RangaReddy

News May 4, 2024

HYD: బర్త్‌డే కేక్‌ కోసం వెళ్లి బాలుడి మృతి

image

బర్త్‌డే సందర్భంగా కేక్ తెచ్చుకోవడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన HYD షాద్‌నగర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. రతన్‌ కాలనీకి చెందిన బిజ్వి సందీప్‌ (16) బర్త్‌డే సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్‌ కట్‌ చేయాలని గురువారం రాత్రి బయటికి వెళ్లాడు. కేశంపేట బైపాస్‌ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా జడ్చర్ల వైపు వెళ్తున్న వాహనం అతడిని ఢీకొంది. దీంతో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు.

News May 4, 2024

HYD: 5 నుంచి వేసవి సెలవులు

image

HYD జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఈ నెల 5 నుంచి 26 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడో ఏడాది వారికి మాత్రం ఈ నెల 6 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఉంటాయని వివరించారు. వారు ఇంటర్న్‌షిప్ చేసేందుకు వీలుగా అదనంగా వారం రోజులు ఇచ్చినట్లు తెలిపారు.

News May 4, 2024

HYD: భగ్గుమంటున్న భానుడు!

image

భానుడు భగ్గుమంటున్నాడు. రోహిణి కార్తె రానే లేదు.. అంతలోనే ఎండలు మండుతున్నాయి. వేడి తీవ్రతకు నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు జంకుతున్నారు. అల్లాపూర్ 44.2, కుత్బుల్లాపూర్ 44.1,నాచారం 44.0, ముషీరాబాద్ 44.0,అల్కాపురి కాలనీ 43.9,యాకుత్ పుర, షేక్ పేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో 43. 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

News May 4, 2024

HYDలో రేవంత్ రెడ్డి VS KTR

image

HYD, ఉమ్మడి RRలోని మల్కాజిగిరి, HYD, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి, BRS నాయకులతో మాజీ మంత్రి KTR మాట్లాడుతున్నారు. ఈ 9 రోజుల్లో నగరంలో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై సూచనలు చేస్తూనే ఎవరికి వారు గెలుపుపై వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు రోడ్ షోలతో హోరెతిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో రాజకీయం వేడెక్కింది.

News May 4, 2024

HYD: కాంగ్రెసోళ్లు నన్ను ఓడించాలని చూస్తున్నారు: నివేదిత

image

కాంగ్రెసోళ్లు తనపై కక్ష కట్టి ఓడించాలని చూస్తున్నారని BRS సికింద్రాబాద్ కంటోన్మెంట్ MLA అభ్యర్థి నివేదిత అన్నారు. HYD బోయిన్‌పల్లిలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోని కొంత మంది ముఖ్య నాయకులు కంటోన్మెంట్‌కి వచ్చి తనను ఓడించాలని శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ‘మా నాన్న చేయి.. నా తలమీద లేనప్పుడు నన్ను ఇబ్బందులు పెడుతున్న వారికి నా కంటోన్మెంట్ ప్రజలే బుద్ధి చెబుతారు’ అని అన్నారు.

News May 3, 2024

HYD: ప్రధాని మోదీవి అన్ని అబద్ధాలే: కేటీఆర్

image

అబద్ధాలు చెప్పే ప్రధాని మోదీ పదేళ్ల క్రితం ప్రతి ఒక్కరి జన్​ ధన్​ ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, ప్రజలను వంచించారని BRS వర్కింగ్​ ప్రెసిడెంట్​ KTR విమర్శించారు. ఈరోజు రాత్రి సికింద్రాబాద్​ MP అభ్యర్థి పద్మారావుగౌడ్​‌కు మద్దతుగా బన్సీలాల్​‌పేట్ జబ్బర్​ కాంప్లెక్స్​ వద్ద నిర్వహించిన రోడ్డు షోలో ఎమ్మెల్యే తలసాని, పద్మారావుతో కలిసి పాల్గొన్నారు.

News May 3, 2024

BREAKING: HYD: MLA మల్లారెడ్డి ర్యాలీలో అపశ్రుతి

image

HYD బోడుప్పల్‌లో మాజీ మంత్రి, మేడ్చల్ MLA చామకూర మల్లారెడ్డి పాల్గొన్న బైక్ ర్యాలీలో ఈరోజు అపశ్రుతి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోడుప్పల్‌కి చెందిన BRS యువ నేత శ్రవణ్(24) మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో డీజే ఉన్న డీసీఎం చక్రాల కింద ప్రమాదవశాత్తు అతడు పడి మృతిచెందాడు. ఉప్పల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News May 3, 2024

శంషాబాద్‌లో 34 కేజీల బంగారం స్వాధీనం

image

HYD శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను ముంబయి నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తున్నట్టు గుర్తించారు.

News May 3, 2024

HYD: టాప్ హోదాను నిలుపుకునేందుకు కృషి చేయాలి: సీఎస్

image

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం గతంలో సాధించిన విజయాన్ని పునరావృతం చేసి ఈ ఏడాది టాప్ అచీవర్ హోదాను నిలుపుకునేందుకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను కోరారు. ఈఓడీబీ పరిధిలోని వివిధ శాఖలు చేపట్టిన సంస్కరణలపై సీఎస్‌ సీనియర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. జూలై నెలాఖరులోగా ఈఓడీబీ కింద చేపట్టాల్సిన అన్ని సంస్కరణలను పూర్తి చేయాలని ఆదేశించారు.

News May 3, 2024

సికింద్రాబాద్‌లో మరోసారి బీజేపీ జెండా ఎగరాలి: కిషన్ రెడ్డి

image

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరొకసారి బీజేపీ జెండా ఎగరాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 5వ తేదీ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు బీజేపీ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్లాలని ఆయన సూచించారు.