RangaReddy

News May 5, 2024

సికింద్రాబాద్‌లో BJP సభ.. ఆంక్షలు

image

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో BJP సభ కొనసాగుతోంది. మరికాసేపట్లో ప్రాంగణానికి అమిత్ షా రానున్నారు. ఇప్పటికే వేలాది మంది కార్యకర్తలు సభకు చేరుకొన్నారు. భద్రతా చర్యల దృష్ట్యా సిటీ పోలీసులు ఆంక్షలు విధించారు. సంగీత్ X రోడ్‌ నుంచి బేగంపేట, పంజాగుట్ట వెళ్లేవారిని క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్‌, CTO, రసూల్‌పురా మీదుగా మళ్లిస్తున్నారు. పరేడ్‌ చుట్టూ వాహనాలను దారి మళ్లిస్తున్నారు. SHARE IT

News May 5, 2024

Elections: హాట్‌ ఫేవరేట్‌గా సికింద్రాబాద్‌

image

MP ఎన్నికల్లో సికింద్రాబాద్ హాట్ ఫేవరేట్‌గా మారింది. కిషన్ రెడ్డి, పద్మారావు, దానం పోటీలో ఉండటం అంచనాలు పెంచింది. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇక్కడ జాతీయ పార్టీలదే హవా. ఒకే ఒక్కసారి తెలంగాణ ప్రజాసమితి(1971) గెలిచింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా BRS ఖాతా తెరవలేదు. ఈసారి పజ్జన్న‌ నిలబడటంతో‌ టగ్ ఆఫ్ వార్‌‌ అని టాక్. BJP, INC గెలుపుపై ధీమాతో ఉన్నారు. ప్రజానాడీ‌ ఎటువైపనేది ఉత్కంఠగా మారింది.

News May 5, 2024

HYDలో రికార్డ్ బ్రేక్.. 90.68 మి.యూ విద్యుత్ వినియోగం

image

గ్రేటర్ HYDలో రికార్డ్ స్థాయి విద్యుత్ వినియోగం నమోదైనట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మే 4న 90.68 మిలియన్ యూనిట్లకు దాటినట్లు పేర్కొన్నారు. 2023లో ఇదే రోజు 59.98 మిలియన్ యూనిట్లు మాత్రమే నమోదయిందని, కానీ.. ఈ ఏడాది దాదాపు 51 శాతం అధికంగా విద్యుత్ వినియోగం నమోదయినట్లు వెల్లడించారు. ఈ వేసవిలో ఎంత డిమాండైనా తట్టుకునేనుందుకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందన్నారు.

News May 5, 2024

170 చలివేంద్రాలు ఏర్పాటు చేశాం: HMWSSB

image

వేసవి తాపంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు HYD జలమండలి సిద్ధమైంది. వివిధ అవసరాల కోసం బయటకి వచ్చే సామాన్య ప్రజలు, ప్రయాణికులు, పాదచారుల దాహార్తిని తీర్చేందుకు నగరంలో ప్రధాన ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైతు బజార్లు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లు తదితర ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేస్తోంది. ఇందు కోసం GHMC పరిధిలో 170 చలివేంద్రాలు ఏర్పాటు చేశామని ఆదివారం తెలిపారు.

News May 5, 2024

AI అద్భుతం.. HYD అందాలు..!

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నూతన టెక్నాలజీ అద్భుతాలు సృష్టిస్తోంది. HYD మహానగరంలోని చార్మినార్, సెక్రటేరియట్, రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి లాంటి పర్యాటక ప్రాంతాల AI ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. AI ద్వారా రూపొందించిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయంటూ నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. HYD నగర కట్టడాల ఫొటోలను నూతనంగా రూపొందించడంలో టెక్నో క్రాంట్లు వారి ప్రతిభను కనబరుస్తున్నారు.

News May 5, 2024

HYD: కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

image

HYD పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్‌ వద్ద కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇంటి ముందు నిలబడి ఉన్న నాలుగేళ్ల చిన్నారి రిషిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దాడిని గమనించిన స్థానికులు కుక్కలను తరిమేయడంతో ప్రాణాపాయం తప్పింది. బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని స్థానికులు ఆరోపించారు.

News May 5, 2024

ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో అల్లు అర్జున్

image

ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో సినీ హీరో అల్లు అర్జున్ శనివారం సందడి చేశారు. కారు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన తన డాక్యుమెంట్లను రవాణా శాఖ కార్యాలయంలో అందజేశారు. అల్లు అర్జున్ బీఎండబ్ల్యూ ఐ7 కారుకు నంబర్ కేటాయించినట్లు రవాణా శాఖ అధికారి పురుషోత్తం తెలిపారు.

News May 5, 2024

HYD: రికార్డ్.. 44.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత

image

HYD నగరంలో రోజు రోజుకూ భానుడు మరింత భగ్గుమంటున్నాడు. జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. 2015లో నమోదైన అత్యధిక 44.3° డిగ్రీల రికార్డు నిన్న బ్రేక్ అయింది. సాధారణం కంటే 4 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.10 రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఎండలకు బయటకు వెళ్లాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు.

News May 5, 2024

HYD: మురుగు కూపంగా హుస్సేన్ సాగర్.. చర్యలేవి?

image

HYD హుస్సేన్ సాగర్ మురుగు కూపంగా మారుతోంది. నిత్యం నాలాల నుంచి వస్తోన్న వ్యర్థాలు సాగర్ ఒడ్డున ఎక్కడికక్కడ పేరుకు పోతున్నాయి. రోజు రోజుకు హుస్సేన్ సాగర్ నీటి నాణ్యత పడిపోతోంది. నీటిలో కరిగి ఉండాల్సిన ఆక్సిజన్ 4MG కాగా.. తాజాగా పీసీబీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, అంతకు తక్కువగా 3.2MG నమోదైంది. నీటిలో కరిగి ఉండే O2 శాతం తగ్గటం వల్ల జలచరాలు మరణించే ప్రమాదం ఉంది.

News May 5, 2024

HYD: మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయండి: సీపీ 

image

మహిళలు వేధింపులకు గురైనప్పుడు వెంటనే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ తరుణ్ జోషి కోరారు. షీటీమ్ రాచకొండ వాట్సాప్ నంబర్ 8712662111 ద్వారా లేదా ప్రాంత షీటీం అధికారుల నంబర్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం -8712662600, కుషాయిగూడ-8712662601, ఎల్బీనగర్ -8712662602, మల్కాజిగిరి -8712662603, వనస్థలిపురం-8712662604 నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు.