RangaReddy

News May 3, 2024

HYD: సెక్టార్ అధికారులు, ఏఆర్ఓలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

image

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సెక్టార్ అధికారులు, ఏఆర్ఓలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పారదర్శకంగా పని చేయాలని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించారు.

News May 3, 2024

HYD: హోటల్ యజమాని హత్య

image

HYD గచ్చిబౌలిలో ఓ హోటల్ యజమాని ఈరోజు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక అంజయ్య నగర్‌లో శ్రీనివాస్ (54) అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో దారి విషయంలో ఏడాది క్రితం హోటల్ పక్కన నివసించే వ్యక్తితో అతడికి గొడవ జరిగింది. కక్ష కట్టిన సదరు వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో శ్రీనివాస్‌ మృతిచెందాడు. మృతుడి కుమారుడు కేశవ్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 3, 2024

HYD: ప్రయాణికులకు TSRTC శుభవార్త

image

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ ఛార్జీలను మినహాయింపు ఇస్తున్నట్లు HYD అధికారులు తెలిపారు. ఎనిమిది రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఇందులో మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం tsrtconline.in వెబ్ సైట్‌ని సంప్రదించాలని పేర్కొన్నారు.

News May 3, 2024

HYD: ఇంటి వద్ద ఓటు వేసిన వయోవృద్ధులు

image

మే 13న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ఉండడంతో వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్స్, అనారోగ్యంతో ఉన్నవారి కోసం ఇంటి వద్దనే ఓటింగ్ సౌకర్యాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం HYDలోని మలక్‌పేట్ సహా పలు ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు వయోవృద్ధుల ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరించారు. వారితో ఓటు వేయించారు. పూర్తిగా పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

News May 3, 2024

HYD: మెట్రోలో 50 కోట్ల మంది ప్రయాణించారు..!

image

HYD మెట్రో రైలు మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 50 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించినట్లు ఎండీ NVS రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్‌ను ఆయన ఆవిష్కరించారు. రోజూ 5.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని, రెండో దశ రైలుకు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయన్నారు. మెట్రోపై ప్రయాణికులకు నమ్మకం పెరిగిందన్నారు. మెట్రో రైలు వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అయిందన్నారు.

News May 3, 2024

HYD: ప్రాణం తీసిన ఈత సరదా.. జర జాగ్రత్త!

image

వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు చెరువులు, బావుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు జరగ్గా ఈరోజు మరో బాలుడు మృతిచెందాడు. HYD శివారు చేవెళ్ల పరిధి దేవుని ఎర్రవల్లిలో 10 మంది ఫ్రెండ్స్ కలిసి బావిలో ఈతకు వెళ్లారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన విఠలయ్య కుమారుడు నాని నీట మునిగి చనిపోయాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశారు.  

News May 3, 2024

HYD: గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

image

చెన్నాపురం చెరువులో దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. చెన్నాపురం చెరువులో గురువారం గుర్తు తెలియని వ్యక్తి(25-30) చెరువులో దూకాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 3, 2024

HYD: ఎర్రకుంటలో మృతదేహం లభ్యం

image

ఎర్రకుంటలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మధుబన్ కాలనీలో GHMC పారిశుద్ధ్య కార్మికులు గురువారం చెత్తను శుభ్రం చేస్తుండగా మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 3, 2024

BREAKING.. శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత

image

శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీన్ని పట్టుకోవడానికి 5 బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు తరలించనున్నారు. కాగా, 5 రోజులుగా అధికారులను చిరుత ఉక్కిరిబిక్కిరి చేసింది.

News May 3, 2024

ఉప్పల్: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రమేశ్(70) ఉప్పల్ ఆదిత్య ఆసుపత్రి వెనకాల లేట్ మిషన్ నడిపిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఉప్పల్ నుంచి బోడుప్పల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.