల్ప్ లైన్కు 9010203626 సంప్రదించాలని తెలిపారు.

తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షంతో అనేక చోట్ల వరదలు ముంచెత్తాయి. దీంతో నేడు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు దాదాపు 18 రైళ్లను రద్దు చేస్తూ నోటీసు జారీ చేశారు. ఇందులో సికింద్రాబాద్ నుంచి సిర్పూర్, కాగజ్ నగర్, షాలిమార్, విశాఖపట్నం, హౌరా, గుంటూరు రైళ్లు ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని GM అరుణ్ కుమార్ జైన్ సూచించారు.

3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు HYD చల్లబడింది. చిరుజల్లులు, పచ్చదనంతో నగరంలోని కృష్ణకాంత్, వనస్థలిపురం మహవీర్, కేబీఆర్ సహా పలు పార్కులు ఆహ్లాదకరంగా మారాయి. అటు వికారాబాద్ ప్రాంతం కొత్త అందాలతో కనువిందు చేస్తోంది. HYD, RR, MDCL, VKBకి వాతావరణ శాఖ ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు.

HYD, RR, MDCL, VKB జిల్లాలలో కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో గచ్చిబౌలి-97, HCU-85.8, మాదాపూర్-68.5, మణికొండ-53.5, కూకట్పల్లి-81, ఉప్పల్-51, యూసఫ్ గూడ-69.5, షేక్ పేట-68.3, మోమిన్పేట-55.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.