India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ HYD పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణానికి
23 ప్రదేశాల్లో అనుమతులు వచ్చినట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. పనులు చేపట్టేందుకు జోనల్ అధికారులు తగు చర్యలు
తీసుకోవాలన్నారు. మరోవైపు గ్రేటర్ వ్యాప్తంగా కుక్కల బెడద, కుక్క కాటుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కాన్ఫరెన్స్లో అధికారులను ఆదేశించారు.
వందల ఏళ్లు పరాయి పాలనలో మగ్గిన భారతీయులకు 1947 ఆగస్ట్ 15న విముక్తి లభిస్తే.. హైదరాబాద్లో మాత్రం నిర్బంధం కొనసాగింది. కొందరు విద్యావంతులు రేడియో ప్రసారాల ద్వారా వాటిని తెలుసుకున్నారు. పైగా స్వాతంత్ర్యం శుక్రవారం వచ్చింది. ఆరోజు ఇక్కడ అన్నింటికీ సెలవు. దీంతో విద్యాసంస్థలు, దుకాణాలు బంద్ అయ్యాయి. ఉద్యమాలు చేసిన విద్యార్థులు, యువత సంబరాలు జరుపుకోలేకపోయారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వసతి గృహాల్లోని విద్యార్థులకు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కిటికీలు, తలుపులు, విద్యుత్ సరఫరా తదితర సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యలు పంచాయతీ కార్యదర్శి లోకల్ బాడీ వారి సహకారం తీసుకోవాలన్నారు. వార్డెన్లతో ప్రతివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యలపై ఆరాతీసి పరిష్కరించాలని ఆయన సూచించారు.
విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి నిందితులను పట్టుకునే పోలీసులను సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ, రెండేళ్ల క్రితం హెడ్ కానిస్టేబుల్ యాదయ్య 7కత్తి పోట్లకు గురైనా.. తెగించి నిందితులను పట్టుకున్నారు. దీంతో ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి శౌర్య పతకం ఆయనను వరించింది. దీనికి ఎంపికైన ఏకైక పోలీస్ యాదయ్య కావడం విశేషం. నాడు మాదాపూర్లో మహిళ మెడలో చైన్ లాక్కెళ్లినవారిని పట్టుకునే క్రమంలో బొల్లారంలో ఆయనపై దాడిచేశారు.
గ్రేటర్ HYD నగరాన్ని గ్రేటెస్ట్ హైదరాబాద్గా చేస్తామని ఐటి మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు. HYD నగరానికి ప్రపంచ దేశాల నుంచి భారీ పెట్టబడులు తీసుకొచ్చామన్నారు. మూసీ నది ప్రక్షాళన కోసం నిధులు కేటాయించామని, గ్రేటర్ హైదరాబాద్ కోసం బడ్జెట్లో పెద్దపీట వేశామన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
రాయదుర్గం పీఎస్ పరిధిలో బాలిక కిడ్నాప్కు గురైంది. స్కూల్కు వెళ్లి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంబడే ప్రత్యేక టీమ్ గాలింపు చేపట్టింది. సీసీ ఫుటేజీ ఆధారంగా బాలికను పోలీసులు గంటలో సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాజ్ భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ను మేయర్ శాలువాతో సన్మానించి సత్కరించారు. నూతనంగా గవర్నర్గా నియామకమైనందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా గవర్నర్ పరిపాలన అందించాలని ఆకాంక్షించారు.
అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనను విజయవంతంగా ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మణికొండలోని కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వివిధ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 20వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలను విజయవంతంగా ముగించుకుని రాష్ట్రనికి రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో సీఎంకు ఎమ్మెల్యే పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెట్టుబడులే లక్ష్యంగా సీఎం పర్యటన సాగిందన్నారు.
Sorry, no posts matched your criteria.