India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కొడంగల్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 67 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 97 శాతం ఉత్తీర్ణతతో 65 మంది పాసైనట్లు ప్రిన్సిపల్ బలరాం తెలిపారు. పాఠశాలకు చెందిన హరిచంద్ 10/10, సునీల్ 9.8/10 జీపీఏ సాధించి టాపర్లుగా నిలిచారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది అభినందించారు.
ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించిన వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. హాస్టల్ మరమ్మతులు, విద్యార్థులు తమ తల్లిదండ్రులతో గడపాలనే ఉద్దేశంతో ప్రతియేటా వేసవి సెలవులు ఇస్తామని గుర్తు చేశారు. ఈ వేసవి సెలవులు కూడా ఆ నేపథ్యంలోనే ప్రకటించామని అన్నారు. పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సెలవులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
HYD నగరం ORR బయట శాటిలైట్ టౌన్ షిప్స్ నిర్మాణం పై HMDA కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రెండు ప్రాజెక్టులకు సంబంధించి దరఖాస్తులను HMDA స్వీకరించింది. RR జిల్లా దామర్లపల్లి-533 ఎకరాలు, నందిగామ పరిధి చేగురులో 100 ఎకరాల్లో షిప్స్ నిర్మాణానికి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను ఎన్నికల అనంతరం వేగవంతం చేయనున్నారు.
వంట బాగోలేదని భార్యను భర్త కొట్టి చంపిన దారుణ ఘటన HYD బాచుపల్లిలో చోటు చేసుకుంది. CI ఉపేందర్ రావు వివరాల ప్రకారం.. ప్రగతి కన్స్ట్రక్షన్ వద్ద మధ్యప్రదేశ్కు చెందిన దంపతులు లేబర్ పని చేస్తున్నారు. వంట బాగాలేదనే వాగ్వాదంలో భార్య రవినా దూబే(26)ని భర్త ఇటుకతో కొట్టి చంపినట్లు తెలిపారు. మృతదేహాన్ని గాంధీకి తరలించామని, ఘటన పై కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ను సరైన విధంగా సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులను అధికారులు సమర్ధంగా నిర్వహించాలంటే పోస్టల్ బ్యాలెట్ను సరైన విధంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
HYD, RR, MDCL జిల్లాల్లో ప్రాథమిక వైద్యాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని గర్భిణీలు, చిన్నారులకు, పౌష్టికాహారం పంపిణీ చేసే అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కార్డులు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యసేవలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు లబ్ధి పొందే వారి వివరాలపై కసరత్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోలీస్ స్టేషన్.. మక్త మాదారం గ్రామ పరిధిలోని బటర్ ఫ్లై వెంచర్లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారని షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు.
HYD నుంచి 200KM దూరంలో నల్లమల అడవుల్లో కొలువైన శ్రీశైల మల్లికార్జున దర్శనానికి వెళ్లేవారిని చల్లటి ప్రదేశం మల్లెల తీర్ధం కనువిందు చేస్తుంది. శ్రీశైలం వెళ్లే దారిలో ఫరహాబాద్ నుంచి వలవర్లపల్లి మీదుగా 15కి.మీ దూరం ప్రయాణిస్తే దట్టమైన అడవి వస్తుంది. వాహనాలు అపి కొద్ది దూరం వెళ్తే లోయలోకి సుమారు 300 మెట్లు ఉంటాయి. లోయలోకి దిగితే చల్లటి వాతావరణం శరీరాన్ని ఆవహిస్తుంది. ఇంకేం మరీ వేసవి టూర్ వెళ్దామా..!
యువతి స్నానం చేస్తుంటే ఓ ప్రబుద్ధుడు వీడియో తీశాడు. ఈ సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఓ లేడీస్ హాస్టల్లో ఉండే యువతి స్నానం చేసేందుకు వెళ్లారు. ఓ యువకుడు బాత్రూం విండో నుంచి సెల్ఫోన్తో వీడియో తీశాడు. ఇది గమనించిన అమ్మాయి గట్టిగా కేకలు వేసింది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు PSలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
10వ తరగతి ఫలితాల్లో హైదరాబాద్ వెనుకబడింది. 33 జిల్లాల వారీగా విడుదల చేసిన జాబితాలో 30వ స్థానంతో సరిపెట్టుకొంది. HYDలో మొత్తం 73,202 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 86.76 శాతంతో 63,511 మంది పాస్ అయ్యారు. 91.01 %తో 24వ స్థానంలో రంగారెడ్డి, 89.61 %తో మేడ్చల్ మల్కాజిగిరి 27వ స్థానం, 65.10%తో వికారాబాద్ జిల్లా చివరి(33) స్థానంలో నిలవడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.