India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సైదాబాద్ జువైనల్ హోంలో మత్తు బానిసలుగా మారుతున్న బాలలకు విముక్తి కల్పించేందుకు ‘మత్తు విముక్తి కేంద్రం’ ఏర్పాటు చేయాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ క్లినిక్లో పనిచేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గలవారు www.wdsc.telangana.gov.in వెబ్సైట్ నుంచి లేదా 040-245590480లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.
HYD నగరంలో మూసీ ప్రక్షాళన వడివడిగా సాగుతోంది. ముఖ్యంగా ఆక్రమణలను గుర్తించిన అధికారులు ప్రత్యేక యాప్లో వివరాలు పొందుపరిచారు. గండిపేట నుంచి ఘట్కేసర్ వరకు ఆక్రమణలను గుర్తించారు. రాజేంద్రనగర్, ఆసిఫ్నగర్, గోల్కొండ, బహదూర్పుర, నాంపల్లి, అంబర్పేట, ఉప్పల్లో ఎక్కువ శాతం ఆక్రమణలు ఉన్నట్లు 33 బృందాలు గుర్తించాయి. ఇప్పటి వరకు అన్ని మండలాల్లో కలిపి 12,182 అక్రమణాలు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు.
HYD, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో HYDRA సంస్థ పని చేస్తోంది. మొత్తం 70 మండలాలు విస్తరించి ఉంది. జీహెచ్ఎంసీతో పాటు నిజాంపేట, బండ్లగూడ జాగీర్, బడంగ్పేట, జవహర్ నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, మీర్పేట నగరపాలక సంస్థలు, 30 పురపాలక సంఘాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే HYDలో వణుకు పుట్టిస్తున్న సంస్థ, ఇక కార్పొరేషన్లలోనూ చర్యలు ప్రారంభించనుంది.
పంద్రాగస్టు, వారాంతపు సెలవుల నేపథ్యంలో ఈనెల 19, 20న మరో ఎనిమిది ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్- నర్సాపూర్ మార్గంలో 2, కాచిగూడ-తిరుపతి మార్గంలో 2, సికింద్రాబాద్- కాకినాడ టౌన్ మార్గంలో 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పీఆర్వో శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, నడికుడి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తాయని వెల్లడించారు.
ప్రభుత్వ భూముల రక్షణ, విపత్తు నిర్వహణ కోసం అతిపెద్ద సంస్థగా ఏర్పడిన HYDRA అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో HYDRA కమిషనర్ రంగనాథ్ IPS నేతృత్వంలో కొనసాగుతోంది. ఇద్దరు ఎస్పీలు, పలు విభాగాల అధికారులతో కలిపి దాదాపు 3,000 మందితో సంస్థ మరింత బలపడనుంది. ఇప్పటికే HYDలో ఆక్రమణలపై ఉక్కు పాదం మోపుతున్నారు.
అవుటర్ రింగ్ రోడ్డు లోపల మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పక్కా మురుగు నీటి వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ప్రణాళికకు జలమండలి రూపకల్పన చేస్తోంది. పకడ్బందీగా డ్రైనేజీ వ్యవస్థను తీర్చిదిద్దాలని యోచిస్తోంది. దాదాపు 4,600 కి.మీ మేరకు డ్రైనేజీ వ్యవస్థ అవసరమని జలమండలి గుర్తించింది. త్వరలో అవుటర్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ అమృత్ స్కీం, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో 32 మురుగు శుద్ధి కేంద్రాలు నిర్మించనుంది.
అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు కార్పొరేట్ స్కూళ్ల తరహాలో హైదరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులకు ‘కోడింగ్’పై శిక్షణ ఇస్తున్నారు. ఐదో తరగతి విద్యార్థులకు కోడింగ్ నేర్పిస్తున్నారు. బషీర్ బాగ్లోని మహబూబియా ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సులభంగా ఐప్యాడ్, ల్యాప్టాప్లను ఆంగ్లభాష సంకేతాలు, పదాలతో వాడుతున్నారు. ఐటీ సంస్థల ఉద్యోగులు, యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉచితంగా పాఠాలు చెబుతున్నారు.
12 ఏళ్ల వయసులోనే అనాథాశ్రమాలు, స్కూళ్లలో సొంతంగా లైబ్రరీలను ఏర్పాటు చేసిన HYDకు చెందిన ఆకర్షణను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు. రాష్ట్రపతి భవన్ ఆహ్వానం మేరకు 15న న్యూఢిల్లీలో జరిగిన ఎట్ హోమ్ రిసెప్షన్లో పేరెంట్స్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఇతరులకు విద్యాజ్ఞానం అందిస్తున్న ఆకర్షణను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. ప్రెసిడెంట్ సూచనతో మరింత ముందుకెళ్తామని ఆకర్షణ తెలిపారు.
పంద్రాగస్టు రోజే HYDలో ఓ అమ్మాయి వేధింపులకు గురైంది. మాదాపూర్లో జాబ్ చేసే యువతి(23) మెట్రో ఎక్కి JBS స్టేషన్లో దిగింది. సిద్దిపేట వెళ్లేందుకు బస్టాండ్కు పరుగులు తీసింది. అప్పటికే భారీ వర్షంతో బస్టాండ్ ఆవరణం నీళ్లతో నిండిపోయింది. దీంతో వెనక గేట్ నుంచి లోపలికి వెళుతుండగా.. గుర్తుతెలియని వ్యక్తి వెనకాలే వచ్చి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె మారేడ్పల్లి PSలో ఫిర్యాదు చేసింది.
12 ఏళ్ల వయసులోనే అనాథాశ్రమాలు, స్కూళ్లలో సొంతంగా లైబ్రరీలను ఏర్పాటు చేసిన HYDకు చెందిన ఆకర్షణను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు. రాష్ట్రపతి భవన్ ఆహ్వానం మేరకు 15న న్యూఢిల్లీలో జరిగిన ఎట్ హోమ్ రిసెప్షన్లో పేరెంట్స్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఇతరులకు విద్యాజ్ఞానం అందిస్తున్న ఆకర్షణను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. ప్రెసిడెంట్ సూచనతో మరింత ముందుకెళ్తామని ఆకర్షణ తెలిపారు.
Sorry, no posts matched your criteria.