RangaReddy

News March 23, 2025

ఆకట్టుకున్న అద్భుత నృత్యప్రదర్శనలు

image

ప్రఖ్యాత నాట్యకళాసంస్థ అభినయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రాత్రి రవీంద్రభారతిలో నాట్యప్రవాహ శీర్షికన అభినేత్రి గురు ప్రమోద్ కుమార్ రెడ్డి, భారత రంగస్థల ఆకాడమీ గురు కోకా విజయలక్ష్మి, నృత్యాలయం గురు ఎన్.లక్ష్మి, రందుల కూచిపూడి నాట్యనిలయం గురు జి.రవిల 80మంది శిష్యులు వివిధ అంశాల అద్భుత నృత్యప్రదర్శనలతో ఆశేష కళాప్రియులను ఆకట్టుకున్నారు.

News March 23, 2025

SUNDAY.. HYDలో ఫ్యాన్స్ జోరు..!

image

హాలిడే రోజు HYD హోరెత్తనుంది. క్రికెట్ ఫ్యాన్స్‌ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. గతేడాది సిక్సర్ల మోతతో హోమ్ గ్రౌండ్‌లో రికార్డులు సృష్టించిన SRH ఈ సీజన్‌లో కూడా విధ్యంసం సృష్టిస్తుందని హైదారాబాదీలు ఎదురుచూస్తున్నారు. ‘IPL-18’లో నేడు SRH.. RRతో తలపడనుంది. ఉప్పల్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను హబ్సిగూడ X రోడ్ వద్ద మళ్లిస్తారు. రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలు స్ట్రీట్ నం.8 ద్వారా UPL X రోడ్‌కు మళ్లిస్తారు.

News March 23, 2025

కడ్తాల్: అందాల పోటీలకు పైసలు ఎక్కడివి: సర్పంచుల సంఘం

image

గ్రామ పంచాయతీల్లో సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులకు డబ్బులు లేవంటున్న ప్రభుత్వం అందాల పోటీలకు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని మాజీ సర్పంచ్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి ప్రశ్నించారు. శనివారం కడ్తాల్‌లో మాట్లాడుతూ.. సొంత నిధులు వెచ్చించి గ్రామాల అభివృద్ధి చేసిన సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తుందని ఆరోపించారు. మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.

News March 23, 2025

నేడు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సన్నాహక సమావేశం

image

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సన్నాహాక సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరంగర్‌లో ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అన్నారు. ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరవుతున్నారని చెప్పారు. కావున జిల్లా ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, కాంగ్రెస్ అన్ని విభాగాల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

News March 22, 2025

HYD: ప్రియుడి సూచన.. NTR స్టేడియంలో దారుణం

image

NTR స్టేడియంలో పసిపాపను కాల్చివేసిన ఘటనలో మైనర్ బాలుడిని దోమలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కవాడిగూడకు చెందిన మైనర్ బాలిక, నల్గొండ జిల్లాకు చెందిన బాలుడు ప్రేమించుకుంటున్నారు. శారీరకంగానూ ఒక్కటి అవ్వడంతో బాలిక గర్భం దాల్చింది. నెలలు నిండక ముందే డెలివరీ కావటంతో పుట్టుకతోనే పాప చనిపోయింది. ప్రియుడి సూచన మేరకు NTR స్టేడియంలో మృతశిశువును బాలిక కాల్చివేసింది. పోలీసులు బాలుడిని జువైనల్‌కి తరలించారు.

News March 22, 2025

HYD: పదోన్నతి.. ఇంతలోనే అడిషనల్ DCP మృతి

image

హయత్‌నగర్‌లో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అడిషనల్ DCP బాబ్జీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పోలీస్ సిబ్బంది తీవ్ర సంతాపం ప్రకటించింది. మార్చి 18న ఆయన అడిషనల్ SP ర్యాంక్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. ఇంతలోనే మృతి చెందడం కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ద అంబర్‌పేటలో నివాసం ఉండే బాబ్జీ‌కి ఉదయం వాకింగ్ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే హైవే మీద రోడ్డు దాటుతుండగా బస్సు ఢీ కొట్టింది.

News March 22, 2025

HYD: భార్య వీడియోలు భర్తకు పంపి.. బ్లాక్ మెయిల్!

image

విదేశంలో HYD యువతికి వేధింపులు ఎదురయ్యాయి. శ్రీకృష్ణానగర్‌ వాసి 2018లో పనికోసం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పరిచయమైన అబూబాకర్ ఆమె వ్యక్తిగత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. 2020లో బాధితురాలు HYD వచ్చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. ఏకంగా ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. కాల్ చేసినా ఆమె బయటకురావడం లేదని ఆ వీడియోలు ఆమె భర్తకు పంపాడు. ఈ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 22, 2025

రేపు ఉప్పల్‌లో SRH VS RR.. ఇవి నిషేధం!

image

⊘కెమెరాలు, రికార్డింగ్‌ పరికరాలు
⊘కత్తులు, గన్నులు, మారణాయుధాలు
⊘టపాసులు, సిగరెట్, అగ్గిపెట్టె, లైటర్
⊘మద్యపానం, కూల్‌డ్రింక్స్, బయటి ఆహార పదార్థాలు
⊘పెంపుడు జంతువులు
⊘హ్యాండ్ బ్యాగ్స్, ల్యాప్‌టాప్స్, సెల్ఫీ స్టిక్స్
⊘హెల్‌మెట్, బైనాక్యులర్‌ స్టేడియం లోపలికి తీసుకురావొద్దని <<15844156>>రాచకొండ<<>> పోలీసులు హెచ్చరిస్తున్నారు.
SHARE IT

News March 22, 2025

HYD: వరదల్లో కొట్టుకొచ్చిన శిశువు మృతదేహం (PHOTO)

image

హైదరాబాద్‌లో శిశువు మృతదేహం కలకలం రేపింది. అర్ధరాత్రి హైటెక్ సిటీలో భారీ వర్షానికి వరదలు వచ్చాయి. మెడికవర్ హాస్పిటల్ ముందున్న మ్యాన్ హోల్ వద్ద ఓ పసికందు మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన వాహనదారులు వెంటనే లోకల్ PSకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 22, 2025

HYD: ఇన్‌స్టాలో పరిచయం.. హోటల్‌లో అత్యాచారం

image

అల్వాల్ PSలో ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందింది. దర్యాప్తులో బాలికలు ఓ హోటల్ గదిలో ప్రత్యక్షమయ్యారు. పోలీసుల వివరాలలా.. దమ్మాయిగూడకు చెందిన సాత్విక్ (26), కాప్రాకు చెందిన మోహన్‌చందు (28)లకు మచ్చ బొల్లారానికి చెందిన బాలికలతో ఇన్‌స్టాలో పరిచయం అయింది. యువకుల మాటలు నమ్మి బాలికలు 3 రోజుల క్రితం కుషాయిగూడలోని ఓ హోటల్‌కు వెళ్లగా లైంగికదాడి చేశారు. కేసు నమోదైంది.