India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD శివారు షాద్నగర్లో సునీత అనే మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో పోలీసులపై తొలి కేసు నమోదైంది. సస్పెన్షన్లో ఉన్న షాద్నగర్ డీఐ రాంరెడ్డితోపాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ఉద్దేశపూర్వకంగా హింస, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. బాధితురాలు సునీత ఈనెల 11వ తేదీన ఫిర్యాదు చేయగా ఈమేరకు కేసు నమోదైంది.
HYDలో హరీశ్ రావుపై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీMLA మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీశ్రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. ‘దమ్ముంటే రాజీనామ్ చెయ్.. రుణమాఫీ అయిపోయే..నీ రాజీనామా ఏడబోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
గ్రేటర్ HYDలో వివిధ కాలనీల్లో లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సదుపాయాలు కల్పించకపోవడంతో వారు వాటిలో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో వాటిని సమకూర్చేందుకు GHMC సిద్ధమైంది. ప్రస్తుతం శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు నియోజకవర్గాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు టెండర్లు పూర్తి చేసి పరికరాలను సమకూర్చుకొని అమర్చనుంది.
రంగారెడ్డి జిల్లా NSUI ఉపాధ్యక్షుడు అభిశేఖ్ బీఆర్ఎస్లో చేరారు. గురువారం రాజేంద్రనగర్, చేవెళ్ల, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుంచి పలువురు NSUI నాయకులు అభిశేఖ్ ఆధ్వర్యంలో కారెక్కారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో యువనాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ‘ఇక మార్పు మొదలైంది.. వలసలు పెరుగుతాయి’ అంటూ కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం రాజ్భవన్లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్ దంపతులతో కలిసి సీఎం అతిథులను మర్యాదపూర్వకంగా పలకరించారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్, శాసనసభ స్పీకర్, పలువురు మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.
పిల్లలకు బాల్యం నుంచే దేశ విశిష్టత పట్ల అవగాహన కల్పించాలని రాచకొండ సీపీ ఐపీఎస్ సుధీర్ బాబు ఐపీఎస్ సూచించారు. రాచకొండ కమిషనరేట్, నేరేడ్మెట్లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగనిరతిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్లోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జాతీయ జెండాను ఎగురవేశారు. సచివాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగనిరతిని కొనియాడారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబోయే ఈ వర్సిటీ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం విదితమే. ఈ క్రమంలో గవర్నర్ సంబంధిత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు.
గ్రేటర్ HYD సహా ఔటర్ ప్రాంతాల్లో నీటి సరఫరా చేస్తున్న వాటర్ బోర్డుకు కరెంటు బిల్లు గుదిబండగా మారింది. పంపింగ్ ద్వారా పెద్ద ఎత్తున నీటిని వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో రూ.105 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు నెలకు బిల్లులు వస్తున్నాయి. అయితే వాటర్ బోర్డు మెట్రో రైలు ప్రాజెక్టు తరహాలో రాయితీ ఇచ్చి, యూనిట్కు రూ.3.95 వసూలు చార్జీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
Sorry, no posts matched your criteria.